Karnataka Elections: కర్ణాటకలో ప్రచారానికి ప్రధాని మోదీ.. 20 చోట్ల భారీ బహిరంగ సభలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Elections: కర్ణాటక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్, జేడీయూలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాయి. అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ, అధికారంలోకి రావాలని కాంగ్రెస్, కింగ్ మేకర్ పాత్ర పోషించాలని జేడీఎస్ ఇలా ప్రతీపార్టీ కూడా తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలను అంతా సెమీఫైనల్ గా భావిస్తున్నారు.
Read Also: BJP Reacts: గాంధీ కుటుంబంపై చెంపదెబ్బ.. సూరత్ కోర్టు తీర్పుపై బీజేపీ
Also Read
- Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో 'కమిషన్ల' భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్రమోదీ వెళ్లనున్నారు. ఈ నెల 28 నుంచి దాదాపుగా వారం రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దాదాపుగా 20 చోట్ల భారీ బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొనేలా కర్ణాటక బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజులో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుండటంతో ప్రచారంపై బీజేపీ నేతలు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో మాజీ సీఎం, బీజేపీ నేత యడియూరప్ప కీలకంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత మరోసారి అధిష్టానం ఆయనపై పెట్టింది. యడియూరప్పను సీఎం కుర్చీ నుంచి దించేసి, బసవరాజ్ బొమ్మైని సీఎంగా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి యడియూరప్ప ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఆయన కొడుకును బరిలోకి దించారు. ఇదిలా ఉంటే సీఎం ఎవరన్నదానిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ప్రస్తుత సీఎం బొమ్మై వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. లింగాయత్ వర్గంలో బలమైన నేతగా ఉన్న యడియూరప్ప, ఆ వర్గం నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కర్ణాటక ఎన్నికలల్లో లింగాయత్, వొక్కలిగ వర్గాలు కీలకంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ రెండు వర్గాల ఓట్లను సాధించేందుకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, జేడీఎస్ ప్రయత్నిస్తున్నాయి.
తాజావార్తలు
-
Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
-
FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
-
Neha Dhupia: ‘ఇదంతా వెంటనే ఆపండి’.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
-
YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?