Pakistan: హిందువుల పరిస్థితి ఇంతే.. బాలిక కిడ్నాప్, మతమార్పిడి.. కన్నవారితో పంపేందుకు కోర్టు నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ లో హిందువుల పరిస్థితి దయనీయంగా మారింది. మైనారిటీలైన హిందువులు, సిక్కులు, క్రైస్తవులపై నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హిందూ బాలికను బలవంతంగా అపహరించి, మతం మార్చి, ముస్లిం వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం మైనారిటీల రక్షణకు కృషి చేయడం లేదు. పోలీసుల దగ్గర నుంచి కోర్టుల వరకు హిందువులకు న్యాయం దక్కడం లేదు.
పాకిస్తాన్ సింధ్ ప్రావిన్సులో కిడ్నాప్ చేయబడి, ఇస్లాం మతంలోకి మార్చబడి, ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్న 14 ఏళ్ల బాలికను జిల్లా కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే తన తల్లిదండ్రులతో పంపాలని బాలిక కోర్టును వేడుకున్నా కూడా అక్కడి న్యాయస్థానం కనికరించలేదు. తల్లిదండ్రులతో పంపడానికి నిరాకరించింది. పెళ్లైన వ్యక్తితో వెళ్లాలని ఆదేశించింది. 14 ఏళ్ల బాలిక సోహనా శర్మ కుమారిని జూన్ 2న దక్షిణ సింధ్ ప్రావిన్స్లోని బెనజీరాబాద్ జిల్లాలోని తన ఇంటి నుండి ఆమె తల్లి ఎదుట ఆమె ట్యూటర్, అతని సహచరులు తుపాకీతో కిడ్నాప్ చేశారు.
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
Read Also: Earthquake: ఫిజీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 5.9గా నమోదు
తన కుమార్తెను కిడ్నాప్ చేసినట్లు ఆమె తండ్రి దిలీప్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బలవంతంగా తన మతం మార్చి, ముస్లిం వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారని కోర్టుకు బాలిక చెప్పినా పట్టించుకోలేదు. బలవంతంగా పెళ్లి చేసుకున్న వ్యక్తికి అప్పటికే ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నారని, కూలీ పని చేస్తున్నాడని ఒక సందర్భంలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె తండ్రి తెలిపారు. ఈ బాలిక ఉదంతంపై సోషల్ మీడియాలో వ్యతిరేకత రావడంతో పోలీసులు స్పందించి, బాలికను రెస్క్యూ చేశారు. ఈ కేసును కోర్టు జూన్ 12కు వాయిదా వేసింది. ఇస్లాంలో చేరి, ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవడానికి దాఖలు చేసిన పత్రాలన్నీ నకిలివేనని బాలిక తండ్రి కోర్టుకు తెలిపారు.
ముఖ్యంగా సింధ్ ప్రాంతంలో హిందూ బాలికలు, యువతలను కిడ్నాప్ చేస్తూ ఇస్లాంలోకి మార్చి, బలవంతంగా వారి కన్నా ఎంతో పెద్దవారైన ముస్లిం వ్యక్తులకు ఇచ్చి పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో అక్కడి పోలీసులు స్పందించపోవడంతో కిడ్నాప్ అయిన అమ్మాయిల ఆచూకీ లభించడం దాదాపుగా కష్టంగా మారింది. గత ఏడాది నుంచి షీలా మేఘ్వార్, చందా మహారాజ్, సిమ్రాన్ కుమారి, పూజా కుమారి, సత్రన్ ఓడ్, కవితా భీల్ , సోహనా అనే బాలికలు కిడ్నాప్ కు గురయ్యారు. వీరంతా తక్కువ వయసు ఉన్న బాలికలే. పాక్ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ దేశంలో 75 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!