Rajnath Singh: ఆ ఏడాది నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: దేశ అభివృద్ధిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందుతోందని, వందేళ్ల స్వాతంత్ర వేడుకల నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీహార్లోని గోపాల్ నారాయణ్ సింగ్ యూనివర్శిటీ స్నాతకోత్సవానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో పోలిస్తే ప్రస్తుతం దేశ స్థితిగతులు పూర్తిగా మారాయని ఆయన అన్నారు.
Read Also: Cyclone Biparjoy: 12 గంటల్లో అత్యంత తీవ్రమైన తుఫాన్గా “బిపార్జాయ్”
Also Read
- MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
గతంలో కాంగ్రెస్ హయాంతో, బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి భారతదేశం ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, ప్రస్తుతం బీజేపీ హాయాంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని ఆయన అన్నారు. 2027 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదికను ప్రస్తావిస్తూ అన్నారు. 2027 నాటికి టాప్-3 ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఉంటుందని అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు భావిస్తున్నారని ఆయన అన్నారు. చాలా మంది విదేశీయులు మనదేశాన్ని ఇండియా అనడం బదులుగా భారత్ అనేందుకు ఇష్టపడుతున్నారని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ప్రపంచంలో భారతదేశానికి గౌరవం పెరిగిందని అన్నారు. ఇది విదేశీయులకు మన దేశ సాంస్కృతిక వారసత్వంపై పెరుగుతున్న అభిమానాన్ని సూచిస్తోందని ఆయన అన్నారు.
ఇప్పుడు ప్రపంచం భారత్ వైపు చూస్తోందని, ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ హామీలను నెరవేరుస్తోందని ఆయన అన్నారు. ఆర్టికల్ 370, రామ మందిర నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. నేడు దేశంలోని దాదాపు 12 కోట్ల ఇళ్లకు కుళాయిల ద్వారా నీరు చేరిందని, 2014లో దాదాపు 18 వేల గ్రామాల్లో కరెంటు లేదని, నేడు ప్రతి ఇంటికి కరెంటు వచ్చిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలించే పనిని మన ప్రధాని నరేంద్ర మోదీ చేశారని గుర్తు చేశారు. గతంలో భారత్ లాంటి దేశంలో డిజిటల్ లావాదేవీలు సాధ్యం కావని అంతా అనుకునే వారని.. కానీ ఇప్పుడు డిజిటల్ లావాదేవీల్లో భారత్ దూసుకుపోతుందని అన్నారు.
తాజావార్తలు
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!