Corona Cases: భారీగా పెరిగిన కరోనా కేసులు.. నేడు కేంద్రం ఉన్నత స్థాయి సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corona Cases: ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ తో పోలిస్తే మళ్లీ ఇప్పుడే గరిష్టంగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,050 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటి పోలిస్తే 13 శాతం ఎక్కువగా కేసులు వచ్చాయి. గత ఏడాది సెప్టెంబర్ 16 తర్వాత ఇప్పుడే తొలిసారిగా కేసుల సంఖ్య 6 వేలను దాటింది. నిన్న ఒక్క రోజే 14 మంది మరణించారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా వల్ల 5,30,943 మరణించారు. మహరాష్ట్రలో ముగ్గురు, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇద్దరు చొప్పున ఢిల్లీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ఒక్కొక్కరు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read Also: Covid 19: కరోనా కేసుల పెరుగుదలకు కారణం అవుతున్న XBB1.16 వేరియంట్.. లక్షణాలివే..
Also Read
దేశంలో పెరుగుతున్న కేసులకు XBB1.16 వేరియంట్ కారణం అవుతోంది. అయితే ఈ వేరియంట్ మరణించేంత ప్రభావం చూపించదు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం ఇండియాలో డైలీ పాజిటివీటీ రేటు 3.39 శాతంగా ఉంది. 28,303 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 4.47 కోట్లు (4,47,45,104) కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.06 శాతంగా ఉంది. కోవిడ్ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది.
ఇదిలా ఉంటే పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేడు అత్యున్నత సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు, ఐసీయూలు, ఆక్సిజన్ సౌకర్యాలపై చర్చించనున్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!