Karnataka High Court: అనుమానంతో భార్య, పిల్లల హత్య.. చనిపోయేదాకా ఉరితీయాలని కోర్టు తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka High Court: అనుమానంతో తన భార్య, ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురిని హత్య చేసిన వ్యక్తికి కర్ణాటక హైకోర్ట్ ధర్వార్డ్ బెంచ్ మరణశిక్ష విధించింది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు మరణాలకు దారితీసిన ఈ నేరాన్ని కూరత్వంతో పోలుస్తూ అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించింది. బరువెక్కిన హృదయంతో ట్రయర్ కోర్టు విధించిన మరణశిక్షను ధృవీకరించడం తప్పితే మాకు మరో మార్గం లేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
న్యాయమూర్తి సూరజ్ గోవిందరాజ్ మరియు జస్టిస్ జి బసవరాజా ధర్మాసనం, దీన్ని మరణశిక్ష విధించాల్సిన అరుదైన కేసుల్లో ఒకటిగా పేర్కొంది. నిందితుడి క్రూరత్వానికి దిగ్భ్రాంతికి గురైనట్లు హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలు మరియు ముగ్గురు పిల్లలపై దాడి చేయడం, వారిని నరికివేయడం, రక్తంతో ఉన్న కత్తిని బయటకు తీసుకువచ్చి వేశ్యను చంపానని ప్రకటించడం, మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసిందని కోర్టు వ్యాఖ్యానించింది. నిందితుడిని మరణించే వరకు ఉరితీయాలని, అంతకుముందు బళ్లారి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి, ఉరి శిక్షను ధృవీకరించింది.
Also Read
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
- Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
- PM Modi: డ్రగ్స్కు దూరంగా యువత.. వికసిత్ భారత్కు అదే కీలకం.. ‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
Read Also:Pakistan: హిందువుల పరిస్థితి ఇంతే.. బాలిక కిడ్నాప్, మతమార్పిడి.. కన్నవారితో పంపేందుకు కోర్టు నిరాకరణ
కేసు వివరాలు ఇవే:
బళ్లారిలోని హోసపేటలోని కంప్లిలోని కెంచనగుడ్డ హళ్లికి చెందిన నిందితుడు బైలూరు తిప్పయ్య అనే కూలీ తన భార్యకు 12 ఏళ్లుగా అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గొడవ పడుతుండే వాడు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఇందులో ఒకరు మాత్రమే తన సంతానం అని తిప్పయ్య ప్రకటించాడు. 2017 ఫిబ్రవరి 25న భార్య పక్కీరమ్మపై చాపర్తో దాడి చేశాడు. కోడలు గంగమ్మ, అతని పిల్లలు పవిత్ర, నాగరాజ్, రాజప్పపై కూడా దాడి చేశాడు. ఐదుగురు తీవ్ర గాయాలపాలై ప్రాణాలు విడిచారు.
బళ్లారి సెషన్స్ కోర్టు 36 మంది సాక్షులను విచారించి తిప్పయ్యను దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పింది. ఆ తరువాత ఈ రోజు కర్ణాటక హైకోర్టు కూడా ఇదే తీర్పును వెలవరించింది. ఈ హత్యకాండలో ప్రాణాలతో బయటపడిన ఏకైక చిన్నారి రాజేశ్వరికి పరిహారం చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తాజావార్తలు
-
AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వడ్డీ లేని రుణం..
-
Vijay Varma: హీరో కాకముందు కాస్టింగ్ కౌచ్.. విజయ్ వర్మ షాకింగ్ వ్యాఖ్యలు.. హైదరాబాద్లో జరిగిన ఘటన ఏంటి?
-
Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
-
Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
-
Salman Khan: రూ.120 కోట్ల నుంచి రూ.70 కోట్లకు సల్మాన్ పారితోషికం.. అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!