Air India: ఎయిరిండియాకు డీజీసీఏ షాక్.. రూ.90 లక్షలు ఫైన్.. దేనికోసమంటే..!
- ఎయిరిండియాకు డీజీసీఏ షాక్
- 90 లక్షలు జరిమానా
- భవిష్యత్లో జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్హత లేని సిబ్బందితో విమానాన్ని నడిపినందుకు ఎయిరిండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొరడా ఝుళిపించింది. శుక్రవారం భారీ మొత్తంలో జరిమానా విధించింది. రోస్టరింగ్ విధానంలో లోపాల కారణంగా అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపినందుకు ఎయిరిండియా సంస్థకు రూ.90 లక్షల జరిమానాను విధిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. దీంతో పాటు ఎయిర్ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్కు రూ.6 లక్షలు, ట్రైనింగ్ డైరెక్టర్కు రూ.3 లక్షలు ఫైన్ విధించింది. ఈ లోపాలపై సంస్థ ఇచ్చిన స్వచ్ఛంద నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని సంబంధిత పైలట్ను హెచ్చరించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: Modi-Zelenskyy: యుద్ధ పీడిత ఉక్రెయిన్ ప్రధాని జెలెన్స్కీ భుజం తట్టిన మోడీ.. భావోద్వేగం(వీడియో)
Also Read
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
జులై 9వ తేదీన ఎయిర్ఇండియా ముంబై నుంచి రియాద్కు ఓ విమానం నడిపింది. ఆ విమానంలో ఓ ట్రైనింగ్ కెప్టెన్తో కలిసి ట్రైనీ పైలట్ విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే ట్రైనింగ్ కెప్టెన్ అనారోగ్యానికి గురికావడంతో రోస్టరింగ్ విధానంలో నార్మల్ లైన్ కెప్టెన్ విధుల్లోకి వెళ్లారు. ట్రైనీ పైలట్కు శిక్షణ ఇచ్చే అర్హత ఈ కెప్టెన్కు లేదు. సిబ్బంది నిర్వహణ వ్యవస్థలో లోపాల కారణంగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ట్రైనీ పైలట్, కెప్టెన్ స్వచ్ఛందంగా బేస్ మేనేజర్కు రిపోర్ట్ చేశారు. అనంతరం ఎయిర్లైన్ దీనిపై డీజీసీఏకు వాలంటరీగా నివేదిక సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఏవియేషన్ రెగ్యులేటరీ.. ఎయిర్ఇండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇది తీవ్రమైన భద్రతా లోపంగా పరిగణించిన డీసీజీఏ సంస్థకు జరిమానా విధించింది. భవిష్యత్తులో మరెప్పుడూ ఇలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పైలట్లను హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: AP Film Federation: ఇక ఏపీలో ఏ సినిమా షూటింగ్ జరిపినా మాకు చెప్పాల్సిందే!
తాజావార్తలు
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!