Karnataka High Court: అనుమానంతో భార్య, పిల్లల హత్య.. చనిపోయేదాకా ఉరితీయాలని కోర్టు తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka High Court: అనుమానంతో తన భార్య, ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురిని హత్య చేసిన వ్యక్తికి కర్ణాటక హైకోర్ట్ ధర్వార్డ్ బెంచ్ మరణశిక్ష విధించింది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు మరణాలకు దారితీసిన ఈ నేరాన్ని కూరత్వంతో పోలుస్తూ అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించింది. బరువెక్కిన హృదయంతో ట్రయర్ కోర్టు విధించిన మరణశిక్షను ధృవీకరించడం తప్పితే మాకు మరో మార్గం లేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
న్యాయమూర్తి సూరజ్ గోవిందరాజ్ మరియు జస్టిస్ జి బసవరాజా ధర్మాసనం, దీన్ని మరణశిక్ష విధించాల్సిన అరుదైన కేసుల్లో ఒకటిగా పేర్కొంది. నిందితుడి క్రూరత్వానికి దిగ్భ్రాంతికి గురైనట్లు హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలు మరియు ముగ్గురు పిల్లలపై దాడి చేయడం, వారిని నరికివేయడం, రక్తంతో ఉన్న కత్తిని బయటకు తీసుకువచ్చి వేశ్యను చంపానని ప్రకటించడం, మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసిందని కోర్టు వ్యాఖ్యానించింది. నిందితుడిని మరణించే వరకు ఉరితీయాలని, అంతకుముందు బళ్లారి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి, ఉరి శిక్షను ధృవీకరించింది.
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
Read Also:Pakistan: హిందువుల పరిస్థితి ఇంతే.. బాలిక కిడ్నాప్, మతమార్పిడి.. కన్నవారితో పంపేందుకు కోర్టు నిరాకరణ
కేసు వివరాలు ఇవే:
బళ్లారిలోని హోసపేటలోని కంప్లిలోని కెంచనగుడ్డ హళ్లికి చెందిన నిందితుడు బైలూరు తిప్పయ్య అనే కూలీ తన భార్యకు 12 ఏళ్లుగా అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గొడవ పడుతుండే వాడు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఇందులో ఒకరు మాత్రమే తన సంతానం అని తిప్పయ్య ప్రకటించాడు. 2017 ఫిబ్రవరి 25న భార్య పక్కీరమ్మపై చాపర్తో దాడి చేశాడు. కోడలు గంగమ్మ, అతని పిల్లలు పవిత్ర, నాగరాజ్, రాజప్పపై కూడా దాడి చేశాడు. ఐదుగురు తీవ్ర గాయాలపాలై ప్రాణాలు విడిచారు.
బళ్లారి సెషన్స్ కోర్టు 36 మంది సాక్షులను విచారించి తిప్పయ్యను దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పింది. ఆ తరువాత ఈ రోజు కర్ణాటక హైకోర్టు కూడా ఇదే తీర్పును వెలవరించింది. ఈ హత్యకాండలో ప్రాణాలతో బయటపడిన ఏకైక చిన్నారి రాజేశ్వరికి పరిహారం చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!