Kerala train attack: కేరళ రైలు ఘటనలో సంచలన విషయాలు.. ఉగ్రదాడిగా గుర్తించిన ఏటీఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala train attack: కేరళలో నడుస్తున్న రైలులో అగ్నిప్రమాదం, ముగ్గురు మరణించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ ఘటనలో నిందితుడు షారూఖ్ సైఫీని పోలీసులు అరెస్ట్ చేశారు. షారూఖ్ సైఫీ జరిపింది ఉగ్రదాడి అని యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ఏటీఎస్) నిర్ధారించింది. అతడిపై యూఏపీఏ(ఉపా చట్టం)ప్రయోగిస్తామని కేరళ డీజీపీ అనిల్ కాంత్ వెల్లడించారు. 2019 షాహీన్ బాగ్ ఆందోళన సమయంలో షారూఖ్ ఉగ్రవాదం వైపు మళ్లినట్లు విచారణలో తేలింది. గతేడాది నుంచి ఉగ్రవాదానికి సంబంధించిన వీడియోలను చూస్తున్నాడని మహరాష్ట్ర ఏటీఎస్ వెల్లడించింది. ఇదిలా ఉంటే నిందితుడికి కోజికోడ్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంకా విచారణ ప్రారంభం కాలేదని, వైద్య పరీక్షలు పూర్తయ్యాకే ప్రశ్నిస్తామని అన్నారు.
Read Also: Pink Moon: ఈ పౌర్ణమిని “పింక్ మూన్”గా ఎందుకు పిలుస్తారో తెలుసా..?
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
కేరళ రైలులో అటాక్ కేవలం ట్రయిలర్ మాత్రమే అని ఏటీఎస్ విచారణలో షారూఖ్ వెల్లడించినట్లు సమాచారం. గతేడాది నుంచి అతని ప్రవర్తన పూర్తిగా మారినట్లు ఏటీఎస్ విచారణలో తేలింది. నమాజ్ లోనే ఎక్కువ సమయం గడిపేవాడని, స్మోకింగ్ మానేసినట్లు తేలింది. అతడిలో మతపరమైన మార్పును గమనించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఉత్తరాదికి చెందిన షారూఖ్ కేరళ ఎందుకు వెళ్లాడనే దానిపై విచారించనున్నారు.
ఏప్రిల్ 2న అలపూజా-కన్నూర్ ఎక్స్ప్రెస్ రైలు కోజికోడ్ దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తి నిప్పటించాడు. ఈ ఘటనలో 9 మందికి కాలిన గాయాలు అయ్యాయి. ఈ ఘటన తర్వాత ఏడాది వయసు ఉన్న చిన్నారి, ఒక మహిళతో పాటు ముగ్గురు మరణించారు. ఈ ఘటన తర్వాత నిందితుడు షారూఖ్ సైఫీ తప్పించుకుని పారిపోయాడు. అయితే మహారాష్ట్ర ఏటీఎస్ ఇతడిని రత్నగిరిలో పట్టుకున్నారు. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై కేరళ పోలీస్ తో పాటు ఎన్ఐఏ విచారిస్తోంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!