Wrestlers Protest: సమస్యలు పరిష్కారమైతేనే ఆసియా గేమ్స్ లో పాల్గొంటాం.. రెజ్లర్ల అల్టిమేటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్ చేయాలని పలువురు రెజ్లర్లు గత కొంత కాలంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇటీవల బ్రిజ్ భూషన్ పై చర్యలను కోరుతూ రెజ్లర్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో సమావేశం అయ్యారు. ఇదిలా ఉంటే సమస్యలు పరిష్కారం అయితేనే తనతో సహా రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ ఆసియా క్రీడల్లో పాల్గొంటామని ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ శనివారం తెలిపారు.
Read Also: Karnataka High Court: అనుమానంతో భార్య, పిల్లల హత్య.. చనిపోయేదాకా ఉరితీయాలని కోర్టు తీర్పు..
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్పై కేసు ఛార్జిషీట్ను ప్రస్తావిస్తూ, రెజ్లర్ బజరంగ్ పునియా మాట్లాడుతూ, జూన్ 15 లోపు చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పామని ఆయన తెలిపారు. ఇటీవల అనురాగ్ ఠాకూర్ తో సమావేశం అయ్యారు రెజ్లర్లు. బుధవారం జరిగిన ఈ సమావేశంలో జూన్ 15లోగా ఛార్జిషీట్ దాఖలు చేస్తారని అనురాగ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. జూన్ 30లోగా డబ్ల్యుఎఫ్ఐ ఎన్నికలు నిర్వహిస్తామని రెజ్లర్లకు చెప్పారు. కేంద్రమంత్రి హామీ మేరకు జూన్ 15 వరకు నిరసనలను విరమించారు రెజ్లర్లు.
ఈ కేసులో బ్రిజ్ భూషణ్ పై విచారణ ప్రారంభం అయింది. శుక్రవారం రెజ్లర్ సంగీతా ఫోగట్ ను ఢిల్లీ పోలీసులు సీన్ రీ క్రియేట్ చేయడానికి బ్రిజ్ భూషణ్ ఇంటికి తీసుకెళ్లారు. బ్రిజ్ శరణ్ తన కండబలం, రాజకీయ బలాన్ని ఉపయోగిస్తూ మహిళా రెజ్లర్లను వేధిస్తున్నాడని, అతడిని అరెస్ట్ చేయాల్సిందే అని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. మహిళా రెజ్లర్లు డబ్లూఎఫ్ఐతో రాజీకి వెళ్లారని వస్తున్న వార్తలను రెజ్లర్లు ఖండించారు. ఈ కేసు విచారణపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేశారు. వచ్చే వారంలోగా కోర్టుకు నివేదిక సమర్పించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!