Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News The Talibans Targets India

తాలిబన్లు.. ఇండియాకు ఎసరు పెట్టారుగా..!

Published Date :September 3, 2021 , 4:13 pm
By Lakshmi Narayana
తాలిబన్లు.. ఇండియాకు ఎసరు పెట్టారుగా..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏరుదాటేదాక ‘ఓడ మల్లన్న’.. ఏరు దాటాక ‘బోడ మల్లన్న’ అన్నట్టుగా ఉంది తాలిబన్ల వ్యవహారశైలి. అప్ఘనిస్తాన్ దేశాన్ని వశపరుచుకోవడానికి ముందు అమెరికాకు, ప్రపంచానికి కల్లబొల్లి మాటలు చెప్పిన తాలిబన్లు ఇప్పుడు ఆ దేశం ఆక్రమణలోకి వచ్చాక తమ అసలు రంగును బయటపెడుతున్నారు. భారత్ సహా ప్రపంచదేశాలకు ఎసరు పెడుతున్నారు. మొన్నటివరకు ‘కశ్మీర్’పై సంబంధం లేదన్న తాలిబన్లు ఇప్పుడు తగ్గేదేలే అంటూ భారత్ వ్యతిరేక ప్రకటన చేయడం సంచలనమైంది.

అఫ్ఘాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు మరోసారి తమ వక్రబుద్దిని బయట పెట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు కూడా కశ్మీర్ అంశం.. భారత్, పాకిస్థాన్ అంతర్గత, దైపాక్షిక అంశమని స్పష్టంచేసిన తాలిబన్లు తాజాగా మాట మార్చారు. అఫ్ఘాన్ పాలన పూర్తిగా తమ చేతుల్లోకి వచ్చిందని భావిస్తున్నారో ఏమోగానీ తాజాగా భారత్ పై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read

  • Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
  • US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్‌ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
  • Imran Khan: 85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్.. వైద్య కారణాలతో విడుదల కోరుతూ కోర్టుకు అప్పీల్
  • Mojtaba Khamenei: "సముద్ర గర్భంలో పాతిపెడతాం".. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..

తాలిబ‌న్ అధికార ప్ర‌తినిధి సుహైల్ ష‌హీన్ తాజాగా బీబీసీ ఉర్దూతో మాట్లాడారు. ఈ సందర్భంగా కశ్మీర్ లోని ముస్లింలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ముస్లింల గురించి తమకు మాట్లాడే హక్కు ఉందంటూ స్పష్టం చేశారు. ముస్లింలుగా తాము.. క‌శ్మీర్‌, ఇండియా స‌హా ఏ దేశంలోని ముస్లింల కోస‌మైనా గ‌ళ‌మెత్తే హ‌క్కు తమకు ఉందని ష‌హీన్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. ‘మేము ఏ దేశంపైనా ఆయుధాలను ఎక్కుపెట్ట‌బోమ‌ని స్ప‌ష్టం చేస్తున్నాం. అయితే ముస్లింల కోసం మా స్వరాన్ని పెంచుతాం.. మీ సొంత మ‌నుషులని, మీ దేశ పౌరులనీ, మీ చ‌ట్టాల ప్ర‌కారం వాళ్ల‌కు కూడా స‌మాన హ‌క్కులు ఉండాల‌ని తాము కోరుకుంటున్నామని’ ష‌హీన్ స్పష్టం చేశాడు.

గతంలో తాలిబన్లు మాట్లాడిన మాటలకు.. అప్ఘాన్లో పాలన చేతుల్లోకి తీసుకున్నాక చేస్తున్న వ్యాఖ్యలకు పొంతన లేకుండా పోతుంది. గతంలో కశ్మీర్.. ఇండియా, పాకిస్థాన్ల దైపాక్షిక అంతర్గమని అందులో తాము కలుగజేసుకోబోమని ప్రకటించారు. అయితే ఇప్పుడు మాటమార్చడం వెనుక వెనుక పాకిస్థాన్ హస్తం ఏమైనా ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక ఇటీవల భారత్ తాలిబన్లతో ఖతర్ దేశంలోని దోహాలో చర్చలు జరిపింది. ఆఫ్ఘ‌న్ భూభాగం భారత్ వ్య‌తిరేక ఉగ్ర‌వాద శ‌క్తుల అడ్డాగా మార‌కూడ‌ద‌ని తాలిబ‌న్ల‌తో చ‌ర్చ‌ల సంద‌ర్భంగా ఇండియా తేల్చిచెప్పింది. ఖ‌తార్‌లోని ఇండియా రాయ‌బారి దీపిక్ మిట్ట‌ల్ తాలిబ‌న్ నేత షేర్ మ‌హ్మ‌ద్‌ను క‌లిసి ఈ విష‌యాన్ని చెప్పారు. ఈ నేప‌థ్యంలోనే తాలిబన్ల నుంచి క‌శ్మీర్‌పై ఇలాంటి ప్ర‌క‌ట‌న రావ‌డం చర్చనీయాంశమైంది.

అప్ఘాన్లోని పరిణామాల ప్రభావం కశ్మీర్ పై స్పష్టంగా కన్పిస్తుందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అక్కడి పరిస్థితులను పాక్ ఉగ్రవాదులు అనుకూలంగా మార్చుకొని కశ్మీర్ లోయలో విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. తాలిబన్ల వ్యవహారం రాబోయే రోజుల్లో భారత్ కు తలపోటుగా మారే అవకాశాలున్నాయి. తాలిబన్ల విషయంలో భారత్ ఎలాంటి వ్యూహాంతో ముందుకెళుతుందనే మాత్రం వేచిచూడాల్సిందే..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Afghanistan
  • Afghanistan Crisis
  • india
  • thalibans

తాజావార్తలు

  • Gold Rate Today: చల్లబడిన బంగారం ధరల వేడి.. హైదరాబాద్‌లో నేటి రేట్స్ ఇవే!

  • Oben Rorr EVO: రూ.1 లక్షకే కొత్త ఓబెన్ రోర్ Evo.. 180KM రేంజ్‌తో అదిరిపోయే బైక్

  • NBK 112 : బాలయ్య-కొరటాల శివ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. మాస్ విద్వంసమే

  • Babar Azam: టీ20 క్రికెట్‌లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్‌ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..

  • Instagram Star Murder: భర్త చేతితో ఇన్‌స్టా స్టార్‌ దారుణ హత్య.. ట్విస్ట్‌ ఏంటంటే..?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions