Srilanka Crisis: శ్రీలంక అధ్యక్ష భవనం నుంచి పురాతన కళాఖండాలు మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మార్చి నుంచి అక్కడ తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నాయి. శ్రీలంక ఆర్థిక సంక్షోెభానికి అధ్యక్షుడు గొటబయ రాజపక్సతో పాటు, ప్రధాని మహిందా రాజపక్సలే కారణం అని జనాలు తిరగబడ్డారు. దీంతో ఇటీవల వీరిద్దరు రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘేను శ్రీలంక పార్లమెంట్ ఎన్నుకుంది. రెండు వారాల క్రితం అధ్యక్షుడు గోటబయ రాజపక్స పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ.. రాజధాని కొలంబోలోని టెంపుల్ ట్రీస్ లో ఉన్న అధ్యక్షభవనాన్ని, అధ్యక్షుడి కార్యాాలయాన్ని ఆందోళకారులు ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ దెబ్బతో గొటబయ రాజపక్స మాల్దీవులకు, అక్కడ నుంచి సింగపూర్ కు పరారయ్యాడు.
దాదాపుగా వారం పాటు ఆందోళకారులు అధ్యక్ష భవనంలోనే ఉంటూ.. అక్కడే మద్యం తాగడం, వంట చేసుకుని తినడం, స్మిమ్మింగ్ చేయడం వంటివి చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పుడో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అధ్యక్ష భవనం, ప్రధానమంత్రి ఇంటిలో ఉన్న దాదాపు 1000కి పైగా పురాతన కళాఖండాలు మాయమైనట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై అక్కడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీటి విలువ కూడా ఎక్కువగానే ఉంటుందని శ్రీలంక పోలీసులు చెబుతున్నారు. అధ్యక్ష, పీఎం భవనాలను ఆక్రమించుకున్న ఆందోళకారులే వీటిని తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.
Also Read
- Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
- Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
- Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
- El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
Read Also: RajiniKanth: నా జీవితంలో డబ్బు ఉంది కానీ ప్రశాంతత లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన తలైవా
ఇదిలా ఉంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిరసనకారులపై చర్యలు తీసుకుంటుంది. శుక్రవారం తెల్లవారుజామున గాలేఫేజ్ లో ఉన్న నిరసనకారులపై పోలీసులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను హక్కుల సంస్థలు ఖండిస్తున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నాయి. ప్రజలు శాంతియుత నిరసనల తెలిపేందుకు హక్కు ఉందని.. అలాగే అధ్యక్షుడి భవనం, ప్రధాన మంత్రి భవనం వంటి ప్రభుత్వ భవనాలను ఆక్రమించడాన్ని అనుతించబోనని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తెలిపారు. వీటిని నిరోధించేందుకు సైన్యం, పోలీసులకు అధికారాలు ఇచ్చారు.
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!