AAP: ఈసారి మోడీ గెలిస్తే “నరేంద్ర పుతిన్” అవుతాడు.. సీఎం హెచ్చరిక..
AAP: కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆదివారం మహా ర్యాలీ నిర్వహించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభలో ఈ ఆర్డినెన్స్ ను అడ్డుకునేందుకు ప్రతిపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు నిర్వహించిన మహార్యాలీలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీలపై కేజ్రవాల్ విరుచుకుపడ్డాడు. కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ గెలిచి మళ్లీ మోడీ ప్రధాని అయిీతే అతను ‘‘నరేంద్ర పుతిన్’’ అవుతారని అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పోలుస్తూ నియంతలా మారుతారంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు మోడీని ‘రాజు’గా పరిణించడం మొదలుపెట్టారని ఆయన అన్నారు. 140 కోట్ల మంది భారతీయులు దేశాన్ని రక్షించాలని నిర్ణయించుకుంటేనే, దేశం రక్షించబడుతుందని మాన్ వ్యాఖ్యానించారు.
Also Read
Read Also: CM Kejriwal : సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రజల తరఫున జరిగిన 8 ఏళ్ల పోరాటం ఫలించింది
గత నెలలో ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా.. సివిల్ సర్వెంట్ల నియామకం, బదిలీలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండాలంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పు తరువాత కేంద్రం బదిలీలు, నియామకాలపై కొత్తగా ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీంతో మరోసారి కేంద్రం, ఢిల్లీలోని ఆప్ సర్కార్ మధ్య ఘర్షణ మొదలైంది. ఆరు నెలల్లో ఆర్ఢినెన్సును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చట్టంగా మార్చాలి. అయితే ప్రస్తుతం లోక్ సభలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. రాజ్యసభలో ప్రతిపక్షాల బలం ఎక్కువగా ఉండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రతిపక్షాల సాయం కోరుతున్నారు.
తాజాగా ఆదివారం ఆప్ ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో ‘మహా ర్యాలీ’ నిర్వహించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ ఆప్ నేత, మంత్రి గోపాల్ రాయ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ర్యాలీలో ప్రసంగించారు. ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలని కోరుతూ, కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని పునరాలోచించాలని, ఢిల్లీ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆప్ పేర్కొంది.
తాజావార్తలు
-
Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
-
FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
-
Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
-
Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
-
Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!