Drugs : పబ్బుల్లో డ్రగ్స్ దొరికితే లైసెన్సులు రద్దు..
- క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై సీపీ సజ్జనార్ కఠిన ఆదేశాలు
- పబ్బుల్లో డ్రగ్స్ దొరికితే లైసెన్స్ రద్దు హెచ్చరిక
- రాత్రి 1 గంటలోపు వేడుకలు ముగించాలని ఆదేశం
- డ్రంక్ అండ్ డ్రైవ్పై జీరో టాలరెన్స్ విధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. వేడుకల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా, చట్ట పరిమితులను అతిక్రమించినా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం నుండి నూతన సంవత్సర వేడుకల వరకు కొనసాగేలా భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు.
Waste-to-Energy: వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలు – ఏపీ డిస్కం మధ్య కుదిరిన ఎంవోయూ
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
ముఖ్యంగా పబ్బులు, హోటళ్ల యాజమాన్యాలకు కమిషనర్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పబ్బుల్లో గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు (డ్రగ్స్) దొరికితే యాజమాన్యాలపై అత్యంత తీవ్రమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, సదరు హోటల్ లేదా పబ్బు లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తామని ప్రకటించారు. అలాగే, వేడుకల నెపంతో అశ్లీల నృత్యాలకు అనుమతి ఇస్తే నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. నగరంలోని అన్ని పబ్బులు , హోటళ్లలో నిర్వహించే వేడుకలను రాత్రి 1:00 గంటలోపు కచ్చితంగా ముగించాలని ఆదేశించారు. వేడుకల సమయంలో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 15 షీ టీమ్స్ను (SHE Teams) రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు.
ఇక వాహనదారుల విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తామని సిపి పేర్కొన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నగరం వ్యాప్తంగా సుమారు 100 కీలక ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ తనిఖీల కోసం ప్రత్యేకంగా ఏడు అదనపు పోలీస్ ప్లాటూన్లను కేటాయించారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడితే, వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధిస్తారు. అంతేకాకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారి డ్రైవింగ్ లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయాలని రవాణా శాఖకు సిఫారసు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. నగర ప్రజలు బాధ్యతాయుతంగా పండుగలను జరుపుకోవాలని, చట్టాన్ని అతిక్రమించే వారిపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని సజ్జనార్ స్పష్టం చేశారు.
Waste-to-Energy: వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలు – ఏపీ డిస్కం మధ్య కుదిరిన ఎంవోయూ
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!