Delhi Cloud-Seeding Trials: వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి కొత్త ప్రయోగం..! ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్..!
- కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం..
- క్లౌడ్-సీడింగ్ ట్రయల్స్ నిర్వహించనున్న ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Cloud-Seeding Trials: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వెంటాడుతూనే ఉంది.. అయితే, కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందట.. దీనికోసం క్లౌడ్-సీడింగ్ ట్రయల్స్ నిర్వహిస్తుంది.. ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తుండగా.. ఒక్కొక్కటి వేర్వేరు రోజుల్లో, విమానాలు మేఘాలలోకి రసాయనాలను ఇంజెక్ట్ చేయడానికి ఒకటి నుండి ఒకటిన్నర గంటల పాటు పనిచేస్తాయని ఓ అధికారి తెలిపారు. వాతావరణ పరిస్థితులను బట్టి, బహుశా ఒక వారంలోపు ట్రయల్స్ త్వరితగతిన నిర్వహించవచ్చని పేర్కొన్నారు.. ఐదు ట్రయల్స్ను వారంలోపు లేదా ఒకటి లేదా రెండు రోజుల వ్యవధిలో నిర్వహించవచ్చు. షెడ్యూల్ క్లౌడ్ లభ్యతపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు.
Read Also: Nithin : తమ్ముడు సినిమా నుంచి ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ రిలీజ్..
Also Read
క్లౌడ్-సీడింగ్, లేదా కృత్రిమ వర్షం అనేది నిర్దిష్ట పదార్థాలను మేఘాలలోకి చెదరగొట్టడం ద్వారా వర్షపాతాన్ని ప్రేరేపించే ఒక టెక్నిక్, ఇది ఇతర వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే చివరికి వర్షానికి దారితీస్తుంది.. అయితే, ఈ ట్రయల్స్ కోసం ప్రదేశాలను ఇంకా ఖరారు చేయలేదని ఓ అధికారి అంటున్నారు.. ప్రణాళిక నుండి అమలు వరకు ప్రయోగానికి నాయకత్వం వహిస్తున్న ఐఐటీ కాన్పూర్, వివిధ శాస్త్రీయ, లాజిస్టికల్ అంశాల ఆధారంగా సైట్లను ఎంపిక చేయనున్నారు.. భద్రత మరియు గగనతల పరిమితుల కారణంగా లుటియెన్స్ ఢిల్లీతో సహా నగరంలో లేదా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ట్రయల్స్ నిర్వహించలేమని.. అందువల్ల, కార్యకలాపాలు ఢిల్లీ శివార్లలో జరుగుతాయి, ఇక్కడ వాతావరణ పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
Read Also: Anurag Kashyap : విజయ్ సేతుపతి వల్లే నా కూతురు వివాహం చేశా.. స్టార్ డైరెక్టర్ కామెంట్స్
ప్రతి ట్రయల్ సమయంలో, ఒక విమానం ఒకటి నుండి ఒకటిన్నర గంటలు పనిచేస్తుందని.. దీనికి సంబంధించిన ఖచ్చితమైన షెడ్యూల్ త్వరలో ఖరారు చేయబడుతుందని, మొదటి ట్రయల్ మే లేదా జూన్ చివరి నాటికి నిర్వహించబడే అవకాశం ఉందంటున్నారు.. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి కొత్త ప్రయత్నంగా, మే 7న ఢిల్లీ మంత్రివర్గం ఐదు క్లౌడ్-సీడింగ్ ట్రయల్స్ నిర్వహించాలనే ప్రతిపాదనను ఆమోదించింది.. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 3.21 కోట్లు.. ఇందులో ట్రయల్స్కు రూ. 2.75 కోట్లు అంటే ఒక ట్రయల్కు రూ. 55 లక్షల వరకు అవుతుంది.. ఇక, పరికరాల క్రమాంకనం, లాజిస్టిక్స్, సన్నాహక పనుల కోసం రూ. 66 లక్షల వన్-టైమ్ సెటప్ ఖర్చు చేయాల్సి ఉందంటున్నారు.. దీనికోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, రక్షణ మంత్రిత్వ శాఖ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో సహా 13 కీలక విభాగాల నుండి ప్రభుత్వం నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (NOCలు) పొందే ప్రక్రియలో ఉంది.ఇది క్లిష్టమైన కాలుష్య సమయాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా శాస్త్రీయ జోక్యంగా చెప్పువచ్చు అంటున్నారు. ఇది మా AI- ఆధారిత పర్యవేక్షణ మరియు 24×7 నిఘా ప్రయత్నాలను పూర్తి చేస్తుందని.. ఢిల్లీ నివాసితులకు స్వచ్ఛమైన గాలిని అందించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనం అంటున్నారు..
తాజావార్తలు
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
-
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!