CM Revanth Reddy : అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక దిశానిర్దేశం
- రెండేళ్ల పాలన సందర్భంగా కార్యదర్శులతో సీఎం రేవంత్ సమీక్ష
- ‘తెలంగాణ రైజింగ్ 2047’ అమలుపై స్పష్టమైన ఆదేశాలు
- కూర్–ప్యూర్–రేర్ జోన్లుగా రాష్ట్ర విభజన ప్రణాళిక
- అధికారుల పనితీరుపై నెలవారీ, త్రైమాసిక పర్యవేక్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖల కార్యదర్శులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో విద్య, వైద్యం, సాగునీరు వంటి కీలక రంగాలకు నిర్దిష్టమైన పాలసీలు లేకపోవడం వల్ల పౌరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్ది స్పష్టమైన విధివిధానాలతో ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం రాష్ట్రాన్ని మూడు విభిన్న జోన్లుగా అంటే ‘కూర్’ (CURE), ‘ప్యూర్’ (PURE), ‘రేర్’ (RARE) గా విభజించి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఈ ప్రణాళికలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాలంటే అధికారుల మధ్య సమన్వయం అత్యంత అవసరమని ఆయన గుర్తు చేశారు. ఎంత గొప్ప పథకాలైనా శాఖల మధ్య సమన్వయ లోపం ఉంటే ఆశించిన ఫలితాలను ఇవ్వవని, అందుకే ప్రతి అధికారి జవాబుదారీతనంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
అధికారుల పనితీరుపై ఇకనుంచి నిరంతర నిఘా ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రతి నెలా కార్యదర్శుల పనితీరును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సమీక్షిస్తారని, ఇందుకు సంబంధించిన నివేదికలను అధికారులు ప్రతి నెలా తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశించారు. తాను స్వయంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి అధికారుల పనితీరుపై ప్రగతి నివేదికలను పరిశీలిస్తానని తెలిపారు. పనుల్లో జాప్యాన్ని నివారించడానికి , శాఖల మధ్య సమన్వయం పెంచడానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
SIR Effect: కేరళ, అండమాన్–నికోబార్, ఛత్తీస్గఢ్లో లక్షల సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగింపు..!
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..