Meta: “మెటా”కి పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు.. జుకర్బర్గ్ వ్యాఖ్యలపై భారత్ ఫైర్..
- భారత ఎన్నికలపై మెటా చీఫ్ జుకర్బర్గ్ వ్యాఖ్యలు..
- మెటాకి పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు..
- ఈ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meta: 2024 భారత సార్వత్రిక ఎన్నికలపై ఫేస్బుక్ మాతృసంస్థ మెటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జనవరి 10న న్యూఢిల్లీలో జరిగిన జో రోగన్ పాడ్కాస్ట్లో ఆయన పాల్గొన్నారు. జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలపై మెటాకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ చేయనుంది. తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసినందుకు మెటాకు సమన్లు జారీ చేస్తామని బీజేపీ ఎంపీ, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై హౌస్ ప్యానెల్ చైర్మన్ నిషికాంత్ దూబే తెలిపారు.
Read Also: Jammu Kashmir: భారత్-పాక్ సరిహద్దుల్లో మందుపాతర పేలుడు..ఆరుగురు జవాన్లకు గాయాలు..
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
‘‘ఒక ప్రజాస్వామ్య దేశం గురించి తప్పుడు సమాచారం దాని ప్రతిష్టని దిగజార్చుతుంది. ఈ తప్పుకు ఆ సంస్థ పార్లమెంట్కి, ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది’’ అని దూబే ఎక్స్లో ట్వీట్ చేశారు.
ఈ పాడ్కాస్ట్లో జుకర్బర్గ్ మాట్లాడుతూ.. గతేడాది భారత్ సహా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటమి చెందాయని చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తోసిపుచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్లో ఎన్డీయేని ప్రజలు మూడోసారి గెలిపించిన విషయాన్ని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటర్లు ఓటేసినట్లు చెప్పారు. కోవిడ్ తర్వాత భారత్ సహా అనేక దేశాల్లో ప్రభుత్వాలు ఓడిపోయాయని జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని ఆయన చెప్పారు. కోవిడ్ సమయంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహారం, 2.2 బిలియన్ల ఉచిత వ్యాక్సిన్లను అందించిన దేశంగా భారత్ నిలిచిందని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!