Nikki Haley: చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. తప్పులు చేయొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nikki Haley: అమెరికా అధ్యక్ష బరిలో ఉండేందుకు ఇండో – అమెరికన్ నిక్కీ హేలీ రిపబ్లికన్ పార్టీ తరుపున ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ తరుపున వివేక్ రామస్వామి, డొనాల్డ్ ట్రంప్ తరువాత రెండోస్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా నిక్కీ హేలీ చైనాను ఉద్దేశించి కీలక హెచ్చరికలు చేశారు. న్యూ హాంప్ షైర్ లో జరిగిన ఆర్థిక వ్యవస్థపై మేజర్ పాలసీపై ఆమె మాట్లాడారు.
అమెరికా, ప్రపంచానికి చైనా ముప్పుగా మారిందని ఆమె అన్నారు. చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని అమెరికాను హెచ్చరించారు. అమెరికాను ఓడించేందుకు చైనా అర్ధ శతాబ్ధం కాలంగా కుట్ర పన్నిందని ఆరోపించారు. ఇప్పటికే కొన్ని విషయాల్లో చైనా చైన్యం, అమెరికా సైన్యంతో సమానంగా ఉందని చెప్పారు. అంతకుముందు మరో రిపబ్లికన్ నేత, ఇండో అమెరికన్ వివేక్ రామస్వామి చైనా విదేశాంగ విధానంపై ప్రసంగించారు.
Also Read
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
చైనా, అమెరికా వాణిజ్య రహస్యాలను తెలుసుకుంటోందని, ఔషధాల నునంచి అధునాతన టెక్నాలజీ వరకు క్లిష్టమైన పరిశ్రమలను చైనా తన ఆధీనంలోకి తీసుకుంటుందని, ఆర్థికంగా వెనకబడిన దేశం నుంచి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అవతరించిందని నిక్కీ హేలీ అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ అమెరికాను బెదిరించి ఆసియా వెలుపల ఆధిపత్యం చెయగల భారీ అత్యాధునిక మిలిటరీని నిర్మిస్తున్నారని ఆమె హెచ్చరించారు. అమెరికా గగనతలంలోకి బెలూన్లను పంపి గూఢచర్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
దీని తర్వాత ఆమె ఆర్థిక ప్రణాళికను పంచుకున్నారు. మధ్య తరగతి ప్రజలకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛను అందించడానికి కృషి చేస్తానని అన్నారు. మీ డబ్బును మీను మెరుగ్గా ఉపయోగించుకోవచ్చని, మీరందరూ మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఫెడరల్ గ్యాస్, డిజిల్ పన్నును పూర్తిగా తొలగిస్తామని, దాని వల్ల రికార్డు స్థాయి గ్యాస్ ధరలతో పోరాడుతున్న కుటుంబాలకు మేలు కలుగుతుందని చెప్పారు. తాను దేశాధ్యక్షురాలిని అయితే శ్రామిక కుటుంబాలకు ఆదాయ పన్ను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. బైడెన్ చేపట్టిన 500 బిలియన్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ సబ్సిడీని తొలగిస్తామని, దీంతో శత్రుదేశాలకు మన దేశం నుంచి ఆర్థిక ద్వారాలు మూసుకుపోతాయని అన్నారు.
తాజావార్తలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!