Israel-Hamas War: ఇజ్రాయిల్పై హమాస్ తీవ్రవాదులు శనివారం భీకరదాడులకు పాల్పడ్డారు. ఈ దాడులకు ప్రతీకారంగా గాజా స్ట్రిప్పై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) విరుచుకుపడుతోంది. గాజాలోని ప్రముఖ భవనాలను బాంబులతో కుప్పకూలుస్తోంది. ఈ దాడులకు ప్రధాన సూత్రధారి, హమాస్ మిలిటరీ వింగ్ చీఫ్ మహ్మద్ డయిఫ్ ఇంటిని టార్గెట్ చేసింది ఇజ్రాయిల్. ఈ దాడిలో డయిఫ్ కుటుంబ సభ్యులు మరణించినట్లుగా హమాస్ ధృవీకరించింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఇరు వైపుల మరణాల సంఖ్య 3000ను దాటింది.
Himanta Biswa Sarma: పాలస్తీనాకు మద్దతు ఇస్తూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తీర్మానం చేసింది. అయితే ఈ తీర్మానంపై అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ సర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రకటన పాకిస్తాన్, తాలిబాన్ ప్రకటనల్ని పోలి ఉందని ఆరోపించారు.
NIA: ఖలిస్తాన్ ఉగ్రవాదులు, మద్దతుదారులపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే)చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూకు సంబంధించిన, అతని కుటుంబం, సన్నిహితులకు సంబంధించిన ఆస్తుల్ని ఎన్ఐఏ జప్తు చేసింది.
India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య దౌత్యవివాదాన్ని పెంచింది. ఇప్పటికే ఈ రెండు దేశాలు ఉప్పునిప్పుగా ఉన్నాయి. మరోవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన చర్యల ద్వారా ఇండియాను మరింతగా రెచ్చగొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా-కెనడా విదేశాంగ మంత్రుల మధ్య అమెరికా వేదికగా రహస్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
Israel: హమాస్ ఉగ్రవాదుల చేసిన దుశ్చర్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది యుద్ధం కాదు, ఊచకోతలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తలను తెగనరికారు. ఒక కిబుట్జ్లో ఏకంగా 40 మంది చిన్నారులను దారుణంగా చంపేశారు. కొందరు తలలు వేరి చేసి ఉన్నట్లు అక్కడికి వెళ్లిన మీడియా సంస్థల ప్రతినిధులు తెలిపారు.
Aligarh Muslim University: ఇజ్రాయిల్- పాలస్తీనా హమాస్ యుద్ధంలో ఇండియాలోని ప్రజలు కూడా ఇరుపక్షాలకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)లో పాలస్తీనాకు మద్దతుగా కొందరు విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం వివాదాస్పదమైంది. పాలస్తీనాకు సంఘీభావం తెలిపేందుకు పలువరు విద్యార్థులు సోమవారం మార్చ్ నిర్వహించినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Israel War: ఇజ్రాయిల్పై హమాస్ మిలిటెంట్లు భీకరదాడికి పాల్పడ్డారు. బలమైన సైన్యం, టెక్నాలజీ, మెస్సాద్ వంటి ఇంటెలిజెన్స్ సంస్థ ఉన్నప్పటికీ.. ఇలాంటి దాడిని ఊహించలేకపోయింది. అంత పకడ్భందీగా హమాస్ గాజా నుంచి కేవలం నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లను ప్రయోగించింది.
Khalistan: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిన్(ఎస్జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారతదేశాన్ని, ప్రధాని నరేంద్రమోడీని హెచ్చరిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్ పై హమాస్ తీవ్రవాదుల దాడిని పోలుస్తూ, ప్రధాని మోడీ ఈ దాడి నుంచి నేర్చుకోవాలని బెదిరించాడు. ఇలాంటి దాడి రాకుండా చూసుకోవాలంటూ బీరాలు పలికాడు.
israel-palestine conflict : ఇజ్రాయిల్- పాలస్తీనా హమాస్ ఉగ్రవాదుల మధ్య తీవ్ర యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే భారత్, అమెరికా, యూకే, జర్మనీ వంటి దేశాలు పాలస్తీనాకు మద్దతు తెలుపగా.. ఇరాన్, యెమెన్, సౌదీ, ఖతార్ వంటి ముస్లిం రాజ్యాలు పాలస్తీనా వైపు ఉన్నాయి. అయితే ఇండియా ఇప్పటికే మిత్రదేశం ఇజ్రాయిల్ కి మద్దతు తెలిపింది. ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయిల్కి అండగా ఉంటానమి, ఆ దేశ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుతో ఫోన్ లో చెప్పారు.
Putin: మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇజ్రాయిల్ పై హమాస్ మిలిటెంట్లు శనివారం భారీ దాడికి తెగబడ్డారు. కేవలం 20 నిమిషాల్లోనే 5000 వేల రాకెట్లను ప్రయోగించారు. ఈ పరిణామంతో ఇజ్రాయిల్ షాకైంది. అయితే తేరుకునేలోపే వందల మందిని సరిహద్దు దాటి వచ్చిన మిలిటెంట్లు పిట్టల్లా కాల్చి చంపారు. 1000 మంది వరకు ఇజ్రాయిల్ ప్రజలు మరణించారు. మరోవైపు ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకర దాడులు నిర్వహిస్తోంది.