Canada sanctions Gotabaya, Mahinda Rajapaksa: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స, మాజీ ప్రధాని మహీందా రాజపక్సేలపై కెనడా ఆంక్షలు విధించింది. దేశంలో అంతర్యుద్ధం సమయంలో ‘‘మానవహక్కుల’’ ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలఅపై వీరిద్దరిపై ఆంక్షలు విధించింది. వీరితో పాటు మరో నలుగురికి కూడా ఇదే ఆంక్షలను వర్తింపచేసింది. స్టాఫ్ సార్జెంట్ సునీల్ రత్నాయక్, లెఫ్టినెంట్ కమాండర్ చందనా పి హెట్టియారచ్చితేలపై కూడా ఆంక్షలు విధించినట్లు కెనడా విదేశాంగ శాఖ తెలిపింది.
లంకలో అత్యంత తీవ్ర ఆర్థక సంక్షోభానికి కారకుడయ్యాడనే ఆరోపణలతో ప్రజాగ్రహానికి గురై విదేశాలకు పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స శుక్రవారం ద్వీపదేశంలో అడుగుపెట్టారు.
తన రాజీనామాను డిమాండ్ చేస్తూ భారీ నిరసనల మధ్య జులైలో ద్వీపం దేశం శ్రీలంక నుంచి పారిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన భార్య, కొడుకుతో కలిసి అమెరికాలో స్థిరపడాలని చూస్తున్నట్లు సమాచారం.
Gotabaya Rajapaksa To Seek Temporary Stay In Thailand: శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణం అయిన మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స మరో దేశం ఆశ్రయం కోరాడు. గత నెలలో శ్రీలంక వ్యాప్తంగా ప్రజానిరసనలు మిన్నంటాయి. దీంతో అధ్యక్షుడిగా ఉన్న గోటబయ రాజపక్స శ్రీలంకను వదిలి ఆర్మీ విమానంలో మాల్దీవులకు పారిపోయాడు. అయితే అక్కడ కూడా శ్రీలంక ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో జూలై 14న సింగపూర్ దేశానికి పారిపోయాడు. అప్పటి నుంచి…
తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజాగ్రహానికి గురైంది అక్కడి ప్రభుత్వం. కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం వల్ల అధ్యక్షుడు విదేశాలకు పారిపోయాడు. మళ్లీ అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నిరసనలు మొదలైన నాలుగు నెలల తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం అధ్యక్ష కార్యాలయానికి సమీపంలో ఉన్న తమ నిరసన క్యాంపును ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే భారీ నిరసనల మధ్య గత నెలలో తన ద్వీప దేశం నుండి పారిపోయిన తర్వాత రెండవ ఆగ్నేయాసియా దేశంలో తాత్కాలిక బస కోసం థాయ్లాండ్లోకి ప్రవేశించాలని అభ్యర్థించినట్లు థాయ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
Sri Lankan President thanks PM Modi: గత కొంత కాలంగా చైనాతో రాసుకుపూసుకు తిరిగిన శ్రీలంకకు భారత్ విలువ తెలుస్తోంది. రాజపక్సల హయాంలో భారత్ ను కాదని.. చైనాతో వ్యాపారం చేసి, భారీగా అప్పులు చేసిన శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోెభాన్ని ఎదుర్కొంటోంది. చైనా అప్పులు తీర్చలేక హంబన్ టోటా నౌకాశ్రయాన్ని 99 ఏళ్లకు లీజుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ కు ఇస్తామన్న ప్రాజెక్టులను కూడా చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసిన చరిత్ర రాజపక్సలది.
Srilanka Crisis- Gotabaya Rajapaksa: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు ఊరట లభించింది. మరో రెండు వారాల పాటు సింగపూర్ లో ఉండేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం గొటబాయ రాజపక్స సింగపూర్ లో టూరిస్ట్ వీసాపై నివాసం ఉంటున్నాడు. ఇటీవల శ్రీలంక క్యాబినెట్ అధికార ప్రతినిధి బంధుల గుణవర్థన మాట్లాడుతూ.. గొటబాయ రాజపక్స ఎన్నో రోజులు సింగపూర్ లో ఉండలేడని.. త్వరలోనే శ్రీలంకకు వస్తారని అన్నారు.
Srilanka Economic Crisis: శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో జూలై 9న పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. అయితే ఈ సమయంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం నుంచి పారిపోయారు. జూలై 13న మాల్దీవులకు పారిపోయిన రాజపక్స.. తిరిగి అక్కడ నుంచి సింగపూర్ చేరుకున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే గొటబయ రాజపక్స స్వదేశానికి వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రి, కేబినెట్ అధికార ప్రతినిధి వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి
దాదాపుగా వారం పాటు ఆందోళకారులు అధ్యక్ష భవనంలోనే ఉంటూ.. అక్కడే మద్యం తాగడం, వంట చేసుకుని తినడం, స్మిమ్మింగ్ చేయడం వంటివి చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పుడో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అధ్యక్ష భవనం, ప్రధానమంత్రి ఇంటిలో ఉన్న దాదాపు 1000కి పైగా పురాతన కళాఖండాలు మాయమైనట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై అక్కడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీటి విలువ కూడా ఎక్కువగానే ఉంటుందని శ్రీలంక పోలీసులు…