Long Covid-19: షుగర్ ఔషధంతో లాంగ్ కోవిడ్కు చెక్.. అధ్యయనంలో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Long Covid-19: కోవిడ్ 19 వ్యాధి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. చైనాలోని వూహాన్ నగరంలో 2019లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్, అనతికాలంలోనే ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. దీని వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా తన రూపాలను మార్చుకుంటూ, వివిధ వేరియంట్ల రూపంలో మనుషులపై అటాక్ చేసింది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో కోవిడ్ సంక్రమిస్తూనే ఉంది.
Read Also: Supernova: విశ్వంలో భారీ నక్షత్రం పేలుడు.. “సూపర్ నోవా”ను గుర్తించిన జపాన్ శాస్త్రవేత్తలు
Also Read
- Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
అయితే వ్యాక్సినేషన్ ద్వారా ప్రజలు ప్రస్తుతం కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. అయితే దీర్ఘకాలిక కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. కొన్ని సార్లు లాంగ్ కోవిడ్, క్యాన్సర్ కన్నా ప్రమాదకరంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరిశోధకులు లాంగ్ కోవిడ్ విషయంలో ఓ విషయాన్ని కనుగొన్నారు. సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులు వాడే ఔషధం ‘మెట్ ఫార్మిన్’ లాంగ్ కోవిడ్ కు చెక్ పెడుతున్నట్లుగా తేలింది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ‘ ద లాన్సెట్ ఇన్ఫెక్షస్ డిసీజెస్’లో ప్రచురితమయ్యాయి. మెట్ఫార్మిన్ వాడటం వల్ల 10 నెలల్లో దాదాపుగా 40 శాతం మేర లాంగ్ కోవిడ్ ముప్పు తగ్గుతుందని వెల్లడైంది.
ఈ అధ్యయనం కోసం ఊబకాయం కారణంగా తీవ్ర కోవిడ్ ముప్పు పొంచి ఉన్న 30 ఏళ్లకు పైబడిన వారిపై స్టడీ చేశారు. కొందరికి మెట్ఫార్మిన్ మందును ఇచ్చి, మరికొందరికి సాధారణ మందులు ఇచ్చారు. ఆ తరువాత 10 నెలల పాటు వీరిని పరిశోధకులు గమనించారు. 30 రోజులకు ఒకసారి కొన్ని ప్రశ్నలను పంపి, వారి నుంచి వివరాలను సేకరించారు. సాధారణ మందులు వాడిన వారితో పోలిస్తే, మెట్ఫార్మిన్ వాడిన వారిలో తక్కువ మంది లాంగ్ కోవిడ్ బారినపడినట్లు గుర్తించారు. దీని వల్ల ఐసీయూలో చేరాల్సిన అవసరం 40 శాతం మేర తగ్గినట్లు వెల్లడైంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..