Haryana: హర్యానా బీజేపీలో అలకలు.. టికెట్ల నిరాకరణతో నేతల కంటతడి
- హర్యానా బీజేపీలో అలకలు
- టికెట్ల నిరాకరణతో నేతల కంటతడి
- సీఎం సైనీకి షేక్ హ్యాండ్ ఇవ్వని మాజీ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా బీజేపీలో అభ్యర్థుల ప్రకటన తర్వాత తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేకెత్తించింది. పలువురు సీనియర్ నాయకులకు, మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు అధిష్టానం టికెట్లు నిరాకరించింది. దీంతో నేతలు తీవ్ర అసంతృప్తి రగిలిపోతున్నారు. కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో సమావేశం అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగింపులు చేస్తు్న్నారు. అయితే నాయకుల మాత్రం.. ముఖ్యమంత్రికి కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా నిరాకరిస్తున్నారు. కోపంతో రగిలిపోతున్నట్లుగా నాయకుల ముఖాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Haryana: హర్యానా బీజేపీలో అలకలు.. టికెట్ల నిరాకరణతో నేతల కంటతడి
Also Read
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
హర్యానా ఓబీసీ మోర్చా నాయకుడు, మాజీ మంత్రి కరణ్ దేవ్ కాంబోజ్కి ఈసారి టికెట్ లభించలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు మాజీ మంత్రి ఇంటికి సీఎం సైనీ వెళ్లారు. కానీ సైనీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు. అనంతరం ముఖ్యమంత్రి కుర్చీ పక్కనే కూర్చున్న.. కనీసం ఆయన ముఖాన్ని కూడా చూసేందుకు ఇష్టపడలేదు. రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టుకుంటూ వచ్చిన మాజీ మంత్రి.. ముఖ్యమంత్రి షేక్ హ్యాండ్ ఇవ్వగా.. చేతులు వెనక్కి లాక్కు్న్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే కాంబోజ్.. రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా చీఫ్ పదవికి కూడా రాజీనామా చేశారు.
ఇది కూడా చదవండి: Drunk Man Dial 100: ఫుల్లుగా తాగి డయల్ 100కి ఫోన్ చేస్తున్న వ్యక్తికి జైలు శిక్ష
బీజేపీకి విధేయులు అవసరం లేదనుకుంటా? అని కరణ్ దేవ్ కాంబోజ్ వ్యాఖ్యానించారు. సంవత్సరాలుగా సేవ చేసిన వారిని బీజేపీ విస్మరించిందన్నారు. ఒక రోజు ముందు పార్టీ మారిన వారికి టికెట్లు ఇచ్చారని కాంబోజ్ ఆరోపించారు. మరో వీడియోలో జాబితాలో పేరులేనందుకు సోనిపట్లో తన మద్దతుదారులతో జరిగిన సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకురాలు కవితా జైన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఐదేళ్లుగా పార్టీ కోసం పని చేసినట్లు తెలిపారు. కనీసం హాస్టల్లో ఉన్న కూతురిని కూడా చూడలేదని.. అంతగా పార్టీ కోసం కష్టపడినట్లు వివరించారు.
మరో బీజేపీ ఎమ్మెల్యే శశి రంజన్ పర్మార్కు కూడా బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు టికెట్ వస్తుందని ఆశించానని.. తీరా చూస్తే తనకు టికెట్ రాలేదని వాపోయారు. తన పేరు పరిశీలనలో ఉందని తన నియోజకవర్గ ప్రజలకు చెప్పానన్నారు. కానీ తీరా చూస్తే టికెట్ దక్కలేదని రంజన్ కంటతడి పెట్టారు.
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇటీవలే కమలం పార్టీ 67 స్థానాలకు తొలి జాబితాను ప్రకటించింది. ఇంకా 23 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అక్టోబర్ 5న పోలింగ్, అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇది కూడా చదవండి: Guntur Crime: లేడీ కిల్లర్స్.. అప్పు తీసుకుంటారు.. అడిగితే కూల్ డ్రింక్లో సైనైడ్ కలిపి చంపేస్తారు..!
తాజావార్తలు
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!