Amritpal Singh: పంజాబ్ పోలీసులకు అమృత్పాల్ సింగ్ ఎఫెక్ట్.. సెలవులు రద్దు.. బైసాఖి వరకు హైఅలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab High Alert: పంజాబ్ పోలీసులు రాడికల్ ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం వేట కొనసాగిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు మార్చి 18న పంజాబ్ పోలీసులు, సెంట్రల్ టీమ్స్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. అప్పటి నుంచి అతడు తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇదిలా ఉంటే పంజాబ్ పోలీసులపై అమృత్ పాల్ సింగ్ ఎఫెక్ట్ పడింది. ఏప్రిల్ 14 వరకు పోలీసులందరికీ సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బైసాఖి వరకు రాష్ట్రంలో హై అలర్ట్ విధించింది. పోలీసులుతో పాటు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు పంజాబ్ డీజీపీ అన్ని పోలీస్ కార్యాలయాలకు సందేశాలు పంపారు. గతంలో మంజూరైన సెలవులను కూడా రద్దు చేశారు.
Read Also: James Webb telescope: యురేనస్ గ్రహాన్ని ఇంతకుముందు ఎప్పుడూ ఇలా చూసుండరు..
Also Read
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
ఇటీవల ఓ వీడియోలో మాట్లాడుతూ కనిపించిన అమృత్ పాల్ సింగ్ బైసాఖి రోజున ‘సర్బత్ ఖల్సా’కి పిలుపునిచ్చాడు. ప్రపంచంలోని సిక్కులంతా సమావేశం నిర్వహించాలని కోరాడు. ఇదిలా ఉంటే అతడి కోసం పంజాబ్ పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. గతంలో అమృత్ సర్ స్వర్ణదేవాలయం వద్ద లొంగిపోతాడనే లీకులు వచ్చినా.. ఆ తరువాత వీటిని అమృత్ పాల్ ఖండించాడు.
ఏప్రిల్ 14న బైసాఖీ రోజున పంజాబ్ లోని భటిండాలో ‘సర్బత్ ఖల్సా’ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిక్కు అత్యున్నత సంస్థ ‘అకల్ తఖ్త్’కు పిలుపునిచ్చాడు. అయితే దీనిపై సిక్కు అత్యున్నత సంస్థ స్పందించలేదు. సిక్కు పండితులు, మేధావులతో సంప్రదించిన తర్వాతే అఖల్ తఖ్త్ చీఫ్ మాత్రమే సభకు పిలునివ్వాలో లేదో నిర్ణయించగలనరి శిరోమణి గురుద్వారా పర్భందక్ కమిటీ తెలిపింది. గ్యానీ కిర్పాల్ సింగ్ అకల్ తఖ్త్ చీఫ్ గా ఉన్న సమయంలో ఫిబ్రవరి 16, 1986న చివరిసారిగా ‘సర్భత్ ఖల్సా’ సమావేశం జరిగింది. దీని తర్వాత రాడికల్ సిక్కులు 1986, 2015లో సమావేశానికి పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
ట్రెండింగ్
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!