Bangladesh Crisis: బంగ్లాదేశ్ ఎజెండా.. జైశంకర్, అజిత్ దోవల్ని కలిసిన అమిత్ షా..
- బంగ్లాదేశ్ పరిణామాలపై భారత్ ఆందోళన..
- జైశంకర్-అజిత్ దోవల్తో అమిత్ షా భేటీ..
- ఇప్పటికే బంగ్లా సరిహద్దుల్లో హై అలర్ట్..
Bangladesh Crisis: బంగ్లాదేశ్ పరిణామాలు భారత్కి ఆందోళనకరంగా మారాయి. భారత్ అనుకూల నేత షేక్ హసీనాను దేశం వదిలిపారిపోయేలా అక్కడ హింస చెలరేగింది. ప్రస్తుతం ఆమె భారత్ రక్షణలో ఉన్నారు. త్వరలోనే యూకేలో ఆశ్రయం పొందేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్తో అతిపెద్ద సరిహద్దును పంచుకుంటున్న బంగ్లాదేశ్లో అస్థిర పరిస్థితులు భారత్కి ఇబ్బందికరంగా మారాయి. దీనికి తోడు తాత్కాలిక ప్రభుత్వంలో చేరబోతున్న ఖలిదా జియా ఆమెకు సంబంధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), జమాతే ఇస్లామీ పార్టీ రెండూ భారత వ్యతిరేక ధోరణులను అవలంభించే. ఇన్నాళ్లు షేక్ హసీనా పాలనలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసింది. రానున్న ప్రభుత్వంలో ఈ రాడికల్ ఉగ్రవాద సంస్థలకు పూర్తి మద్దతు లభించే అవకాశ ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్ హైఅలర్ట్ ప్రకటించింది.
Read Also: Karnataka: ప్రేమను తిరస్కరించిందని యువతిపై దాడి.. ఆ తర్వాత నిందితుడు ఏం చేశాడంటే..!
Also Read
- PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
తాజాగా బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై, శాంతిభద్రతలపై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమావేశమయ్యారు. నిన్న షేక్ హసీనా ఢాకా నుంచి ఢిల్లీ రావడంతో బంగ్లా సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేశారు. అక్రమ వలసలపై నిఘా పెట్టడంతో పాటు బంగ్లాలో నివసిస్తు్న్న భారతీయులు, మైనారిటీలైన హిందువుల పరిస్థితిపై ఆందోళన నెలకొంది.
బంగ్లాదేశ్లో దాదాపుగా 19,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. దాదాపుగా 17 కోట్ల మంది జనాభాలో కోటికి పైగా హిందువులు ఉన్నారు. ఈ రోజు రాజ్యసభలో మాట్లాడిన జైశంకర్ అక్కడి పరిస్థితులు మైనారిటీలు, భారతీయుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆ దేశంలో హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు హిందూ కౌన్సిలర్లను మతోన్మాద మూకలు హత్య చేశాయి. చాలా చోట్ల హిందూ ఆలయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల హిందూ మహిళలు, యువతులపై అకృత్యాలకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
Venkatesh: మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో