Home
Rajnath Singh
Rajnath Singh News
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారణాసి పర్యటనలో ఉన్నారు.. ఇక, ఆయన శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఆయన కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి సీఎం చంద్రబాబు ఆలయానికి వెళ్లారు.… -
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్లో
వాణిజ్యపరంగా, వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆదిలాబాద్ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ (JUA) ప్రాజెక్టు పురోగతిపై న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుతో కలిసి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మొత్తం ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరే దిశగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు… -
India-Sri Lanka: భారత్కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
India-Sri Lanka: భారత్, శ్రీలంక మధ్య రక్షణ, సముద్ర భద్రతా సహకారం మరింత బలోపేతమవుతోంది. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ భద్రత, సముద్ర భాగస్వామ్యం, రక్షణ సహకారంపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా భారత్ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా తమ భూభాగాన్ని ఎలాంటి కార్యకలాపాలకు ఉపయోగించనివ్వబోమని దిసానాయకే స్పష్టం చేశారు. హిందూ మహాసముద్రంలో… -
Rajnath Singh: భారత్కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయ పరిశ్రమకు బదిలీ చేయడానికి ఆయన ఆమోదం తెలిపారు. ఈ టెక్నాలజీ బదలాయింపుతో దేశంలోనే క్షిపణుల ఉత్పత్తికి మార్గం సుగమమైంది. గతంలో ప్రభుత్వం రంగ సంస్థల వద్ద ఉన్న ఈ టెక్నాలజీని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం ద్వారా క్షిపణుల ఉత్పత్తి మరింత పెరగనుంది. ఇదే సమయంలో… -
Rajnath Singh: భారత్ డేటా సెంటర్లు నిర్మిస్తే.. పాకిస్థాన్ ఉగ్రవాద కేంద్రాలు నిర్మిస్తోంది..
Rajnath Singh: భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భగా లడఖ్లోని ద్రాస్ వద్ద ఆయన ప్రసంగించారు. ఒకవైపు భారతదేశం ఆవిష్కరణలు, అభివృద్ధి దిశగా శరవేగంగా దూసుకెళ్తుంటే.. మరోవైపు పాకిస్థాన్ మాత్రం సరిహద్దు తీవ్రవాదానికే మద్దతు ఇస్తూ నాశనమవుతోందని స్పష్టమైన వ్యత్యాసాన్ని ఎత్తిచూపారు. "భారత్ డేటా సెంటర్లను నిర్మిస్తుంటే.. పాకిస్థాన్ మతోన్మాద కేంద్రాలను (Radicalisation centres) నిర్మిస్తోంది. భారత్ యూపీఐ (UPI) ద్వారా ప్రపంచాన్ని అనుసంధానిస్తుంటే,… -
Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
Kusha Missile: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో ఘనత సాధించింది. స్వదేశీ టెక్నాలజీతో తయారైన లాంగ్ రేంజ్ సర్ఫేజ్-టూ-ఎయిర్ మిస్సైల్ (LRSAM) ‘‘కుశ’’ను విజయవంతంగా పరీక్షించింది. గురువారం ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి తొలి ఫ్లైట్ టెస్ట్ జరిగింది. ఈ మిస్సైల్ విజయవంతం కావడంతో భారత వైమానిక రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఈ విషయం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.… -
Rajnath Singh: విద్యార్థులను రాజకీయాలకు వాడుకుంటారా? విపక్షాలపై రాజ్నాథ్సింగ్ ఫైర్
ప్రతిపక్షాలపై కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. విద్యార్థులను రాజకీయాలకు వాడుకుంటారా? అంటూ మండిపడ్డారు. గత కొద్దిరోజులుగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై సీజేపీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్నాయి. -
Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
భారత నౌకాదళం కేవలం యుద్ధాల్లో పోరాడే బలగమే కాదని... దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడే శక్తివంతమైన రక్షకుడిగా కూడా నిలిచిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలోని నావల్ డాక్యార్డ్లో అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిను భారత నౌకాదళంలో అధికారికంగా ప్రవేశపెట్టిన సందర్భంగా రాజ్నాథ్సింగ్ ప్రసంగించారు. -
INS Mahendragiri: సాహో భారత్.. సముద్రాన్ని శాసించేందుకు వచ్చిన ‘INS మహేంద్రగిరి’! శత్రుదేశాల గుండెల్లో వణుకే..
INS Mahendragiri: భారత రక్షణ రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. దేశీయ పరిజ్ఞానంతో అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ మహేంద్రగిరి’ (INS Mahendragiri) ఈ రోజు అధికారికంగా భారత నౌకాదళంలోకి చేరింది. శనివారం విశాఖపట్నం నావల్ డాక్యార్డ్లో జరిగిన ఒక సదస్సులో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఈ యుద్ధనౌకను అధికారికంగా ఇండియన్ నేవీలో చేర్చారు. ఇది ప్రాజెక్ట్ 17ఏ కింద దేశీయంగా నిర్మించిన ఆరో యుద్ధనౌక కావడం గమనార్హం. దీనిని… -
INS Mahendragiri: భారత నౌకాదళంలోకి స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. ఆత్మనిర్భర్ భారత్కు మరో మైలురాయి
భారత నౌకాదళం మరో అత్యాధునిక స్వదేశీ యుద్ధనౌకను తన శక్తివంతమైన నౌకాదళంలో చేర్చుకుంది. విశాఖపట్నంలోని నావల్ డాక్యార్డ్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారికంగా ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రికి నౌకాదళ అధికారులు గౌరవ వందనం సమర్పించారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి ప్రాజెక్ట్-17A నీలగిరి తరగతికి చెందిన ఆరవ స్టెల్త్ ఫ్రిగేట్. ఈ యుద్ధనౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో (WDB) రూపొందించగా, మజగావ్…
తాజావార్తలు
-
Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
-
Passport New Rules 2026: పాస్పోర్ట్ నిబంధనలు, ఫీజుల్లో మార్పులు.. కొత్త ఛార్జీలు ఇవే
-
Biggest Flop Movies : ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తెచ్చిన టాప్ సినిమాలు ఇవే..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
ట్రెండింగ్
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!