లంకలో అత్యంత తీవ్ర ఆర్థక సంక్షోభానికి కారకుడయ్యాడనే ఆరోపణలతో ప్రజాగ్రహానికి గురై విదేశాలకు పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స శుక్రవారం ద్వీపదేశంలో అడుగుపెట్టారు.
Sri Lankan children suffering from hunger: శ్రీలంక దేశ ఆర్థిక కష్టాలు ఇప్పటికిప్పుడే తీరేలా లేవు. గత మార్చి నుంచి శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారింది. నిత్యవసరాల ధరలు అమాంతం పెరిగాయి. పెట్రోల్, డిజిల్ దొరకని పరిస్థితి ఏర్పడింది. పనులు లేక మహిళలు వ్యభిచారులుగా మారుతున్న దయనీయ పరిస్థితులు శ్రీలంకలో చూస్తున్నాం. శ్రీలంక ఖజానాలో విదేశీమారక నిల్వలు అడుగంటుకుపోయాయి. ఇతర దేశాల నుంచి నిత్యావసరాలను తెప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. తమను ఆదుకోవాలని ఐఎంఎఫ్ ను…
తన రాజీనామాను డిమాండ్ చేస్తూ భారీ నిరసనల మధ్య జులైలో ద్వీపం దేశం శ్రీలంక నుంచి పారిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన భార్య, కొడుకుతో కలిసి అమెరికాలో స్థిరపడాలని చూస్తున్నట్లు సమాచారం.
Gotabaya Rajapaksa To Seek Temporary Stay In Thailand: శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణం అయిన మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స మరో దేశం ఆశ్రయం కోరాడు. గత నెలలో శ్రీలంక వ్యాప్తంగా ప్రజానిరసనలు మిన్నంటాయి. దీంతో అధ్యక్షుడిగా ఉన్న గోటబయ రాజపక్స శ్రీలంకను వదిలి ఆర్మీ విమానంలో మాల్దీవులకు పారిపోయాడు. అయితే అక్కడ కూడా శ్రీలంక ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో జూలై 14న సింగపూర్ దేశానికి పారిపోయాడు. అప్పటి నుంచి…
తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజాగ్రహానికి గురైంది అక్కడి ప్రభుత్వం. కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం వల్ల అధ్యక్షుడు విదేశాలకు పారిపోయాడు. మళ్లీ అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నిరసనలు మొదలైన నాలుగు నెలల తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం అధ్యక్ష కార్యాలయానికి సమీపంలో ఉన్న తమ నిరసన క్యాంపును ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.
Srilanka Crisis- Gotabaya Rajapaksa: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు ఊరట లభించింది. మరో రెండు వారాల పాటు సింగపూర్ లో ఉండేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం గొటబాయ రాజపక్స సింగపూర్ లో టూరిస్ట్ వీసాపై నివాసం ఉంటున్నాడు. ఇటీవల శ్రీలంక క్యాబినెట్ అధికార ప్రతినిధి బంధుల గుణవర్థన మాట్లాడుతూ.. గొటబాయ రాజపక్స ఎన్నో రోజులు సింగపూర్ లో ఉండలేడని.. త్వరలోనే శ్రీలంకకు వస్తారని అన్నారు.
Srilanka Economic Crisis: శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో జూలై 9న పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. అయితే ఈ సమయంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం నుంచి పారిపోయారు. జూలై 13న మాల్దీవులకు పారిపోయిన రాజపక్స.. తిరిగి అక్కడ నుంచి సింగపూర్ చేరుకున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే గొటబయ రాజపక్స స్వదేశానికి వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రి, కేబినెట్ అధికార ప్రతినిధి వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి
దాదాపుగా వారం పాటు ఆందోళకారులు అధ్యక్ష భవనంలోనే ఉంటూ.. అక్కడే మద్యం తాగడం, వంట చేసుకుని తినడం, స్మిమ్మింగ్ చేయడం వంటివి చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పుడో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అధ్యక్ష భవనం, ప్రధానమంత్రి ఇంటిలో ఉన్న దాదాపు 1000కి పైగా పురాతన కళాఖండాలు మాయమైనట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై అక్కడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీటి విలువ కూడా ఎక్కువగానే ఉంటుందని శ్రీలంక పోలీసులు…
శ్రీలంక నూతన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పార్లమెంట్ కాంప్లెక్స్లో ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆయన 134 ఓట్లు సాధించి ప్రత్యర్థి డల్లాస్ అలహప్పెరుమాపై గెలుపొందారు.
శ్రీలంక ఆర్థిక సంక్షోభం అక్కడి మహిళల పాలిట నరకంగా మాారాయి. నిత్యావసరాలు, మందుల కోసం శరీరాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ బిడ్డలు, తమను నమ్ముకుని ఉన్నవారి ఆకలి తీర్చేందుకు వ్యభిచార రొంపిలోకి దిగుతున్నారు. అక్కడి ఆర్థిక సంక్షోభం శ్రీలంక మహిళలను దీనస్థితిలోకి నెట్టేశాయి. శ్రీలంక ఆర్థిక పరిస్థితి దిగజారిన తరువాత వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే మహిళలు వ్యభిచారంలోకి నెట్టబడుతున్నారు.