Plane Crash: 1976లో విమాన ప్రమాదం..సీఎంతో సహా 10 మంది మృతి.. 47 ఏళ్ల తర్వాత నిజం తెలిసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Plane Crash: 1976లో మలేషియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఆ దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకుల మరణానికి కారణం అయింది. ఆస్ట్రేలియాలో తయారీ అయిన టర్నోప్రోప్ విమానం కుప్పకూలిన ఘటన ఇప్పటికీ మిస్టరీగా మారింది. అయితే దాదాపుగా 47 ఏళ్ల తరువాత ఈ విమాన ప్రమాదానికి కారణం తెలిసింది. అయితే విమానంలో ఎలాంటి సాంకేతిక లోపాలు కానీ, అగ్నిప్రమాదం, పేలుడకు సంబంధించిన ఎవిడెన్స్ ఏమీ కనిపించలేదు.
బుధవారం విడుదల చేసిన 21 పేజీల నివేదిక ప్రకారం.. ఆస్ట్రేలియా ప్రభుత్వ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసి నోమాడ్ విమానం మలేషియా సబా రాష్ట్ర రాజధాని కోట కినాబాలులో ల్యాండింగ్ చేస్తున్న సమయంలో సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులతో పాటు పైలెట్ మరణించాడు. జూన్6 న జరిగిన ఈ ఘటనను మలేషియా ప్రభుత్వం ‘డబుల్ సిక్స్’ సంఘటనగా పిలుస్తుంది. సబా ముఖ్యమంత్రి తున్ ఫువాడ్ స్టీఫెన్స్ మరియు రాష్ట్ర గృహ మరియు స్థానిక ప్రభుత్వ మంత్రి, ఆర్థిక మంత్రి మరియు కమ్యూనికేషన్ మరియు పబ్లిక్ వర్క్స్ మంత్రి మరణించారు. బాధితుల బంధువులు, ప్రజల నుండి వచ్చిన డిమాండ్లకు ప్రతిస్పందనగా నివేదికను విడుదల చేయనున్నట్లు ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ఈ నెల ప్రారంభంలో చెప్పారు.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
Read Also: USA: టెక్సాస్లో భారీ పేలుడు.. 18,000 ఆవులు మృతి
నివేదిక ప్రకారం విమానం నడిపే సమయంలో పైలెట్ మత్తులో లేదని, అయితే విమానం పనితీరు, పైలెట్ పనితీరును తెలిపే లాగ్ బుక్స్ లో ఒకటి కాలిపోయినట్లు, మరొకటి దొంగిలించబడింది. అయతే రికార్డుల్లో పైలెట్ పనితీరు, శిక్షణ సరిగ్గా లేనట్లు తేలింది. విమానం నడుపుతున్న సమయంలో అతడు అలసటతో ఉన్నట్లు, కడుపు సంబంధిత రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలసింది. అయితే ఇవేవి దుర్ఘటనకు కారణం కాదని తెలిసింది.
నిజానికి ఇద్దరు పైలెట్లు ఉండాల్సిన విమానంలో ఒక్కరే పైలెట్ ఉన్నాడు. విమానం ఎక్కిన మొత్తం 10 మంది ప్రయాణికుల్లో ఒకరు కో పైలెట్ సీట్ లో కూర్చున్నాడు. అయితే అంతకుముందు వెళ్లిన ఓ విమానం ప్రయాణికలుకు సంబంధించిన లగేజీని కూడా ఈ విమానంలోనే ఎక్కించారు. ఈ లగేజీని సరిగ్గా లోడ్ చేయలేదు. దీని కారణంగా విమానం గురుత్వాకర్షణ కేంద్రాన్ని ప్రభావితం చేసింది. అయితే పైలెట్ టేకాఫ్ చేసే సమయంలో లోడ్ సరిగ్గా లేదనే విషయాన్ని గమనించలేదు. దీని కారణంగానే విమానం ల్యాండిగ్ సమయంలో కుప్పకూలి ప్రముఖ రాజకీయ నాయకులు మరణించారు. ఈ విమానానికి సంబంధించి జనవరి 25, 1977న నివేదిక తయారు చేసినా.. ఇప్పటి వరకు బయటకు వెల్లడించలేదు. చివరకు 47 ఏళ్ల తర్వాత అసలు నిజం తెలిసింది.
తాజావార్తలు
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..