Amritpal Singh: భింద్రన్వాలేగా కనిపించేందుకు సర్జరీ.. అమృత్పాల్ సింగ్ కేసులో సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ తప్పించుకుని తిరగుతున్న అమృత్ పాల్ సింగ్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక కుట్ర ప్రకారం ఇండియాలో ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతడికి, ఇతని సన్నిహితులకు పాకిస్తాన్ గూఢాచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్నట్లు, విదేశాల్లోని ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థల నుంచి ఆర్థిక సాయం అందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి.
గత నెల 18న అతడిని పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు భారీ ఎత్తున ఆపరేషన్ నిర్వహించారు. అయితే అప్పటి నుంచి అమృత్ పాల్ సింగ్ తప్పించుకుని తిరుగుతున్నాడు. అతడి సహాయకులును, మద్దతుదారులను పెద్దఎత్తున పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమందిని అస్సాం దిబ్రూగఢ్ జైలుకు తరలించారు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
Read Also: Harbhajan Singh : అతడేం పాపం చేశాడు.. ఛాన్స్ ఎందుకు ఇస్తలేరు..
ఇదిలా ఉంటే అమృత్ పాల్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ బ్లూ స్టార్ కు కారణమైన, సిక్కు వేర్పాటువాది జర్నైల్ సింగ్ భింద్రెన్ వాలా కనిపించేందుకు అమృత్ పాల్ సింగ్ కాస్మెటిక్ సర్జరీ చేయించుకునేందు జార్జియా వెళ్లినట్లు తెలుస్తోంది. దిబ్రూగఢ్ లో ఉన్న అతని సన్నిహితులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. వారిస్ పంజాబ్ దే మాజీ లీడర్ దీప్ సిద్ధూ మరణించిన తర్వాత అమృత్ పాల్ సింగ్ ఈ సంస్థకు చీఫ్ గా పేస్ బుక్ ద్వారా ప్రకటించుకున్నాడు. భింద్రన్ వాలే 2.0గా ఫేమస్ అయ్యాడు.
దుబాయ్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న అమృత్ పాల్ సింగ్ హఠాత్తుగా ఇండియా వచ్చేసి తనను తాను సిక్కుల బోధకుడిగా ప్రకటించుకుని ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని పెంచిపోషించాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి చేసి తన మద్దతుదారులను విడిపించుకుని వెళ్లాడు. ఈ ఘటనలో ఎస్పీతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వాలు సంయుక్తంగా అమృత్ పాల్ అంతుచూడాలని భారీ ఆపరేషన్ నిర్వహించాయి.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..