Amritpal Singh: భింద్రన్వాలేగా కనిపించేందుకు సర్జరీ.. అమృత్పాల్ సింగ్ కేసులో సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ తప్పించుకుని తిరగుతున్న అమృత్ పాల్ సింగ్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక కుట్ర ప్రకారం ఇండియాలో ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతడికి, ఇతని సన్నిహితులకు పాకిస్తాన్ గూఢాచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్నట్లు, విదేశాల్లోని ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థల నుంచి ఆర్థిక సాయం అందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి.
గత నెల 18న అతడిని పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు భారీ ఎత్తున ఆపరేషన్ నిర్వహించారు. అయితే అప్పటి నుంచి అమృత్ పాల్ సింగ్ తప్పించుకుని తిరుగుతున్నాడు. అతడి సహాయకులును, మద్దతుదారులను పెద్దఎత్తున పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమందిని అస్సాం దిబ్రూగఢ్ జైలుకు తరలించారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
Read Also: Harbhajan Singh : అతడేం పాపం చేశాడు.. ఛాన్స్ ఎందుకు ఇస్తలేరు..
ఇదిలా ఉంటే అమృత్ పాల్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ బ్లూ స్టార్ కు కారణమైన, సిక్కు వేర్పాటువాది జర్నైల్ సింగ్ భింద్రెన్ వాలా కనిపించేందుకు అమృత్ పాల్ సింగ్ కాస్మెటిక్ సర్జరీ చేయించుకునేందు జార్జియా వెళ్లినట్లు తెలుస్తోంది. దిబ్రూగఢ్ లో ఉన్న అతని సన్నిహితులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. వారిస్ పంజాబ్ దే మాజీ లీడర్ దీప్ సిద్ధూ మరణించిన తర్వాత అమృత్ పాల్ సింగ్ ఈ సంస్థకు చీఫ్ గా పేస్ బుక్ ద్వారా ప్రకటించుకున్నాడు. భింద్రన్ వాలే 2.0గా ఫేమస్ అయ్యాడు.
దుబాయ్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న అమృత్ పాల్ సింగ్ హఠాత్తుగా ఇండియా వచ్చేసి తనను తాను సిక్కుల బోధకుడిగా ప్రకటించుకుని ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని పెంచిపోషించాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి చేసి తన మద్దతుదారులను విడిపించుకుని వెళ్లాడు. ఈ ఘటనలో ఎస్పీతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వాలు సంయుక్తంగా అమృత్ పాల్ అంతుచూడాలని భారీ ఆపరేషన్ నిర్వహించాయి.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!