Covid 19: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం అప్రమత్తం అయింది. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఆరోగ్యమంత్రి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఐసీయూలు, ఆక్సిజన్ సదుపాయాలపై సూచనలు చేశారు. ఓ నెల క్రితం వరకు కేవలం వెయ్యి లోపలే ఉన్న రోజూవారీ కేసుల సంఖ్య ప్రస్తుతం వేలల్లో నమోదు అవుతోంది.
50 years of Project Tiger: ‘ప్రాజెక్ట్ టైగర్’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ పులుల గణన డేటాను విడుదల చేయనున్నారు. కర్ణాటకలోని చామనగర జిల్లా బందీపూర్ టైగర్ రిజర్వ్ లో పర్యటించనున్నారు ప్రధాని. హైదరాబాద్, చెన్నై పర్యటన తర్వాత ఆయన మైసూర్ వెళ్లారు. ‘అమృత్ కాల్’ సందర్భంగా పులుల సంరక్షణ కోసం ప్రభుత్వ విధానాలను కూడా ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.
Pakistan: పాకిస్తాన్ ఓ వైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అక్కడ ప్రజలు రోజూ గోధుమ పిండి కోసం పెద్ద యుద్ధాన్నే చేయాల్సి వస్తోంది. ఇప్పటికే ఆహారం కోసం జరిగిన తొక్కిసలాటల్లో 20 మందికి పైగా ప్రజలు చనిపోయారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. మరోవైపు పాకిస్తాన్ కు ఎక్కడా అప్పు పుట్టడం లేదు. ఐఎంఎఫ్ 1.1 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం ఎదురుచూస్తోంది. ఇక మిత్ర దేశాలు కూడా పాకిస్తాన్ ను పట్టించుకోవడం లేదు.
Haldwani jail: హల్ద్వానీ జైలులో కలకలం రేగింది. ఏకంగా ఓ మహిళలో పాటు 40 మందికి పైగా ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ గా నిర్థారణ అయింది. మొత్తం 44 మంది ఖైదీలు ప్రస్తుతం ఆస్పత్రి పాలయ్యారు. ఈ వార్త జైలు అధికారుల్లో కలకలం రేపింది. నెలకు రెండు సార్లు ఆస్పత్రి నుంచి ఓ టీమ్ సాధారణ చెకప్ కోసం జైలుకు వెళ్తుంది. తేలిక పాటి సమస్యలు ఉన్న ఖైదీలందరికీ అక్కడే మందుల్ని అందచేస్తారు. తీవ్ర సమస్యలు ఉన్నవారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు.
Triple Talaq: సైబర్ మోసాల పట్ల ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేసిన ఎక్కడో చోట ప్రజలు అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకుంటున్నారు. విదేశాల నుంచి గిఫ్టులు పంపిస్తామని, లాటరీ తగిలిందని చెబుతూ జనాలను మోసం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సైబర్ మోసం 15 ఏళ్ల వివాహబంధానికి తెరపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే ఒడిశాకు చెందిన ఓ మహిళ రూ. 1.5 లక్షలను సైబర్ మోసంలో పోగొట్టుకుంది. ఇది తెలిసిన భర్త ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు.
Israel: ఇజ్రాయిల్ వరస దాడులతో అట్టుడుకుతోంది. సరిహద్దు దేశాల నుంచి వరసగా రాకెట్ దాడులను ఎదుర్కొంటోంది. జెరూసలెం అల్-అక్సా మసీదు ఘటన తర్వాత నుంచి పాలస్తీనా, లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ పైకి రాకెట్ దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సిరియా నుంచి రాకెట్ దాడులు జరిగాయి.
Farooq Abdullah: సీబీఎస్ఈ సిలబస్ నుంచి మొగలుల చరిత్రకు సంబంధించి కొన్ని పాఠ్యాంశాలను తొలగించడం చర్చనీయాంశం అయింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ విద్యను కాషాయీకరణం చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. చరిత్రను చరిపివేయలేరని శనివారం అన్నారు.
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ లో శాంతిభద్రతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కిీలక వ్యాఖ్యలు చేశారు. 2006 ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్ స్టర్, పొలిటికల్ లీడర్ అతిక్ అహ్మద్ ను ఇటీవల కోర్డు దోషిగా తేల్చి యావజ్జీవం విధించింది. ఈ తీర్పు వచ్చిన కొద్ది రోజుల తర్వాత యోగి శనివారం మాట్లాడుతూ..దోపిడీ బెదిరింపులు మరియు అపహరణలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన గ్యాంగ్స్టర్లు ఇప్పుడు కోర్టులు శిక్షించిన తర్వాత ప్యాంట్లు తడుపుకుంటున్నారని అన్నారు.
Droupadi Murmu: రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం లీడర్ ద్రౌపది ముర్ము భారత వాయుసేన ఫైటర్ జెట్ సుఖఓయ్-30 MKIలో తొలిసారి ప్రయాణించారు. అస్సాం పర్యటనలో ఉన్న రాష్ట్రపతి శనివారం యుద్ధవిమానంలో ప్రయాణించారు. శనివారం ఉదయం తేజ్ పూర్ లోని భారత వాయుసేన ఎయిర్ బేస్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు భద్రత బలగాలు సైనిక వందనం సమర్పించారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. అన్నా చెల్లెలను చెట్టుకు కట్టేసి చావబాదారు గ్రామస్తులు. వీరిద్దరి క్యారెక్టర్లపై అనుమానం పెంచుకున్న గ్రామస్తులు అమానుషంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ ఖాండ్వాలో ఈ విచిత్ర సంఘటన జరిగింది.