TPCC Chief : టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Chief : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. టీపీసీసీ చీఫ్గా మహేష్కుమార్గౌడ్ను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్కు పగ్గాలు అప్పగిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. కొత్త పీసీసీ చీఫ్ నియామక ఆదేశాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్ పని చేస్తున్నారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పని చేసిన అనుభవం ఉంది. 2023లో పీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్ఎస్యూఐ నుంచి పార్టీ ఆర్గనైజేషన్లో మహేష్ కుమార్ గౌడ్ పని చేశారు.
Read Also: Drunk Man Dial 100: ఫుల్లుగా తాగి డయల్ 100కి ఫోన్ చేస్తున్న వ్యక్తికి జైలు శిక్ష
Also Read
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- India vs Sri Lanka: ఒకప్పుడు భారత్కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
టీపీసీసీ పదవి కోసం పలువురు పోటీ పడగా.. మహేష్కుమార్ గౌడ్ను పీసీసీ పదవి వరించింది. పీసీసీ కోసం ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్లతో పాటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడినప్పటికీ మహేష్కుమార్ గౌడ్కు అధిష్ఠానం పగ్గాలను అప్పగించింది. పీసీసీ చీఫ్గా జులై 7న రేవంత్ పదవీకాలం పూర్తయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. బీసీ నేతకు పార్టీ అధ్యక్షుడి పదవీ కట్టబెట్టడంతో బీసీ సంఘాలు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రేపు హైదరాబాద్కు రానున్నారు. మహేష్కుమార్ గౌడ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఆయనకు ఫోన్ చేసి అభినందించడంతో పాటు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని.. అందరినీ కలుపుకుని పని చేయాలని సూచించారు. నూతన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని అనడానికి తానే నిదర్శనమన్నారు. ఎన్ఎస్యూఐ నుంచి పార్టీ కోసం తాను పని చేశానన్నారు. పార్టీ కోసం పని చేసిన అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.
తాజావార్తలు
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
-
Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
-
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!