Plane Crash: 1976లో విమాన ప్రమాదం..సీఎంతో సహా 10 మంది మృతి.. 47 ఏళ్ల తర్వాత నిజం తెలిసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Plane Crash: 1976లో మలేషియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఆ దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకుల మరణానికి కారణం అయింది. ఆస్ట్రేలియాలో తయారీ అయిన టర్నోప్రోప్ విమానం కుప్పకూలిన ఘటన ఇప్పటికీ మిస్టరీగా మారింది. అయితే దాదాపుగా 47 ఏళ్ల తరువాత ఈ విమాన ప్రమాదానికి కారణం తెలిసింది. అయితే విమానంలో ఎలాంటి సాంకేతిక లోపాలు కానీ, అగ్నిప్రమాదం, పేలుడకు సంబంధించిన ఎవిడెన్స్ ఏమీ కనిపించలేదు.
బుధవారం విడుదల చేసిన 21 పేజీల నివేదిక ప్రకారం.. ఆస్ట్రేలియా ప్రభుత్వ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసి నోమాడ్ విమానం మలేషియా సబా రాష్ట్ర రాజధాని కోట కినాబాలులో ల్యాండింగ్ చేస్తున్న సమయంలో సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులతో పాటు పైలెట్ మరణించాడు. జూన్6 న జరిగిన ఈ ఘటనను మలేషియా ప్రభుత్వం ‘డబుల్ సిక్స్’ సంఘటనగా పిలుస్తుంది. సబా ముఖ్యమంత్రి తున్ ఫువాడ్ స్టీఫెన్స్ మరియు రాష్ట్ర గృహ మరియు స్థానిక ప్రభుత్వ మంత్రి, ఆర్థిక మంత్రి మరియు కమ్యూనికేషన్ మరియు పబ్లిక్ వర్క్స్ మంత్రి మరణించారు. బాధితుల బంధువులు, ప్రజల నుండి వచ్చిన డిమాండ్లకు ప్రతిస్పందనగా నివేదికను విడుదల చేయనున్నట్లు ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ఈ నెల ప్రారంభంలో చెప్పారు.
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
Read Also: USA: టెక్సాస్లో భారీ పేలుడు.. 18,000 ఆవులు మృతి
నివేదిక ప్రకారం విమానం నడిపే సమయంలో పైలెట్ మత్తులో లేదని, అయితే విమానం పనితీరు, పైలెట్ పనితీరును తెలిపే లాగ్ బుక్స్ లో ఒకటి కాలిపోయినట్లు, మరొకటి దొంగిలించబడింది. అయతే రికార్డుల్లో పైలెట్ పనితీరు, శిక్షణ సరిగ్గా లేనట్లు తేలింది. విమానం నడుపుతున్న సమయంలో అతడు అలసటతో ఉన్నట్లు, కడుపు సంబంధిత రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలసింది. అయితే ఇవేవి దుర్ఘటనకు కారణం కాదని తెలిసింది.
నిజానికి ఇద్దరు పైలెట్లు ఉండాల్సిన విమానంలో ఒక్కరే పైలెట్ ఉన్నాడు. విమానం ఎక్కిన మొత్తం 10 మంది ప్రయాణికుల్లో ఒకరు కో పైలెట్ సీట్ లో కూర్చున్నాడు. అయితే అంతకుముందు వెళ్లిన ఓ విమానం ప్రయాణికలుకు సంబంధించిన లగేజీని కూడా ఈ విమానంలోనే ఎక్కించారు. ఈ లగేజీని సరిగ్గా లోడ్ చేయలేదు. దీని కారణంగా విమానం గురుత్వాకర్షణ కేంద్రాన్ని ప్రభావితం చేసింది. అయితే పైలెట్ టేకాఫ్ చేసే సమయంలో లోడ్ సరిగ్గా లేదనే విషయాన్ని గమనించలేదు. దీని కారణంగానే విమానం ల్యాండిగ్ సమయంలో కుప్పకూలి ప్రముఖ రాజకీయ నాయకులు మరణించారు. ఈ విమానానికి సంబంధించి జనవరి 25, 1977న నివేదిక తయారు చేసినా.. ఇప్పటి వరకు బయటకు వెల్లడించలేదు. చివరకు 47 ఏళ్ల తర్వాత అసలు నిజం తెలిసింది.
తాజావార్తలు
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!