Govt Banks: వామ్మో.. ఐదేళ్లలో మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ రూ. 8,500 కోట్లు
- ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ
- గత ఐదేళ్లలో మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ ద్వారా రూ.8 500 కోట్లు
- మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీని నిలిపేసిన ఎస్బీఐ
- ఏడాదిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.633 కోట్ల వసూలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే ఖాతాదారుల నుంచి బ్యాంకులు పెనాల్టీ వసూలు చేస్తున్నాయి. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఐదేళ్లలో మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ ద్వారా రూ.8,500 కోట్లు ఆర్జించాయి. అయితే, దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ (SBI) 2020 ఆర్థిక సంవత్సరం నుంచే మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీని వసూలు చేయడం నిలిపివేసింది. కానీ గత ఐదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ మొత్తం 38 శాతం పెరిగింది. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు.
READ MORE: Andhra Pradesh: ఏపీ అసెంబ్లీని ప్రొరోగ్ చేసిన గవర్నర్.. సర్కార్కు లైన్ క్లియర్
Also Read
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- NPPA: సామాన్యుడికి భారీ ఉపశమనం.. రక్తపోటు నుంచి మధుమేహం వరకు.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం
- RailOne Ticket Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఆ టిక్కెట్స్ చెల్లవు.. కొత్త నిబంధనలు వెల్లడించిన భారతీయ రైల్వే
- Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
2020 నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కనీస బ్యాలెన్స్ జరిమానాగా రూ. 8,500 కోట్లు వసూలు చేశాయి. సమాచారం ప్రకారం.. కస్టమర్లకు కనీస బ్యాలెన్స్ పరిమితి నగరాలు, గ్రామాలలో మారుతూ ఉంటుంది. ఉదాహరణకు.. పంజాబ్ నేషనల్ బ్యాంక్లోని పట్టణ ఖాతాదారులకు సేవింగ్స్ ఖాతాలో కనీస త్రైమాసిక సగటు బ్యాలెన్స్ రూ. 2,000. పట్టణాలకు రూ.1000, గ్రామాలకు రూ.500. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే నగరాల్లో రూ.250, పట్టణాల్లో రూ.150, గ్రామాల్లో రూ.100 వరకు మినహాయించుకోవచ్చు.
READ MORE:Friends Rape: సాఫ్ట్వేర్ ఇంజినీర్పై స్నేహితుల సామూహిక అత్యాచారం.. హోటల్ కు తీసుకుని వెళ్లి..
ఏ బ్యాంక్ ఎక్కువ సంపాదించింది..
ఖాతాలు తెరిచే సమయంలో బ్యాంకులు కనీస నిల్వల గురించి వినియోగదారులకు తెలియజేయాలని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చెప్పారు. SBI 2019-20లో మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ ద్వారా రూ.640 కోట్లు సంపాదించింది. అయితే ఆ తర్వాత బ్యాంకు ఈ విధానాన్ని నిలిపివేసింది. 2023-24లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ పెనాల్టీ ద్వారా రూ.633 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.387 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.369 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.284 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.194 కోట్లు ఆర్జించాయి.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!