YS Jagan: సత్యమేవ జయతే.. టీడీపీ, జనసేన నేతలపై వైఎస్ జగన్ ఫైర్..
- టీడీపీ, జనసేన అబద్ధాల దుష్ప్రచారంపై వైఎస్ జగన్ ఫైర్..
- టీడీపీ, జనసేన అధికారం లోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా..
- గత వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయంటూ ఎక్స్ వేదికగా జగన్ ట్వీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: టీడీపీ, జనసేన పార్టీల అబద్ధపు ప్రచారాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ, జనసేన పార్టీలు అధికారం లోకి రాకముందు కూడా, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత వైసీపీ ప్రభుత్వంపై నిరంతరం ఆరోపణలు చేస్తున్నాయని జగన్ విమర్శించారు. వైసీపీ పాలనలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని, రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోయాయని, పారిశ్రామికవేత్తలు పారిపోయారని, ఎలాంటి పారిశ్రామిక పురోగతి లేదంటూ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలు నిజమైతే రాష్ట్రంలోని తయారీ, పారిశ్రామిక రంగాల పనితీరు అత్యంత దారుణంగా ఉండేదని జగన్ వ్యాఖ్యానించారు. కానీ వాస్తవ గణాంకాలు మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితిని స్పష్టంగా చూపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
Read Also: SIR Effect: కేరళ, అండమాన్–నికోబార్, ఛత్తీస్గఢ్లో లక్షల సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగింపు..!
Also Read
- AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
- YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
- AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్దే.. కఠిన చర్యలకు పవన్ కల్యాణ్ ఆదేశాలు
భారత రిజర్వ్ బ్యాంక్ ఈ నెల విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, 2019–2024 కాలంలో ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో ప్రథమ స్థానంలో, యావత్ దేశంలో 5వ స్థానంలో నిలిచిందని జగన్ గుర్తుచేశారు. అదే విధంగా, పారిశ్రామిక రంగం మొత్తం పురోగతిలో కూడా ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతంలో నెం.1గా, దేశవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇలాంటి గణాంకాలు ఉన్నప్పటికీ బ్రాండ్ ఏపీ నాశనమైందని ఎలా చెబుతారని ప్రశ్నించిన జగన్, ఇది సమర్థవంతమైన పాలన ఫలితమా? లేక కావాలనే చేసిన దుష్ప్రచారమా? అని నిలదీశారు. చివరగా, నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయని పేర్కొంటూ “సత్యమేవ జయతే” అంటూ తన వ్యాఖ్యలను ముగించారు.
𝗧𝗗𝗣 – 𝗝𝗦𝗣 𝗹𝗶𝗲𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱
TDP and JSP, before and after forming Government persistently made the following allegations
-Brand AP was destroyed owing to YSRCP Government
-Investors abandoned AP owing to YSRCP Government
-No industrial growth was witnessed during… pic.twitter.com/KvB40DJWGL— YS Jagan Mohan Reddy (@ysjagan) December 23, 2025
తాజావార్తలు
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
-
Kia Syros Flex Fuel: 100% ఇథనాల్తోనూ నడుస్తుంది.. కియా సైరస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వచ్చేసింది..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!