Cyclone Biparjoy: 12 గంటల్లో అత్యంత తీవ్రమైన తుఫాన్గా “బిపార్జాయ్”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపార్జాయ్’ తుఫాన్ రానున్న 12 గంటల్లో అత్యంత తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం తెలిపింది. గుజరాత్ లోని పోర్బందర్ తీరానికి 200-300 కి.మీ దూరంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే ఐదురోజులు గుజరాత్ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు, బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.
ప్రస్తుతం తుఫాన్ పోర్ బందర్ తీరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. ప్రస్తుతానికి గుజరాత్ రాష్ట్రాన్ని తుఫాన్ తాకే ప్రమాదం లేదని ఐఎండీ తెలిపింది. రానున్న ఐదు రోజుల్లో మత్స్యకారులు అరేబియా సముద్రంలోకి వెళ్లవద్దని, అన్ని చేపల వేట కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం తుఫాన్ ఉత్తర దిశగా కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో ఈశాన్య దిశగా దాని మార్గాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఆ తరువాత ఉత్తర-వాయువ్య దిశగా వెళ్లే అవకాశం ఉంది.
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
Read Also: Ravindra Jadeja: జడేజానా మజాకా.. తొలి భారత క్రికెటర్గా చరిత్ర
రానున్న ఐదు రోజలు పాటు గుజరాత్ లో వర్షం కురుస్తుందని, ముఖ్యంగా సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఐఎండీ ప్రకారం.. శనివారం ఉదయం 11.30 గంటలకు తూర్పు తూర్పు మధ్య అరేబియా సముద్రం మీద గోవాకు పశ్చిమ-వాయువ్యంగా 700 కి.మీ, ముంబైకి పశ్చిమ-నైరుతి దిశలో 620 కి.మీ, పోర్బందర్కు 590 కి.మీ నైరుతి-నైరుతి మరియు కరాచికి 900 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది.
వచ్చే 24 గంటల్లో మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా క్రమంగా కదులుతుందని, ఆ తరువాత మూడు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతుందని ఐఎండీ తెలిపింది. సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. ఆ తర్వాత జూన్ 13-15 తేదీల్లో ఈ ప్రాంతంలో ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గంటకు 30-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా పోర్బందర్ మరియు కచ్ మరియు జామ్నగర్ వంటి తీరప్రాంత జిల్లాలలో గంటకు 60 కి.మీ మరియు 75 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. పోర్బందర్, గిర్ సోమనాథ్, వల్సాద్ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు.
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..