CNG Cars: పెట్రోల్, డిజిల్ ధరలు సెంచరీ దాటడంతో వాహనవినియోగదారులు ప్రత్యామ్నాయ ఫ్యూయర్ ఆఫ్షన్లు ఉన్న కార్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాగా.. మరికొన్ని కంపెనీలు ఎక్కువగా CNG కార్ల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్లను కలగలిపి హైబ్రీడ్ టెక్నాలజీతో ఎక్కువ మైలెజ్ ఇచ్చే కార్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి.
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపార్జాయ్’ తుఫాన్ రానున్న 12 గంటల్లో అత్యంత తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం తెలిపింది. గుజరాత్ లోని పోర్బందర్ తీరానికి 200-300 కి.మీ దూరంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే ఐదురోజులు గుజరాత్ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు, బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.
Bomb Blast: ఆఫ్రికా దేశం సోమాలియాలో భారీ బాంబు పేలుడు సంభవించింది. శనివారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మొత్తం 27 మంది మరణించినట్లు సీఎన్ఎన్ నివేదించింది. సోమాలియాలోని లోయర్ షాబెల్లె రీజియన్ లో ఘటన జరిగింది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. 53 మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. మురాలే గ్రామంలోని జనాలే ఏరియాలోని ఫుట్ బాట్ ఫీల్డ్ లో ఈ పేలుడు జరిగింది.
Bihar BJP chief: బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.
Gujarat: నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖోరాసన్ ప్రావిన్స్ (ISKP) మాడ్యూల్ను గుజరాత్ ఏటీఎస్ ఛేదించింది. పోర్ బండర్, సూరత్ ప్రాంతాల్లో మూడు చోట్ల ఆపరేషన్ నిర్వహించి ఒక మహిళతో సహా నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. వీరంతా జమ్మూ కాశ్మీర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Petrol Rates: ఇటీవల కాలంలో కేంద్రం పెట్రోల్, డిజిల్ రేట్లను తగ్గిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు.
Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్ చేయాలని పలువురు రెజ్లర్లు గత కొంత కాలంగా ఆందోళన నిర్వహిస్తున్నారు.
Karnataka High Court: అనుమానంతో తన భార్య, ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురిని హత్య చేసిన వ్యక్తికి కర్ణాటక హైకోర్ట్ ధర్వార్డ్ బెంచ్ మరణశిక్ష విధించింది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు మరణాలకు దారితీసిన ఈ నేరాన్ని కూరత్వంతో పోలుస్తూ అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించింది. బరువెక్కిన హృదయంతో ట్రయర్ కోర్టు విధించిన మరణశిక్షను ధృవీకరించడం తప్పితే మాకు మరో మార్గం లేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
Pakistan: పాకిస్తాన్ లో హిందువుల పరిస్థితి దయనీయంగా మారింది. మైనారిటీలైన హిందువులు, సిక్కులు, క్రైస్తవులపై నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హిందూ బాలికను బలవంతంగా అపహరించి, మతం మార్చి, ముస్లిం వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం మైనారిటీల రక్షణకు కృషి చేయడం లేదు. పోలీసుల దగ్గర నుంచి కోర్టుల వరకు హిందువులకు న్యాయం దక్కడం లేదు.