Pakistan: పాక్ ఆర్మీ లక్ష్యంగా బాంబు దాడులు.. బలూచిస్థాన్ వెళ్తున్న రైలుపై దాడి
- పాక్ ఆర్మీ లక్ష్యంగా బాంబు దాడులు
- బలూచిస్థాన్ వెళ్తున్న రైలుపై దాడి
- పలువురు సైనికులు గాయపడినట్లు సమాచారం.
పాకిస్థాన్లో మరోసారి బాంబ్ దాడితో దద్దరిల్లింది. బలూచిస్థాన్ వెళ్తున్న రైలును లక్ష్యంగా చేసుకుని ఐఈడీ బాంబును పేల్చారు. రైల్లో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు. బలూచిస్థాన్ తిరుగుబాటుదాలు, బలూచ్ రిపబ్లిక్ గార్డ్స్ ఈ దాడికి బాధ్యత వహించారు.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో సంచలన విషయాలు.. ఖాతాలో రూ.కోటి జమ
Also Read
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లోని జాఫర్ ఎక్స్ప్రెస్లో మంగళవారం శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. పాకిస్థాన్లోని సింధ్-బలూచిస్థాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న సుల్తాన్కోట్ ప్రాంతం సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ ఏడాది మార్చి నుంచి ఈ రైలును లక్ష్యంగా చేసుకుని తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు. తాజాగా పాక్ ఆర్మీ సిబ్బందిని లక్ష్యంగా ఈ దాడికి పాల్పడింది. ట్రాక్లపై అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (IED) వల్ల ఈ పేలుడు సంభవించిందని.. క్వెట్టాకు చెందిన ప్యాసింజర్ రైలు ఆరు కోచ్లు పట్టాలు తప్పినట్లుగా సమాచారం. అయితే ఈ ఘటనలో ఆర్మీ సిబ్బంది చనిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: CJI Gavai: పశ్చాత్తాపం లేదు.. గవాయ్పై నిందితుడు మరోసారి పరుష వ్యాఖ్యలు
ఈ దాడికి బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ బాధ్యత వహించింది. బలూచిస్థాన్ స్వాతంత్ర్యం వచ్చే వరకు ఇటువంటి కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రకటించింది. రెస్క్యూ బృందాలు, భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
-
Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?