Air India: ఎయిరిండియాకు డీజీసీఏ షాక్.. రూ.90 లక్షలు ఫైన్.. దేనికోసమంటే..!
- ఎయిరిండియాకు డీజీసీఏ షాక్
- 90 లక్షలు జరిమానా
- భవిష్యత్లో జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్హత లేని సిబ్బందితో విమానాన్ని నడిపినందుకు ఎయిరిండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొరడా ఝుళిపించింది. శుక్రవారం భారీ మొత్తంలో జరిమానా విధించింది. రోస్టరింగ్ విధానంలో లోపాల కారణంగా అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపినందుకు ఎయిరిండియా సంస్థకు రూ.90 లక్షల జరిమానాను విధిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. దీంతో పాటు ఎయిర్ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్కు రూ.6 లక్షలు, ట్రైనింగ్ డైరెక్టర్కు రూ.3 లక్షలు ఫైన్ విధించింది. ఈ లోపాలపై సంస్థ ఇచ్చిన స్వచ్ఛంద నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని సంబంధిత పైలట్ను హెచ్చరించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: Modi-Zelenskyy: యుద్ధ పీడిత ఉక్రెయిన్ ప్రధాని జెలెన్స్కీ భుజం తట్టిన మోడీ.. భావోద్వేగం(వీడియో)
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
జులై 9వ తేదీన ఎయిర్ఇండియా ముంబై నుంచి రియాద్కు ఓ విమానం నడిపింది. ఆ విమానంలో ఓ ట్రైనింగ్ కెప్టెన్తో కలిసి ట్రైనీ పైలట్ విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే ట్రైనింగ్ కెప్టెన్ అనారోగ్యానికి గురికావడంతో రోస్టరింగ్ విధానంలో నార్మల్ లైన్ కెప్టెన్ విధుల్లోకి వెళ్లారు. ట్రైనీ పైలట్కు శిక్షణ ఇచ్చే అర్హత ఈ కెప్టెన్కు లేదు. సిబ్బంది నిర్వహణ వ్యవస్థలో లోపాల కారణంగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ట్రైనీ పైలట్, కెప్టెన్ స్వచ్ఛందంగా బేస్ మేనేజర్కు రిపోర్ట్ చేశారు. అనంతరం ఎయిర్లైన్ దీనిపై డీజీసీఏకు వాలంటరీగా నివేదిక సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఏవియేషన్ రెగ్యులేటరీ.. ఎయిర్ఇండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇది తీవ్రమైన భద్రతా లోపంగా పరిగణించిన డీసీజీఏ సంస్థకు జరిమానా విధించింది. భవిష్యత్తులో మరెప్పుడూ ఇలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పైలట్లను హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: AP Film Federation: ఇక ఏపీలో ఏ సినిమా షూటింగ్ జరిపినా మాకు చెప్పాల్సిందే!
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!