Lok sabha Video: పార్లమెంట్ దగ్గర ఆసక్తికర సన్నివేశం.. రాహుల్గాంధీ రాగానే కేంద్రమంత్రులు ఏం చేశారంటే..!
- పార్లమెంట్ దగ్గర ఆసక్తికర సన్నివేశం
- మీడియాతో మాట్లాడుతున్న కేంద్రమంత్రులు
- రాహుల్ గాంధీ రాకతో జంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ఆవరణలో బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కేంద్రమంత్రులు మీడియాతో మాట్లాడుతుండగా సడన్గా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చారు. అంతే అక్కడ నుంచి కేంద్రమంత్రులు జంప్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
బుధవారం బడ్జెట్పై రాహుల్ గాంధీ మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. అవసరానికి తగ్గట్టుగా కేటాయింపులు జరగలేదని ఆరోపించారు. అంతేకాకుండా భారత్-అమెరికా డీల్ను తప్పుపట్టారు. ఈ వాణిజ్య ఒప్పందం సిగ్గుచేటు అని.. దేశాన్ని అమ్మేశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
ఇది కూడా చదవండి: Off The Record: మౌనం వీడని ఆ జిల్లా వైసీపీ లీడర్స్.. భయమా? వ్యూహమా?
అయితే ఇదే విషయంపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి అని పార్లమెంట్ ఎదుట మీడియా ముందు కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, అశ్విని వైష్ణవ్ చెబుతుండగా.. హఠాత్తుగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ ఎంపీలు వచ్చారు. అంతే అక్కడ నుంచి కేంద్రమంత్రులు వెళ్లిపోయారు. అప్పటికీ కలిసి మాట్లాడదాం అంటూ రాహుల్ గాంధీ పిలిచినా అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Off The Record: ఇక తెగేదాకా లాగకూడదని డిసైడై యాక్టివ్ అవుతున్నారా?
‘‘లేదు.. నా దగ్గర డేటా ఉంది. హర్దీప్ పూరి, అనిల్ అంబానీ పేర్లు ఎప్స్టీన్ ఫైల్స్లో పేర్లు ఉన్నాయి. ప్రధానమంత్రిపై ప్రత్యక్ష ఒత్తిడి ఉంది. ఒత్తిడి లేకుండా ఏ ప్రధానమంత్రి దీన్ని చేయరు (అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడం). రైతుల విషయంలో జరిగింది. డేటా, ఇంధన భద్రతతో ఏ ప్రధానమంత్రి కూడా సాధారణ పరిస్థితిలో ఇలా చేయరు.’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
BJP ministers Prahlad Joshi and Ashwini Vaishnaw were saying in front of the media: "Rahul Gandhi should Authenticate before making allegations"
Rahul Gandhi arrived and said
"Let's talk together"
Both the Ministers left pic.twitter.com/4dxBezNoeN
— Shakeel Yasar Ullah (@yasarullah) February 11, 2026
తాజావార్తలు
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?