IndiGo: పాకిస్తాన్లోకి వెళ్లిన ఇండిగో ఎయిర్లైన్స్ విమానం.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo: అమృత్సర్ నుండి అహ్మదాబాద్కు వెళ్లే ఇండిగో ఎయిర్లైన్స్ పాకిస్తాన్ లోకి వెళ్లింది. ప్రతికూల వాతావరణం కారణంగా లాహోర్ సమీపం వరకు వెళ్లి తిరిగి భారత భూభాగంలోకి వచ్చింది. భారత గగనతలంలోకి తిరిగి వచ్చే ముందు పాకిస్తాన్ లోని గుజ్రాన్ వాలా వరకు వెళ్లిందని పాక్ మీడియా పేర్కొంది. ఫ్లైట్ రాడార్ ప్రకారం.. 454 నాట్ల వేగంతో భారత విమానం శనివారం రాత్రి 7.30 గంటలకు లాహోర్ కు ఉత్తర దిశగా ప్రవేశించి రాత్రి 8.01 గంటలకు భారతదేశానికి తిరిగి వెళ్లినట్లు అక్కడి డాన్ వార్తా పత్రిక నివేదించింది. అయితే ఈ వ్యవహారంపై విమానయాన సంస్థ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ల డేటా ప్రకారం, రాత్రి 7:45 గంటలకు అమృత్సర్ నుండి టేకాఫ్ అయిన వెంటనే విమానం దాని మార్గం నుండి తప్పుకుంది. ఇండిగో విమానం గుజ్రాన్వాలా మీదుగా ప్రయాణించి, పంజాబ్లోని శ్రీ ముక్త్సర్ సాహిబ్ నగరానికి సమీపంలో భారత గగనతలానికి తిరిగి వచ్చింది. బ్యాడ్ వెదర్ కారణంగా ఇలా జరిగింది.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
- Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
Read Also: Long Covid-19: షుగర్ ఔషధంతో లాంగ్ కోవిడ్కు చెక్.. అధ్యయనంలో వెల్లడి..
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఇలా వేరే దేశ భూభాగంలోకి వెళ్లేందుకు అంతర్జాతీయంగా అనమతించబడిందని ఇది సాధారణమే అని సివిల్ ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు. ఇలాగే మే నెలలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(పీఐఏ)కి చెందిన ఓ విమానం ఇలాగే భారత గగనతలంలో 10 నిమిషాల పాటు ప్రయాణించింది. పాకిస్తాన్ లో భారీ వర్షాల కారణంగా, వాతావరణం బాగా లేకపోవడంతో భారత గగనతలంలోకి పాక్ విమానం ప్రవేశించింది. PK248 అనే విమానం మే 4న మస్కట్ నుంచి లాహోర్ లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే సమయంలో భారీ వర్షం కారణంగా పైలట్ ల్యాండింగ్ చేయలేకపోయాడు. విజిబిలిటీ సరిగ్గా లేకపోవడంతో బోయింగ్ 777 విమానం భారత గగనతలంలోకి వచ్చింది.
ప్రస్తుతం బిపార్జాయ్ తుఫాన్ కారణంగా పాకిస్తాన్ లోని లాహెర్ నగరంలో పరిస్థితులు సరిగ్గా లేవు. శనివారం రాత్రి నుంచి విజిబిలిటీ సరిగ్గా లేకపోవడంతో పలు విమానాలను లాహోర్ నుంచి ఇస్లామాబాద్ కు మళ్లించారు. శనివారం పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షాల కారణంగా దాదాపుగా 29 మంది ప్రజలు మరణించించారు.
తాజావార్తలు
-
Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Market Crash: స్విగ్గీ, జొమాటోలకు రూ.1.41 లక్షల కోట్ల భారీ లాస్.. ఏం జరిగిందంటే?
-
Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!