Wife kills husband: భార్య, ప్రియుడి కలిసి భర్త దారుణ హత్య.. శవాన్ని రెండు ముక్కలుగా నరికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife kills husband: తమిళనాడులో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య అత్యంత దారుణంగా హత్య చేసింది. ప్రియుడి మోజులో పడిన సదరు ఇల్లాలు అతడితో కలిసి భర్తను కడతేర్చింది. తిరుచ్చి పోలీసులు ఈ హత్యకు పాల్పడిన మహిళ వినోదిని(26), ఆమె లవర్ భారతి(23)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జంటకు సహకరించిన మరో ముగ్గుర్ని కూడా అరెస్ట్ చేశారు.
వినోదిని, భారతితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో ఆమె భర్త పూలవ్యాపారి ప్రభు(30)ని పథకం ప్రకారం ప్రియుడితో కలిసి హత్య చేసింది. అప్పటికే వినోదినికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రభుకు నిద్ర మాత్రలను ఇచ్చిన వినోదిని, ఆమె ప్రియుడు భారతి, అతని స్నేహితుల సాయంతో గొంతు కోసి హత్య చేసింది.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
ఈ హత్య అనంతరం భారతి, అతని స్నేహితులు తిరుచ్చి-మదురై హైవే సమీపంలో మృతదేహాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించారు. అయితే వర్షం కురవడంతో ఈ పథకం సాధ్యం కాలేదు. అనంతరం ప్రభు మృతదేహాన్ని నరికి కావేరి, కొల్లిడం నదుల్లో పారేశారు. వినోదిని, భారతి, అతని స్నేహితులు రూబెన్ బాబు, దివాకర్, శర్వణ్లను పోలీసులు అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు.
Read Also: Israel-Hamas War: గాజా ఆస్పత్రులను చుట్టుముట్టిన ఇజ్రాయిల్ సైన్యం..
నవంబర్ 5న ప్రభు సోదరుడు ఇంటికి వెళ్లి చూడగా.. తన భర్త ఇంటికి రాలేదని వినోదిని తెలిపింది. ప్రభు సోదరుడు అతనిని వెతికేందుకు మార్కెట్ వెళ్లాడు. ప్రభు ఆచూకీ లభించకపోవడంతో సమయపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో భారతితో వినోదిని వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. ప్రభును తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.
హత్యకు ముందే వినోదిని, భారతి మూడు నెలల క్రితం సంధాయ్ గేట్ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న విషయం ప్రభుకు అనుకోకుండా తెలిసింది. భారతితో సంబంధాన్ని తెంచుకోవాలని వినోదిని ప్రభు హెచ్చరించాడు. ఈ వివాదం కారణంగా వీరిద్దరి మధ్య తరుచుగా గొడవలు జరిగేవి. అయితే గత 10 రోజులుగా వినోదిని భారతిని కలవలేదని, అయితే అతని సాయంతో ప్రభుని హత్య చేయాలని భావించిందని ప్రభు అన్న ఆరోపించాడు. నవంబర్ 4న తన భర్తకు ఆరోగ్యం బాగాలేదని నిద్రమాత్రలు వేసింది, మత్తులోకి జారుకోగానే గొంతు నులిమి హత్య చేసినట్లు సమాచారం. హత్య తర్వాత భారతి తన ముగ్గురు స్నేహితులను పిలిచి మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి కావేరి నదిలో మొండెం, మిగిలిన భాగాలను కొల్లిడం నిదిలో విసిరేశారు.
తాజావార్తలు
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!