PM Modi: ఆర్మీ హిమాలయాల వలే దృఢంగా నిలబడినంత కాలం భారత్ సురక్షితం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ గత సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ సారి కూడా దీపావళి వేడుకలను భారత సైన్యంతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చాలో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘మన సైన్యం దేశ సరిహద్దుల్లో హిమాలయాల మాదిరి దృఢంగా నిలబడినంత కాలం భారత్ సురక్షితంగా ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
Read Also: Himaja Arrest: నేను అరెస్టు కాలేదు.. పోలీసులు అందుకే వచ్చారు- వీడియో రిలీజ్ చేసిన హిమజ
Also Read
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
ప్రపంచవ్యాప్తంగా వివాదాల మధ్య సరిహద్దుల్లో భద్రత కల్పించడంలో ఆర్మీ పాత్రను ఆయన కొనియాడారు. ఈ రోజు ప్రపంచ పరిస్థితలను బట్టి, భారతదేశంపై అంచనాలు నిరంతరం పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో భారత సరిహద్దుల్ని సురక్షితంగా ఉంచడం ముఖ్యమని అన్నారు. మనం దేశంలో శాంతి వాతావరణాన్ని సృష్టిస్తున్నాము.. ఇందులో ఆర్మీ పాత్ర చాలా కీలకం అని ప్రధాని మోదీ అన్నారు. ‘‘నేను ప్రతీ ఏడాది మా ఆర్మీ సిబ్బందితో దీపావళి జరుపుకుంటున్నాను.. రాముడు ఉన్న అయోధ్య అని అంటారు.. నా వరకు మాత్రం భారత ఆర్మీ సిబ్బంది ఉన్న అయోధ్య అని, నేను ప్రధాని, సీఎంగా లేనప్పుడు కూడా దీపావళి జరుపుకునేందుకు సరిహద్దు ప్రాంతాలకు వెళ్లాను’’ అని మోడీ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆర్మీ ఎన్నోయుద్ధాలు చేసి దేశ హృదయాలను గెలుచుకున్నారని, అంతర్జాతీయ శాంతి మిషన్లో సైన్యం వల్లే భారత దేశ గ్లోబర్ ఇమేజ్ పెరిగిందని ప్రధాని కొనియాడారు.
లెప్చాలో సైనిక శిబిరాన్ని ఈ రోజు ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడి సైనికులతో ముచ్చటించారు. మిలిటరీ దుస్తులు ధరించిన మోడీ సైనికులతో మమేకమయ్యారు. 2014 నుంచి ప్రధాని మోదీ ప్రతీ సంవత్సరం సైనికులతో దీపావళిని జరుపుకుంటున్నారు. 2014లో తొలిసారి సియాచిన్ లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. గతేడాది కార్గిల్లో దీపావళి జరుపుకున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!