Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో సంచలన విషయాలు.. ఖాతాలో రూ.కోటి జమ
- జుబీన్ గార్గ్ కేసులో సంచలన విషయాలు
- ఖాతాలో రూ.కోటి జమ
- మరో మలుపు తిరిగిన కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) మరణం రోజుకో మలుపు తిరుగుతోంది. సిట్ దర్యాప్తులో తాజాగా కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, నిర్వాహకుడు శ్యామ్కాను మహంత, బ్యాండ్మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి, కో-సింగర్ అమృత్ప్రవ మహంతను అరెస్ట్ చేశారు. నలుగురిపై హత్య అభియోగాలు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: CJI Gavai: పశ్చాత్తాపం లేదు.. గవాయ్పై నిందితుడు మరోసారి పరుష వ్యాఖ్యలు
Also Read
- Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
- IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- West Bengal Re-Poll: బెంగాల్ ఫల్తా ఓట్ల లెక్కింపు ప్రారంభం.. బీజేపీకి ఈ గెలుపు చాలా ముఖ్యం..
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జుబీన్ గార్గ్ చనిపోయి ఇన్ని రోజులైంది. అస్సాంతో పాటు దేశ ప్రజలంతా దు:ఖ సంద్రంలో మునిగిపోయి ఉంటే.. జుబీన్ గార్గ్ భద్రతా సిబ్బంది మాత్రం ఇప్పటి వరకు సింగపూర్ నుంచి భారత్కు రాలేదు. ఎన్నిసార్లు పిలిచినా స్పందన కరవైంది. ఈ నేపథ్యంలో వారి బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా కోటి రూపాయలు జమ అయినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో ఈ కేసు మరింత సీరియస్గా మారింది. ప్రస్తుతం ఇద్దరు భద్రతా సిబ్బందిని రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఇద్దరూ అందుబాటులోకి రావడం లేదని సమాచారం.
ఇది కూడా చదవండి: Netanyahu: హమాస్ ఇంకా అంతం కాలేదు.. శాంతి చర్చల వేళ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
జుబీన్ గార్గ్ మరణంలో వారిద్దరి ప్రమేయం ఉన్నట్లుగా అనుమానాలు తీవ్ర అవుతున్నాయి. వారికి అంత డబ్బు ఎలా వచ్చిందనే దానిపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ కేసును ఆర్థిక కోణంలో కూడా దర్యాప్తు చేయాలని సిట్ బృందానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 10న జుబీన్ గార్గ్ మరణంపై విసెరా నివేదిక రానున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సాక్షులు వాంగ్మూలంలో ఏదైనా చెప్పవచ్చు.. కానీ నివేదిక వచ్చాక అసలు విషయం బయటపడుతుందని చెప్పారు. అక్టోబర్ 11 నాటికి అన్ని అనుమానాలకు సమాధానాలు దొరకుతాయని పేర్కొన్నారు.

ఇటీవల జుబీన్ బ్యాండ్మేట్ శేఖర్జ్యోతి గోస్వామి తన వాంగ్మూలంలో సంచలన ఆరోపణలు చేశారు. గాయకుడికి ఆయన మేనేజర్, ఫెస్టివల్ నిర్వాహకుడు విషమిచ్చి ప్రమాదకరంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉంటారని ఆరోపించాడు. జుబీన్ నోరు, ముక్కు నుంచి నురగ వస్తున్నప్పుడు కూడా మేనేజర్ ఏ మాత్రం కంగారు పడలేదని తెలిపాడు. వెంటనే వైద్యచికిత్స అందించకుండా ఆలస్యం చేశారని చెప్పుకొచ్చాడు. జుబీన్ గార్గ్ సింగపూర్లోని నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్కు వెళ్లారు. సెప్టెంబర్ 19న సముద్రంలో ఈత కొడుతూ ప్రాణాలు కోల్పోయారు.

తాజావార్తలు
-
Motorola Edge 50 Ultra 5G: మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G పై రూ.26000 డిస్కౌంట్.. 64MP టెలిఫోటో కెమెరా, pOLED డిస్ప్లే
-
AR Rahman Peddi: ‘బాహుబలి’ చూసాకే తెలుగు సినిమాపై ప్రేమ పెరిగింది..
-
SRH: ఐపీఎల్ చరిత్రలో ఆ అరుదైన ఘనత సాధించిన ఏకైక జట్టు ఎస్ఆర్హెచ్.. మళ్లీ 2016 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
-
Sonam Kapoor: పనిమనుషుల కోసం రూ.51 కోట్ల ఫ్లాట్లా? సోనమ్ టీమ్ క్లారిటీ!
-
SSC GD 2026: అభ్యర్థులకు అలర్ట్.. SSC GD కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మార్పు.. కొత్త ఎగ్జామ్ డేట్ ఇదే
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?