Plane Crash: 1976లో విమాన ప్రమాదం..సీఎంతో సహా 10 మంది మృతి.. 47 ఏళ్ల తర్వాత నిజం తెలిసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Plane Crash: 1976లో మలేషియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఆ దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకుల మరణానికి కారణం అయింది. ఆస్ట్రేలియాలో తయారీ అయిన టర్నోప్రోప్ విమానం కుప్పకూలిన ఘటన ఇప్పటికీ మిస్టరీగా మారింది. అయితే దాదాపుగా 47 ఏళ్ల తరువాత ఈ విమాన ప్రమాదానికి కారణం తెలిసింది. అయితే విమానంలో ఎలాంటి సాంకేతిక లోపాలు కానీ, అగ్నిప్రమాదం, పేలుడకు సంబంధించిన ఎవిడెన్స్ ఏమీ కనిపించలేదు.
బుధవారం విడుదల చేసిన 21 పేజీల నివేదిక ప్రకారం.. ఆస్ట్రేలియా ప్రభుత్వ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసి నోమాడ్ విమానం మలేషియా సబా రాష్ట్ర రాజధాని కోట కినాబాలులో ల్యాండింగ్ చేస్తున్న సమయంలో సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులతో పాటు పైలెట్ మరణించాడు. జూన్6 న జరిగిన ఈ ఘటనను మలేషియా ప్రభుత్వం ‘డబుల్ సిక్స్’ సంఘటనగా పిలుస్తుంది. సబా ముఖ్యమంత్రి తున్ ఫువాడ్ స్టీఫెన్స్ మరియు రాష్ట్ర గృహ మరియు స్థానిక ప్రభుత్వ మంత్రి, ఆర్థిక మంత్రి మరియు కమ్యూనికేషన్ మరియు పబ్లిక్ వర్క్స్ మంత్రి మరణించారు. బాధితుల బంధువులు, ప్రజల నుండి వచ్చిన డిమాండ్లకు ప్రతిస్పందనగా నివేదికను విడుదల చేయనున్నట్లు ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ఈ నెల ప్రారంభంలో చెప్పారు.
Also Read
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
- Houthis Attack Saudi: టర్కీ-పాక్తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
Read Also: USA: టెక్సాస్లో భారీ పేలుడు.. 18,000 ఆవులు మృతి
నివేదిక ప్రకారం విమానం నడిపే సమయంలో పైలెట్ మత్తులో లేదని, అయితే విమానం పనితీరు, పైలెట్ పనితీరును తెలిపే లాగ్ బుక్స్ లో ఒకటి కాలిపోయినట్లు, మరొకటి దొంగిలించబడింది. అయతే రికార్డుల్లో పైలెట్ పనితీరు, శిక్షణ సరిగ్గా లేనట్లు తేలింది. విమానం నడుపుతున్న సమయంలో అతడు అలసటతో ఉన్నట్లు, కడుపు సంబంధిత రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలసింది. అయితే ఇవేవి దుర్ఘటనకు కారణం కాదని తెలిసింది.
నిజానికి ఇద్దరు పైలెట్లు ఉండాల్సిన విమానంలో ఒక్కరే పైలెట్ ఉన్నాడు. విమానం ఎక్కిన మొత్తం 10 మంది ప్రయాణికుల్లో ఒకరు కో పైలెట్ సీట్ లో కూర్చున్నాడు. అయితే అంతకుముందు వెళ్లిన ఓ విమానం ప్రయాణికలుకు సంబంధించిన లగేజీని కూడా ఈ విమానంలోనే ఎక్కించారు. ఈ లగేజీని సరిగ్గా లోడ్ చేయలేదు. దీని కారణంగా విమానం గురుత్వాకర్షణ కేంద్రాన్ని ప్రభావితం చేసింది. అయితే పైలెట్ టేకాఫ్ చేసే సమయంలో లోడ్ సరిగ్గా లేదనే విషయాన్ని గమనించలేదు. దీని కారణంగానే విమానం ల్యాండిగ్ సమయంలో కుప్పకూలి ప్రముఖ రాజకీయ నాయకులు మరణించారు. ఈ విమానానికి సంబంధించి జనవరి 25, 1977న నివేదిక తయారు చేసినా.. ఇప్పటి వరకు బయటకు వెల్లడించలేదు. చివరకు 47 ఏళ్ల తర్వాత అసలు నిజం తెలిసింది.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!