AAP vs BJP: ఈ ఏడాదైనా అబద్ధాలు మానుకోంది.. కేజ్రీవాల్ లేఖపై బీజేపీ ఫైర్..
- న్యూ ఇయర్ రోజు ఆప్, బీజేపీల మధ్య లేఖల యుద్ధం..
- ఈ ఏడాదైనా అబద్ధాలు చెప్పడం మానాలని కేజ్రీవాల్పై సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP vs BJP: న్యూ ఇయర్ రోజు ఆప్, బీజేపీ మధ్య లేఖల యుద్ధం సాగుతోంది. ముందుగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీని ఉద్దేశిస్తూ, ఆర్ఎస్ఎస్కి లేఖ రాయడంతో వివాదం మొదలైంది. బీజేపీ చర్యలను ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తుందా..? అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కి లేక రాశారు. అయితే, దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఈ ఏడాదైనా అబద్ధాలు చెప్పడం మానుకోవాలని కేజ్రీవాల్కి బీజేపీ హితవు పలికింది. కేజ్రీవాల్ చేసిన 10 హామీను కమలం పార్టీ హైలెట్ చేసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన దశాబ్ధం గడిచినా వాటిలో ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు.
“విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని, స్వచ్ఛమైన తాగునీరు అందిస్తానని, విద్యావ్యవస్థను మెరుగుపరుస్తానని, ఆరోగ్య సంరక్షణను పెంపొందించుకుంటానని, పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్ధారిస్తానని, మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తానని, మురికివాడల నివాసితులకు గృహాలను అందిస్తానని, యమునా నదిని శుభ్రం చేస్తామని కేజ్రీవాల్ వాగ్దానం చేశారు. ఈ హామీలలో ఒక్కటి నెరవేర్చలేదు’’ అని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది విలేకరుల సమావేశంలో ఆరోపించారు.
Also Read
- Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
Read Also: Shocking: ‘‘ వారి గౌరవాన్ని కాపాడా ’’.. తల్లి, నలుగురు చెల్లెళ్లను చంపిన వ్యక్తి..
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడిని ప్రస్తావిస్తూ.. కేజ్రీవాల్ నగరంలోని మహిళ భద్రతకు హామీ ఇచ్చారు, ముఖ్యమంత్రి నివాసంలోనే ఓ మహిళా ఎంపీపై దాడి జరిగింది, ఇలాంటిది దేశంలో తొలి సంఘటన అని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని చెబుతూ, ఇప్పుడు అవినీతికి పాల్పడుతున్నారని సుధాన్షు త్రివేది ఆరోపించారు.
దీనికి ముందు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా కేజ్రీవాల్కి లేఖ రాశారు. కొత్త ఏడాది నుంచి కేజ్రీవాల్ అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, తప్పుడు వాగ్దానాలు చేయడం వంటి 5 తీర్మానాలు చేయాలని కోరారు. కేజ్రీవాల్ మోహన్ భగవత్కి లేఖ రాస్తూ.. బీజేపీ ఓట్లను కొనుగోలు చేసిందని, ఓటర్ల జాబితాలో తారుమారు చేసిందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Kapoor Family : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కపూర్ కూతురు.. ఇక్కడైనా హిట్ వస్తుందో లేదో
-
Vaibhav-BCCI: అప్పుడు నీతులు చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు!
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
-
President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!