Congress: రాజస్థాన్లో కాంగ్రెస్కి భారీ షాక్.. సోనియా గాంధీ, ఖర్గే సభ మరుసటి రోజే బీజేపీలోకి వలసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్కి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు పెరిగాయి. సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ జరిగిన మరుసటి రోజే పలువురు కీలక నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గంగాజల్ మీల్, పీసీసీ ఉపాధ్యక్షుడు సుశీల్ శర్మ సహా పలువురు నేతలు పార్టీని వీడి ఆదివారం బీజేపీలో చేరారు. సూరత్ గఢ్ నంచి కాంగ్రెస్ తరుపున అసెంబ్లీకి పోటీ చేసిన హనుమాన్ మీల్, మాజీ పీసీసీ ఉపాధ్యక్షుడు అశోక్ అవస్తీలు బీజేపీ నాయకులు ఓంకార్ సింగ్ లఖావత్, నారాయణ్ పంచరియా మరియు అరుణ్ చతుర్వేది సమక్షంలో బిజెపిలో చేరారు.
Read Also: Chittoor Crime: మైనర్పై అత్యాచారం.. అవమానం తట్టుకోలేక బాలిక ఆత్మహత్య
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
వర్గపోరు కారణంగా అంకితభావంతో పనిచేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తల్లో నిరాశ నెలకొందని సుశీల్ శర్మ ఆరోపించారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ కోసం పనిచేశానని, అయితే ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తల మాట వినేవారు లేరన్నారు. అయోధ్య రామమందిర విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా సనాతన ధర్మాన్ని విశ్వసించే తనలాంటి కార్యకర్తలు నిరాశకు గురయ్యారని చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తన సత్తా నిరూపించుకుందని, దీని ప్రభావంతో జాతీయవాద ఆలోచనతో కాంగ్రెస్ని వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల టికెట్ల విషయంలో పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా, మాజీ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మీల్ ఆరోపించారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ సుఖ్జీందర్ సింగ్ రంధావాకు ఫిర్యాదు చేసినా కూడా వినలేదని చెప్పారు. జైపూర్లోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో పాటు, రిటైర్డ్ అధికారులతో సహా వివిధ రంగాలకు చెందిన పలువురు వ్యక్తులు బీజేపీలో చేరారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్లోని లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19,26 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!