Meta: “మెటా”కి పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు.. జుకర్బర్గ్ వ్యాఖ్యలపై భారత్ ఫైర్..
- భారత ఎన్నికలపై మెటా చీఫ్ జుకర్బర్గ్ వ్యాఖ్యలు..
- మెటాకి పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు..
- ఈ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meta: 2024 భారత సార్వత్రిక ఎన్నికలపై ఫేస్బుక్ మాతృసంస్థ మెటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జనవరి 10న న్యూఢిల్లీలో జరిగిన జో రోగన్ పాడ్కాస్ట్లో ఆయన పాల్గొన్నారు. జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలపై మెటాకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ చేయనుంది. తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసినందుకు మెటాకు సమన్లు జారీ చేస్తామని బీజేపీ ఎంపీ, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై హౌస్ ప్యానెల్ చైర్మన్ నిషికాంత్ దూబే తెలిపారు.
Read Also: Jammu Kashmir: భారత్-పాక్ సరిహద్దుల్లో మందుపాతర పేలుడు..ఆరుగురు జవాన్లకు గాయాలు..
Also Read
- VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
‘‘ఒక ప్రజాస్వామ్య దేశం గురించి తప్పుడు సమాచారం దాని ప్రతిష్టని దిగజార్చుతుంది. ఈ తప్పుకు ఆ సంస్థ పార్లమెంట్కి, ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది’’ అని దూబే ఎక్స్లో ట్వీట్ చేశారు.
ఈ పాడ్కాస్ట్లో జుకర్బర్గ్ మాట్లాడుతూ.. గతేడాది భారత్ సహా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటమి చెందాయని చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తోసిపుచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్లో ఎన్డీయేని ప్రజలు మూడోసారి గెలిపించిన విషయాన్ని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటర్లు ఓటేసినట్లు చెప్పారు. కోవిడ్ తర్వాత భారత్ సహా అనేక దేశాల్లో ప్రభుత్వాలు ఓడిపోయాయని జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని ఆయన చెప్పారు. కోవిడ్ సమయంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహారం, 2.2 బిలియన్ల ఉచిత వ్యాక్సిన్లను అందించిన దేశంగా భారత్ నిలిచిందని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
-
PEDDI POWERPLAY TOUR : ‘పెద్ది’ ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
-
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
-
Vivo Y60 5G: 6500mAh బ్యాటరీతో వివో Y60 5G విడుదల.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!