North Korea: ఉత్తర కొరియా మరో క్షిపణిని పరీక్షించింది. ‘‘సాలిడ్ ఫ్యూయల్’’ ఖండాంతర క్షిపణిని పరీక్షించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా శుక్రవారం వెల్లడించింది. అణు దాడిని ఎదుర్కొనే లక్ష్యంలో ఇది ముందడుగు అని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. ‘‘హాసాంగ్-18’’ అనే పేరుతో పిలువబడే ఖండాంతర క్షిపణి తమ వ్యూహాత్మక సైనిక శక్తిని పెంచుతుందని, అణుదాడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుందని కిమ్ అన్నట్లు కేసీఎన్ఏ వార్తా సంస్థ పేర్కొంది.
Bihu Dance Enters Guinness Book Of World Records: భారతదేశంలోని అస్సాం రాష్ట్రానికి చెందిన ‘బిహు నృత్యం’ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. అస్సాంలో గురువారం ఒకే వేదికపై బిహు నృత్యాన్ని ప్రదర్శించి చరిత్ర సృష్టించారు. గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నానికి గుర్తింపు లభించింది. 11,000 మంది కళాకారులు, డ్రమ్మర్లు, నృత్యకారులతో సహా గౌహతిలోని సరుసజై స్టేడియంలో పాల్గొన్నారు.
Plane Crash: 1976లో మలేషియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఆ దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకుల మరణానికి కారణం అయింది. ఆస్ట్రేలియాలో తయారీ అయిన టర్నోప్రోప్ విమానం కుప్పకూలిన ఘటన ఇప్పటికీ మిస్టరీగా మారింది. అయితే దాదాపుగా 47 ఏళ్ల తరువాత ఈ విమాన ప్రమాదానికి కారణం తెలిసింది. అయితే విమానంలో ఎలాంటి సాంకేతిక లోపాలు కానీ, అగ్నిప్రమాదం, పేలుడకు సంబంధించిన ఎవిడెన్స్ ఏమీ కనిపించలేదు.
Texas dairy farm explosionఅమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. డిమ్మిట్ లోని సౌత్ ఫోర్క్ డెయిరీ ఫాంలో ఈ దుర్ఘటన జరిగింది. హఠాత్తుగా జరిగిన భారీ పేలుడు మూలంగా ఫామ్ లో ఉన్న 18,000 అవులు మృతి చెందాయి. అందులో పనిచేస్తున్న ఓ మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి
Pakistan: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. అక్కడ నెలకొన్న అస్థిర పరిస్థితులు ఇతర దేశాలను కూడా భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ దేశంలో స్వీడన్ తన రాయబార కార్యాలయాన్ని నిరవధికంగా మూసేసింది. వీసాలు, ఇతర దౌత్యసంబంధాలను మూసేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ ప్రభుత్వం భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినా కూడా ఇతర దేశాలు నమ్మడం లేదు. ప్రభుత్వం, సుప్రీంకోర్టుకు మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులే ఇందుకు కారణం కావచ్చని తెలుస్తోంది.
S Jaishankar: భారతదేశాన్ని ఇరకాలంలో పెట్టాలని దాయాది దేశం పాకిస్తాన్ తో పాటు డ్రాగన్ కంట్రీ చైనా చీటికి మాటికి సరిహద్దు వివాదాలు, సీమాంతర ఉగ్రవాదాలను తెరపైకి తీసుకువస్తున్నాయి. ఇదిలా ఉంటే భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చైనా, పాక్ లను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది విభిన్న భారతదేశం అని, దేశ భద్రతకు ముప్పు వస్తే వారికి గట్టి బదులిస్తాం అంటూ
The New Symptom Of The XBB.1.16 Variant: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,000కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. మరో కొన్ని 10 నుంచి 12 రోజుల వరకు కోవిడ్ కేసుల సంఖ్య పెరగుతూనే ఉంటుందని, ఆ తరువాత తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది.
CM Bhupesh Baghel: బీరాన్ పూర్ ఘటనపై బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్. బీజేపీ సీనియర్ నేతల కుమర్తెలు ముస్లింలను ప్రేమిస్తే దాన్ని ప్రేమ అంటున్నారని, వేరేవారు ప్రేమిస్తే ‘‘లవ్ జీహాద్’’ అంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్గఢ్ లో అత్యంత సీనియర్ బీజేపీ నాయకుడు కుమార్తె ఎక్కడ ఉందో అడగండి..దాన్ని లవ్ జిహాద్ అనడం లేదు ఎందుకు అని ప్రశ్నించారు. బీజేపీ నేతల కుమార్తెలు చేస్తే ప్రేమ, వేరే వారు చేస్తే జిహాదా..? అని అడిగారు.
Meta: ఆర్థికమాంద్యం భయాలు, కంపెనీల ఆదాయాలు తగ్గడంతో పలు ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాలను తొలగించాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు అయిన మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ట్విట్టర్ ఏకంగా 80 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఇదిలా ఉంటే పలు కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే ప్రత్యేక సౌకర్యాలను తగ్గిస్తున్నాయి.
Yogi Adityanath: మాఫియా, ఉగ్రవాదులు, నేరస్తులకు అడ్డాగా ఉత్తర్ ప్రదేశ్ కొన్ని ఏళ్లపాటు ఉంది. అయితే ప్రస్తుతం ఇది మారుతోంది. గతంలో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు గ్యాంగ్ స్టర్లు రాజకీయ నాయకులుగా చలామణి అయ్యారు.