Kidney Stones: కిడ్నీలో రాళ్లున్నాయా.. ఇలా చేయండి తొందరగా కరిగిపోతాయి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidney Stones: కిడ్ని సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా..? కిడ్నిలో రాళ్లతో ఎటు తిరగలేకపోతున్నారా..? కిడ్నీలో స్టోన్ వచ్చిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఎందుకంటే పొత్తి కడపులోంచి నొప్పి పొడుచుకొస్తుంది. అంతేకాకుండా యూరిన్ కు వెళ్తే.. మంటతో బాధపడుతారు. మహిళ కన్నా.. పురుషుల్లోనే కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఒకసారి కిడ్నీలో రాళ్లు వచ్చినవారు.. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ తిరగబెట్టొచ్చు. సుమారు 50శాతం మందికి ఏడేళ్లలోపే ఇవి రెండోసారి పుట్టుకు వచ్చే అవకాశముంది. నీళ్లు తక్కువ తాగడం, మాంసాహారం ఎక్కువగా తినడం, శరీరంలో విటమిన్ బి6, సి లోపం ఉన్నా, విటమిన్ డి అధికంగా ఉన్నప్పుడు, ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారికి, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా సోకుతున్నా, ఆలస్యంగా భోజనం చేసినా.. కిడ్నీలో రాళ్లు వస్తాయి.
Read Also: Draupadi Murmu : హైదరాబాద్కు చేరుకున్న ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
Also Read
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- Psychology Facts: 'లైట్ తీసుకో, పట్టించుకోకు..' ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
అయితే కిడ్నిలో రాళ్లు తొలగిపోవాలంటే నీరు ఎక్కువతాగాలి. పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. నీరు ఎక్కుగా తాగితే.. రాళ్లు ఏర్పడటానికి దారితీసే పదార్థాలు పలుచగా అవుతాయి. దీంతో ఇవి మూత్రంతో పాటు తేలికగా బయటకు వచ్చేస్తాయి. రోజుకు కనీసం.. 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగితే మంచిది. అంతేకాకుండా మీరు తీసుకునే ఆహార పదార్థాలలో సరిపడా కాల్షియం తీసుకోండి. లేదంటే యూరిన్లో ఆక్జలేట్ స్థాయిలు పెరిగి రాళ్లు వస్తాయి. కాల్షియం పేగులలో ఆక్సలేట్ను బంధిస్తుంది, దాన్ని ఎక్కువగా గ్రహించకుండా నియంత్రిస్తుంది. కాబట్టి వయసుకు తగినట్టుగా క్యాల్షియం తీసుకునేలా చూసుకోవాలి.
Read Also: Salaar: సలార్ లో రాఖీ భాయ్.. కథ తెలిసిపోయింది..?
అంతేకాకుండా కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే నాన్ వెజ్ తినడం తగ్గించాలి. మాంసం, చికెన్, గుడ్లు, సముద్ర రొయ్యలు, చేపల వంటి నాన్వెజ్ ఆహారం నుంచి వచ్చే ప్రొటీన్లు మూత్రంలో యూరిక్ యాసిడ్ మోతాలను పెంచుతుంది. దీని వల్ల కిడ్నీలో రాళ్లకు దారి తీస్తుంది. ప్రోటీన్ను మరీ ఎక్కువగా తీసుకుంటే రాళ్లు ఏర్పడకుండా చూసే సిట్రేట్ స్థాయిలు కూడా పడిపోతాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని.. నాన్వెజ్ తక్కువగా తీసుకోవడం మంచిది. మనం రోజుతినే వంటల్లో ఉప్పును తగ్గిస్తే మంచిది. సోడియం ఎక్కువగా తీసుకుంటే యరిన్లో క్యాల్షియం స్థాయిలు పెరిగేలా చేస్తుంది. కాబట్టి ఉప్పు తక్కువగా తీసుకోవడం మంచిది.
- Tags
- Health
- kidney
- pain
- stones
- telugu news
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!