Cyclone Biparjoy: 12 గంటల్లో అత్యంత తీవ్రమైన తుఫాన్గా “బిపార్జాయ్”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపార్జాయ్’ తుఫాన్ రానున్న 12 గంటల్లో అత్యంత తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం తెలిపింది. గుజరాత్ లోని పోర్బందర్ తీరానికి 200-300 కి.మీ దూరంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే ఐదురోజులు గుజరాత్ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు, బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.
ప్రస్తుతం తుఫాన్ పోర్ బందర్ తీరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. ప్రస్తుతానికి గుజరాత్ రాష్ట్రాన్ని తుఫాన్ తాకే ప్రమాదం లేదని ఐఎండీ తెలిపింది. రానున్న ఐదు రోజుల్లో మత్స్యకారులు అరేబియా సముద్రంలోకి వెళ్లవద్దని, అన్ని చేపల వేట కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం తుఫాన్ ఉత్తర దిశగా కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో ఈశాన్య దిశగా దాని మార్గాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఆ తరువాత ఉత్తర-వాయువ్య దిశగా వెళ్లే అవకాశం ఉంది.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
Read Also: Ravindra Jadeja: జడేజానా మజాకా.. తొలి భారత క్రికెటర్గా చరిత్ర
రానున్న ఐదు రోజలు పాటు గుజరాత్ లో వర్షం కురుస్తుందని, ముఖ్యంగా సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఐఎండీ ప్రకారం.. శనివారం ఉదయం 11.30 గంటలకు తూర్పు తూర్పు మధ్య అరేబియా సముద్రం మీద గోవాకు పశ్చిమ-వాయువ్యంగా 700 కి.మీ, ముంబైకి పశ్చిమ-నైరుతి దిశలో 620 కి.మీ, పోర్బందర్కు 590 కి.మీ నైరుతి-నైరుతి మరియు కరాచికి 900 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది.
వచ్చే 24 గంటల్లో మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా క్రమంగా కదులుతుందని, ఆ తరువాత మూడు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతుందని ఐఎండీ తెలిపింది. సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. ఆ తర్వాత జూన్ 13-15 తేదీల్లో ఈ ప్రాంతంలో ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గంటకు 30-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా పోర్బందర్ మరియు కచ్ మరియు జామ్నగర్ వంటి తీరప్రాంత జిల్లాలలో గంటకు 60 కి.మీ మరియు 75 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. పోర్బందర్, గిర్ సోమనాథ్, వల్సాద్ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!