Karnataka Elections: కర్ణాటకలో ప్రచారానికి ప్రధాని మోదీ.. 20 చోట్ల భారీ బహిరంగ సభలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Elections: కర్ణాటక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్, జేడీయూలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాయి. అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ, అధికారంలోకి రావాలని కాంగ్రెస్, కింగ్ మేకర్ పాత్ర పోషించాలని జేడీఎస్ ఇలా ప్రతీపార్టీ కూడా తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలను అంతా సెమీఫైనల్ గా భావిస్తున్నారు.
Read Also: BJP Reacts: గాంధీ కుటుంబంపై చెంపదెబ్బ.. సూరత్ కోర్టు తీర్పుపై బీజేపీ
Also Read
- Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్రమోదీ వెళ్లనున్నారు. ఈ నెల 28 నుంచి దాదాపుగా వారం రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దాదాపుగా 20 చోట్ల భారీ బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొనేలా కర్ణాటక బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజులో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుండటంతో ప్రచారంపై బీజేపీ నేతలు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో మాజీ సీఎం, బీజేపీ నేత యడియూరప్ప కీలకంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత మరోసారి అధిష్టానం ఆయనపై పెట్టింది. యడియూరప్పను సీఎం కుర్చీ నుంచి దించేసి, బసవరాజ్ బొమ్మైని సీఎంగా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి యడియూరప్ప ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఆయన కొడుకును బరిలోకి దించారు. ఇదిలా ఉంటే సీఎం ఎవరన్నదానిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ప్రస్తుత సీఎం బొమ్మై వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. లింగాయత్ వర్గంలో బలమైన నేతగా ఉన్న యడియూరప్ప, ఆ వర్గం నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కర్ణాటక ఎన్నికలల్లో లింగాయత్, వొక్కలిగ వర్గాలు కీలకంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ రెండు వర్గాల ఓట్లను సాధించేందుకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, జేడీఎస్ ప్రయత్నిస్తున్నాయి.
తాజావార్తలు
-
Patriot: 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి – మోహన్ లాల్ కలయిక.. ‘పేట్రియాట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
-
Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!