Kidney Stones: కిడ్నీలో రాళ్లున్నాయా.. ఇలా చేయండి తొందరగా కరిగిపోతాయి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidney Stones: కిడ్ని సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా..? కిడ్నిలో రాళ్లతో ఎటు తిరగలేకపోతున్నారా..? కిడ్నీలో స్టోన్ వచ్చిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఎందుకంటే పొత్తి కడపులోంచి నొప్పి పొడుచుకొస్తుంది. అంతేకాకుండా యూరిన్ కు వెళ్తే.. మంటతో బాధపడుతారు. మహిళ కన్నా.. పురుషుల్లోనే కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఒకసారి కిడ్నీలో రాళ్లు వచ్చినవారు.. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ తిరగబెట్టొచ్చు. సుమారు 50శాతం మందికి ఏడేళ్లలోపే ఇవి రెండోసారి పుట్టుకు వచ్చే అవకాశముంది. నీళ్లు తక్కువ తాగడం, మాంసాహారం ఎక్కువగా తినడం, శరీరంలో విటమిన్ బి6, సి లోపం ఉన్నా, విటమిన్ డి అధికంగా ఉన్నప్పుడు, ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారికి, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా సోకుతున్నా, ఆలస్యంగా భోజనం చేసినా.. కిడ్నీలో రాళ్లు వస్తాయి.
Read Also: Draupadi Murmu : హైదరాబాద్కు చేరుకున్న ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
Also Read
- Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
అయితే కిడ్నిలో రాళ్లు తొలగిపోవాలంటే నీరు ఎక్కువతాగాలి. పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. నీరు ఎక్కుగా తాగితే.. రాళ్లు ఏర్పడటానికి దారితీసే పదార్థాలు పలుచగా అవుతాయి. దీంతో ఇవి మూత్రంతో పాటు తేలికగా బయటకు వచ్చేస్తాయి. రోజుకు కనీసం.. 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగితే మంచిది. అంతేకాకుండా మీరు తీసుకునే ఆహార పదార్థాలలో సరిపడా కాల్షియం తీసుకోండి. లేదంటే యూరిన్లో ఆక్జలేట్ స్థాయిలు పెరిగి రాళ్లు వస్తాయి. కాల్షియం పేగులలో ఆక్సలేట్ను బంధిస్తుంది, దాన్ని ఎక్కువగా గ్రహించకుండా నియంత్రిస్తుంది. కాబట్టి వయసుకు తగినట్టుగా క్యాల్షియం తీసుకునేలా చూసుకోవాలి.
Read Also: Salaar: సలార్ లో రాఖీ భాయ్.. కథ తెలిసిపోయింది..?
అంతేకాకుండా కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే నాన్ వెజ్ తినడం తగ్గించాలి. మాంసం, చికెన్, గుడ్లు, సముద్ర రొయ్యలు, చేపల వంటి నాన్వెజ్ ఆహారం నుంచి వచ్చే ప్రొటీన్లు మూత్రంలో యూరిక్ యాసిడ్ మోతాలను పెంచుతుంది. దీని వల్ల కిడ్నీలో రాళ్లకు దారి తీస్తుంది. ప్రోటీన్ను మరీ ఎక్కువగా తీసుకుంటే రాళ్లు ఏర్పడకుండా చూసే సిట్రేట్ స్థాయిలు కూడా పడిపోతాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని.. నాన్వెజ్ తక్కువగా తీసుకోవడం మంచిది. మనం రోజుతినే వంటల్లో ఉప్పును తగ్గిస్తే మంచిది. సోడియం ఎక్కువగా తీసుకుంటే యరిన్లో క్యాల్షియం స్థాయిలు పెరిగేలా చేస్తుంది. కాబట్టి ఉప్పు తక్కువగా తీసుకోవడం మంచిది.
- Tags
- Health
- kidney
- pain
- stones
- telugu news
తాజావార్తలు
-
Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
-
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
-
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!