Bombay High Court: ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం.. బిడ్డను తన తల్లి నుంచి వేరు చేయడం ‘‘క్రూరత్వం’’గా పరిగణించబడుతుందని బాంబే హైకోర్టు పేర్కొంది. జల్నాకు చెందిన మహిళ తన అత్తామామలపై నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు నిరాకరించింది. ఔరంగాబాద్లోని న్యాయమూర్తుల విభా కంకన్వాడీ, రోహిత్ జోషిలతో కూడా ధర్మాసనం డిసెంబర్ 11న తన ఉత్తర్వుల్లో.. దిగువ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ మహిళకు, తన నాలుగేళ్ల కూతురని దూరంగా ఉంచుతున్నట్లు గమనించింది.
Patna High Court: అసభ్యకరమైన భాషలో తిట్టుకున్న భార్య, భర్తల కేసులో పాట్నా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యని ‘భూతం’, ‘పిశాచి’ అని పిలువడం క్రూరత్వం కిందకు రాదని కోర్టు పేర్కొంది.