Bangladesh Crisis: బంగ్లాదేశ్ ఎజెండా.. జైశంకర్, అజిత్ దోవల్ని కలిసిన అమిత్ షా..
- బంగ్లాదేశ్ పరిణామాలపై భారత్ ఆందోళన..
- జైశంకర్-అజిత్ దోవల్తో అమిత్ షా భేటీ..
- ఇప్పటికే బంగ్లా సరిహద్దుల్లో హై అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Crisis: బంగ్లాదేశ్ పరిణామాలు భారత్కి ఆందోళనకరంగా మారాయి. భారత్ అనుకూల నేత షేక్ హసీనాను దేశం వదిలిపారిపోయేలా అక్కడ హింస చెలరేగింది. ప్రస్తుతం ఆమె భారత్ రక్షణలో ఉన్నారు. త్వరలోనే యూకేలో ఆశ్రయం పొందేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్తో అతిపెద్ద సరిహద్దును పంచుకుంటున్న బంగ్లాదేశ్లో అస్థిర పరిస్థితులు భారత్కి ఇబ్బందికరంగా మారాయి. దీనికి తోడు తాత్కాలిక ప్రభుత్వంలో చేరబోతున్న ఖలిదా జియా ఆమెకు సంబంధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), జమాతే ఇస్లామీ పార్టీ రెండూ భారత వ్యతిరేక ధోరణులను అవలంభించే. ఇన్నాళ్లు షేక్ హసీనా పాలనలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసింది. రానున్న ప్రభుత్వంలో ఈ రాడికల్ ఉగ్రవాద సంస్థలకు పూర్తి మద్దతు లభించే అవకాశ ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్ హైఅలర్ట్ ప్రకటించింది.
Read Also: Karnataka: ప్రేమను తిరస్కరించిందని యువతిపై దాడి.. ఆ తర్వాత నిందితుడు ఏం చేశాడంటే..!
Also Read
- National Flag Day: నేడు జాతీయ జెండా దినోత్సవం.. తిరంగా గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు?
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
- CM Vijay: సీఎం విజయ్కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
తాజాగా బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై, శాంతిభద్రతలపై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమావేశమయ్యారు. నిన్న షేక్ హసీనా ఢాకా నుంచి ఢిల్లీ రావడంతో బంగ్లా సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేశారు. అక్రమ వలసలపై నిఘా పెట్టడంతో పాటు బంగ్లాలో నివసిస్తు్న్న భారతీయులు, మైనారిటీలైన హిందువుల పరిస్థితిపై ఆందోళన నెలకొంది.
బంగ్లాదేశ్లో దాదాపుగా 19,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. దాదాపుగా 17 కోట్ల మంది జనాభాలో కోటికి పైగా హిందువులు ఉన్నారు. ఈ రోజు రాజ్యసభలో మాట్లాడిన జైశంకర్ అక్కడి పరిస్థితులు మైనారిటీలు, భారతీయుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆ దేశంలో హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు హిందూ కౌన్సిలర్లను మతోన్మాద మూకలు హత్య చేశాయి. చాలా చోట్ల హిందూ ఆలయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల హిందూ మహిళలు, యువతులపై అకృత్యాలకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
China Thanks India: చైనా నావికుల ప్రాణాలను కాపాడిన ఉపకారాన్ని ఎప్పటికీ మరచిపోలేం.. భారత సైన్యానికి చైనా కృతజ్ఞతలు
-
National Flag Day: నేడు జాతీయ జెండా దినోత్సవం.. తిరంగా గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు?
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఏమనొద్దు.. బీసీసీఐకి జింబాబ్వే కెప్టెన్ రిక్వెస్ట్!
-
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
-
Mysuru Horror: ఘోర విషాదం.. భార్య, ఇద్దరు కుమార్తెలను హత్య చేసి భర్త ఆత్మహత్య
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!