AAP vs BJP: ఈ ఏడాదైనా అబద్ధాలు మానుకోంది.. కేజ్రీవాల్ లేఖపై బీజేపీ ఫైర్..
- న్యూ ఇయర్ రోజు ఆప్, బీజేపీల మధ్య లేఖల యుద్ధం..
- ఈ ఏడాదైనా అబద్ధాలు చెప్పడం మానాలని కేజ్రీవాల్పై సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP vs BJP: న్యూ ఇయర్ రోజు ఆప్, బీజేపీ మధ్య లేఖల యుద్ధం సాగుతోంది. ముందుగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీని ఉద్దేశిస్తూ, ఆర్ఎస్ఎస్కి లేఖ రాయడంతో వివాదం మొదలైంది. బీజేపీ చర్యలను ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తుందా..? అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కి లేక రాశారు. అయితే, దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఈ ఏడాదైనా అబద్ధాలు చెప్పడం మానుకోవాలని కేజ్రీవాల్కి బీజేపీ హితవు పలికింది. కేజ్రీవాల్ చేసిన 10 హామీను కమలం పార్టీ హైలెట్ చేసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన దశాబ్ధం గడిచినా వాటిలో ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు.
“విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని, స్వచ్ఛమైన తాగునీరు అందిస్తానని, విద్యావ్యవస్థను మెరుగుపరుస్తానని, ఆరోగ్య సంరక్షణను పెంపొందించుకుంటానని, పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్ధారిస్తానని, మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తానని, మురికివాడల నివాసితులకు గృహాలను అందిస్తానని, యమునా నదిని శుభ్రం చేస్తామని కేజ్రీవాల్ వాగ్దానం చేశారు. ఈ హామీలలో ఒక్కటి నెరవేర్చలేదు’’ అని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది విలేకరుల సమావేశంలో ఆరోపించారు.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
Read Also: Shocking: ‘‘ వారి గౌరవాన్ని కాపాడా ’’.. తల్లి, నలుగురు చెల్లెళ్లను చంపిన వ్యక్తి..
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడిని ప్రస్తావిస్తూ.. కేజ్రీవాల్ నగరంలోని మహిళ భద్రతకు హామీ ఇచ్చారు, ముఖ్యమంత్రి నివాసంలోనే ఓ మహిళా ఎంపీపై దాడి జరిగింది, ఇలాంటిది దేశంలో తొలి సంఘటన అని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని చెబుతూ, ఇప్పుడు అవినీతికి పాల్పడుతున్నారని సుధాన్షు త్రివేది ఆరోపించారు.
దీనికి ముందు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా కేజ్రీవాల్కి లేఖ రాశారు. కొత్త ఏడాది నుంచి కేజ్రీవాల్ అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, తప్పుడు వాగ్దానాలు చేయడం వంటి 5 తీర్మానాలు చేయాలని కోరారు. కేజ్రీవాల్ మోహన్ భగవత్కి లేఖ రాస్తూ.. బీజేపీ ఓట్లను కొనుగోలు చేసిందని, ఓటర్ల జాబితాలో తారుమారు చేసిందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!