J&K Terror Attacks: ఉగ్రవాదులు జైలుకు లేదా “నరకానికి”.. పార్లమెంట్లో కేంద్రం సమాధానం..
- ఉగ్రవాదులు జైలుకు లేదా నరకానికి..
- రాజ్యసభలో కేంద్రం సమాధానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
J&K Terror Attacks: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదానికి పాల్పడుతున్న వారు జైలుకు వెళ్తారు లేదా ‘నరకానికి’ వెళ్లారని రాజ్యసభలో కేంద్రం హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం సమాధానమిచ్చారు. ఉగ్రవాదాన్ని మోడీ సర్కార్ సహించబోదని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జమ్మూకాశ్మీర్లో జరగుతున్న ఉగ్రదాడుల గురించి ఆయన మాట్లాడారు. ఉగ్రవాదులు ఎప్పటికీ విజయం సాధించలేరని మంత్రి చెప్పారు.
Read Also: Indra Re Release: మెగా ఫాన్స్.. పులకించిపోవడానికి రెడీ అవ్వండి!
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
గత కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్లో 28 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, కొందరు భద్రతా సిబ్బంది కూడా మరణించారని, ఇది చాలా దురదృష్టకరమని నిత్యానంద రాయ్ అన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భద్రతా దళాలు ఈ ప్రాంతంలో సుమారు 900 మంది ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు చెప్పారు. ‘‘ మోడీ ప్రభుత్వం తీవ్రవాదాన్ని సహించేది లేదని, ఉగ్రవాదులు జైలులో లేదా జహనుమ్(నరకం)లో ఉంటారని నేను సభకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను’’ అని మంత్రి అన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ సర్కార్ అధికారంలో ఉన్న 2004-14 మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్లో 7217 ఉగ్రవాద ఘటనలు జరిగాయి. బీజేపీ అధికారంలో ఉన్న 2014 నుంచి ఈ ఏడాది జూలై 21 వరకు ఈ సంఖ్య 2259కి తగ్గిందని నిత్యానంద రాయ్ చెప్పారు. ఇలాంటి ఉగ్రదాడులు జరగకూడదని, వీటిపై ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని హితవు పలికారు.2004 నుంచి 2014 మధ్య కాలంలో 2,829 మంది పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని.. 2014 నుంచి ఈ సంఖ్య 67 శాతం తగ్గిందని వెల్లడించారు. అంతేకాకుండు ఉగ్రవాద ఘటనలు 69 శాతం తగ్గాయని రాజ్యసభలో చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారు, భద్రతకు ప్రభుత్వం పూర్తి హామీ ఇస్తుందన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!