Modi-Zelenskyy: యుద్ధ పీడిత ఉక్రెయిన్ ప్రధాని జెలెన్స్కీ భుజం తట్టిన మోడీ.. భావోద్వేగం(వీడియో)
- ఉక్రెయిన్కు చేరుకున్న మోడీ
- దాదాపు పది గంటల రైలు ప్రయాణం తర్వాత కీవ్ నగరంలోకి ప్రవేశం
- నగరంలోని భారతీయులను కలిసిన ప్రధాని
- ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కౌగిలించుకున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలాండ్లో రెండు రోజుల పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్కు చేరుకున్నారు. దాదాపు పది గంటల రైలు ప్రయాణం తర్వాత కీవ్ నగరంలో కాలు మోపారు. నగరంలోని భారతీయులను మోడీ కలిశారు. “భారత్ మాతాకీ జై ” అనే నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా వారు మోడీనికి స్వాగతం పలికారు. వారి యోగక్షేమాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడున్న మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. దాదాపు ఏడు గంటల పాటు ప్రధాని నగరంలో పర్యటించనున్నారు. ఈ సమయంలో మోడీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశంపై ఆ దేశంలో ఉత్కంఠ నెలకొంది.
READ MORE: AP Film Federation: ఇక ఏపీలో ఏ సినిమా షూటింగ్ జరిపినా మాకు చెప్పాల్సిందే!
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
అంతకు ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధ పీడిత ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకోగా.. ఆయనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్వాగతం పలికారు. 1991లో సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్లో పర్యటించడం ఇదే తొలిసారి. రష్యా, ఉక్రెయిన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం పెరిగిన తరుణంలో మోడీ పర్యటన కీలకంగా మారనుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఇందులో నేతలిద్దరూ ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు నాయకులు ముందుకు సాగారు. అక్కడ టీవీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. “మే 2022 లో ఖార్కివ్లో జరిగిన బాంబు దాడిలో 5 నెలల చిన్నారి మరణించింది.” అని టీవీ స్క్రీన్ పై రాశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అమరులైన ఉక్రెయిన్ సైనికులకు ప్రధాని మోడీ నివాళులర్పించారు.
#Watch | PM @narendramodi and President Zelenskyy honour the memory of children at Martyrologist Exposition#PMModiInUkraine @meaindia @pmoindia pic.twitter.com/KCOqfGb85z
— DD News (@DDNewslive) August 23, 2024
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!