Drugs : పబ్బుల్లో డ్రగ్స్ దొరికితే లైసెన్సులు రద్దు..
- క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై సీపీ సజ్జనార్ కఠిన ఆదేశాలు
- పబ్బుల్లో డ్రగ్స్ దొరికితే లైసెన్స్ రద్దు హెచ్చరిక
- రాత్రి 1 గంటలోపు వేడుకలు ముగించాలని ఆదేశం
- డ్రంక్ అండ్ డ్రైవ్పై జీరో టాలరెన్స్ విధానం
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. వేడుకల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా, చట్ట పరిమితులను అతిక్రమించినా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం నుండి నూతన సంవత్సర వేడుకల వరకు కొనసాగేలా భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు.
Waste-to-Energy: వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలు – ఏపీ డిస్కం మధ్య కుదిరిన ఎంవోయూ
Also Read
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
- Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
ముఖ్యంగా పబ్బులు, హోటళ్ల యాజమాన్యాలకు కమిషనర్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పబ్బుల్లో గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు (డ్రగ్స్) దొరికితే యాజమాన్యాలపై అత్యంత తీవ్రమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, సదరు హోటల్ లేదా పబ్బు లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తామని ప్రకటించారు. అలాగే, వేడుకల నెపంతో అశ్లీల నృత్యాలకు అనుమతి ఇస్తే నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. నగరంలోని అన్ని పబ్బులు , హోటళ్లలో నిర్వహించే వేడుకలను రాత్రి 1:00 గంటలోపు కచ్చితంగా ముగించాలని ఆదేశించారు. వేడుకల సమయంలో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 15 షీ టీమ్స్ను (SHE Teams) రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు.
ఇక వాహనదారుల విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తామని సిపి పేర్కొన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నగరం వ్యాప్తంగా సుమారు 100 కీలక ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ తనిఖీల కోసం ప్రత్యేకంగా ఏడు అదనపు పోలీస్ ప్లాటూన్లను కేటాయించారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడితే, వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధిస్తారు. అంతేకాకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారి డ్రైవింగ్ లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయాలని రవాణా శాఖకు సిఫారసు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. నగర ప్రజలు బాధ్యతాయుతంగా పండుగలను జరుపుకోవాలని, చట్టాన్ని అతిక్రమించే వారిపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని సజ్జనార్ స్పష్టం చేశారు.
Waste-to-Energy: వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలు – ఏపీ డిస్కం మధ్య కుదిరిన ఎంవోయూ
తాజావార్తలు
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
-
మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!