Bangladesh Crisis: బంగ్లాదేశ్ ఎజెండా.. జైశంకర్, అజిత్ దోవల్ని కలిసిన అమిత్ షా..
- బంగ్లాదేశ్ పరిణామాలపై భారత్ ఆందోళన..
- జైశంకర్-అజిత్ దోవల్తో అమిత్ షా భేటీ..
- ఇప్పటికే బంగ్లా సరిహద్దుల్లో హై అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Crisis: బంగ్లాదేశ్ పరిణామాలు భారత్కి ఆందోళనకరంగా మారాయి. భారత్ అనుకూల నేత షేక్ హసీనాను దేశం వదిలిపారిపోయేలా అక్కడ హింస చెలరేగింది. ప్రస్తుతం ఆమె భారత్ రక్షణలో ఉన్నారు. త్వరలోనే యూకేలో ఆశ్రయం పొందేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్తో అతిపెద్ద సరిహద్దును పంచుకుంటున్న బంగ్లాదేశ్లో అస్థిర పరిస్థితులు భారత్కి ఇబ్బందికరంగా మారాయి. దీనికి తోడు తాత్కాలిక ప్రభుత్వంలో చేరబోతున్న ఖలిదా జియా ఆమెకు సంబంధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), జమాతే ఇస్లామీ పార్టీ రెండూ భారత వ్యతిరేక ధోరణులను అవలంభించే. ఇన్నాళ్లు షేక్ హసీనా పాలనలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసింది. రానున్న ప్రభుత్వంలో ఈ రాడికల్ ఉగ్రవాద సంస్థలకు పూర్తి మద్దతు లభించే అవకాశ ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్ హైఅలర్ట్ ప్రకటించింది.
Read Also: Karnataka: ప్రేమను తిరస్కరించిందని యువతిపై దాడి.. ఆ తర్వాత నిందితుడు ఏం చేశాడంటే..!
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
తాజాగా బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై, శాంతిభద్రతలపై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమావేశమయ్యారు. నిన్న షేక్ హసీనా ఢాకా నుంచి ఢిల్లీ రావడంతో బంగ్లా సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేశారు. అక్రమ వలసలపై నిఘా పెట్టడంతో పాటు బంగ్లాలో నివసిస్తు్న్న భారతీయులు, మైనారిటీలైన హిందువుల పరిస్థితిపై ఆందోళన నెలకొంది.
బంగ్లాదేశ్లో దాదాపుగా 19,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. దాదాపుగా 17 కోట్ల మంది జనాభాలో కోటికి పైగా హిందువులు ఉన్నారు. ఈ రోజు రాజ్యసభలో మాట్లాడిన జైశంకర్ అక్కడి పరిస్థితులు మైనారిటీలు, భారతీయుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆ దేశంలో హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు హిందూ కౌన్సిలర్లను మతోన్మాద మూకలు హత్య చేశాయి. చాలా చోట్ల హిందూ ఆలయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల హిందూ మహిళలు, యువతులపై అకృత్యాలకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!