Venu Goapl Reddy
Author- NTV Telugu-
Patalkot Express: పాతాల్కోట్ ఎక్స్ప్రెస్లో మంటలు.. 4 కోచ్లు దగ్ధం..
Patalkot Express: మరో రైలు ప్రమాదానికి గురైంది. పంజాబ్లోని ఫిరోజ్పూర్ నుండి మధ్యప్రదేశ్లోని శివానికి వెళ్తున్న పాతాల్కోట్ ఎక్స్ప్రెస్ (14624)లోని నాలుగు కోచ్లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా థానా మల్పురాలోని బధాయి రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రైలు ఆగ్రా నుంచి ఝాన్సికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
China: చైనాలో వెలుగులోకి 8 రకాల కొత్త వైరస్లు.. మరో మహమ్మారిపై ఆందోళన..
China: 2019 మొదలైన కరోనా వైరస్ ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఆల్పా, బీటా, ఓమిక్రాన్ అంటూ ఇలా తన రూపాన్ని మార్చుకుని మనుషులపై దాడి చేస్తోంది. తొలిసారిగా ఈ వైరస్ చైనా నగరమైన వూహాన్ లో బయటపడింది. ఆ తర్వాత నెమ్మదిగి ప్రపంచం అంతటా వ్యాపించింది. ప్రస్తుతం కోవిడ్-19కి వ్యాక్సిన్ కనుగొన్నా కూడా అడపాదడపా ఇది తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. -
Tamil Nadu: గవర్నర్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి.. డీఎంకేపై బీజేపీ విమర్శలు..
మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో కారుక వినోద్ అనే వ్యక్తి రాజ్ భవన్ ప్రధాన గేటు వద్ద పెట్రోల్ బాంబులను విసిరాడు. 2022లో చెన్నైలోని బీజేపీ కార్యాలయం వద్ద బాంబులు విసిరిన కేసులో కూడా వినోద్ అరెస్టయ్యాడు. ఈకేసులో మూడు రోజుల క్రితమే విడుదయ్యాడు. -
Skin Cancer: సబ్బుతో స్కిన్ క్యాన్సర్కి చెక్.. యంగ్ సైంటిస్ట్ వినూత్న ఆవిష్కరణ..
Skin Cancer: వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా, ఇప్పటికీ కొన్ని వ్యాధులకు పూర్తిగా చికిత్స కలిగిలేము. ఇందులో క్యాన్సర్ కూడా ఉంది. అయితే అమెరికాకు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు మాత్రం అద్భుతం చేశాడనే చెప్పాలి. హేమన్ బెకెలే చర్మ క్యాన్సర్ తో పోరాడేందుకు ఓ సబ్బును కనుగొన్నాడు. 2023 3ఎం యంగ్ సైంటిస్ట్స్ ఛాలెంజ్ లో 9 మంది వ్యక్తులతో పోటీ పడిన అతను అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్ గా విజయం సాధించాడు. 25,000 డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. -
Rahul Gandhi: పుల్వామా, అదానీ గురించి సత్యపాల్ మాలిక్ నాతో చర్చించారు.
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మధ్య జరిగిన సమావేశం గురించి ఎక్స్(ట్విట్టర్)లో పంచుకున్నారు. తామిద్దరం పుల్వామా దాడి, జమ్మూ కాశ్మీర్లో పరిస్థితుల గురించి చర్చించినట్లు వెల్లడించారు. అదానీ వ్యవహారం గురించి చర్చించినట్లు వెల్లడించారు. ఇద్దరి మధ్య ఈ భేటీ ఈడీ, సీబీఐల ప్రయేయాన్ని పెంచుతుందా..? అంటూ కేంద్రంపై వ్యంగాస్త్రాలు సంధించారు. -
Tayyip Erdogan: “హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ కాదట”.. టర్కీ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు..
Tayyip Erdogan: వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటే టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. అక్టోబర్ 7న పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి అక్కడి ప్రజల్ని ఊచకోత కోశారు. ఈ దాడిలో 1400 మంది అమయాకు ప్రజలు, పిల్లలు, మహిళలు చనిపోయారు. ఈ దాడి ప్రస్తుతం ఇజ్రాయిల్, హమాస్ మధ్య తీవ్ర యుద్ధానికి కారణంమైమది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచుతోంది. -
Rajasthan: రాజస్థాన్లో దారుణం.. ట్రాక్టర్తో 8 సార్లు తొక్కించి సోదరుడి హత్య..
Rajasthan: రాజస్థాన్ లో దారుణం జరిగింది. భూమి విషయంలో తగాదా ఒకరి దారుణ హత్యకి కారణమైంది. ఒక వ్యక్తి తన సోదరుడిపై నుంచి ట్రాక్టర్ పోనిచ్చి హత్య చేశాడు. ఒకసారి కాదు 8 సార్లు అతనిని ట్రాక్టర్ తో తొక్కించాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ఘటన రాజస్థాన్ లోని భరత్పూర్ లో చోటు చేసుకుంది. -
Israel: ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే ప్రధాని నెతన్యాహు కుమారుడెక్కడ.?
Israel: అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై పాలస్తీనా హమాన్ మిలిటెంట్ సంస్థ క్రూరమైన దాడికి పాల్పడింది. ఈ దాడిలో 1400 మంది ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. అయితే అప్పటి నుంచి గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానిక బలగాలు నిప్పుల వర్షాన్ని కురపిస్తున్నాయి. హమాస్ ఉగ్రవాదులు ఉన్నారని అనుమానం వచ్చినా కూడా ఆ భవనాలను నామరూపాలు లేకుండా చేస్తోంది. ఇజ్రాయిల్ జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు గాజాలో 5000 మంది చనిపోయారు. వీరిలో సాధారణ పౌరులు, పిల్లలు కూడా ఉన్నారు. -
NCERT: ఇకపై పుస్తకాల్లో ‘ఇండియా’ బదులు ‘భారత్’..
NCERT: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొద్ది రోజులుగా దేశ పేరును ఇండియా స్థానంలో భారత్ అని మారుస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారం ఎలా ఉన్నా.. ప్రస్తతం NCERT కొత్త పుస్తకాలల్లో ఇండియాకు బదులుగా భారత్ అని మర్చారు. కొత్తగా వచ్చే పుస్తకాలన్నింటిలో ఇండియా స్థానంలో భారత్ అని ఉంటుంది. -
Afghanistan: హిందువులు, సిక్కులను ప్రతినిధిని నియమించిన తాలిబాన్లు.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వైదొలగడంతో అక్కడి ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే రష్యా, చైనా, ఖతార్ లాంటి కొన్ని దేశాలు మినహా అక్కడి ప్రభుత్వానిన ప్రపంచం గుర్తించలేదు. మహిళల హక్కులు, విద్యపై తాలిబాన్ల ఆంక్షలు ఎక్కువ కావడంతో ఆ దేశానికి విదేశాల నుంచి వచ్చే సాయం కూడా తగ్గింది.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!