Khalistan: “ఇండియాపై హమాస్ లాంటి దాడి”.. ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూ బెదిరింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిన్(ఎస్జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారతదేశాన్ని, ప్రధాని నరేంద్రమోడీని హెచ్చరిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్ పై హమాస్ తీవ్రవాదుల దాడిని పోలుస్తూ, ప్రధాని మోడీ ఈ దాడి నుంచి నేర్చుకోవాలని బెదిరించాడు. ఇలాంటి దాడి రాకుండా చూసుకోవాలంటూ బీరాలు పలికాడు.
పంజాబ్ నుంచి పాలస్తీనా వరకు చట్టవిరుద్దమైన ఆక్రమణలో ఉన్న వ్యక్తులు ఇలాగే స్పందిస్తారని, హింస హింసను ప్రేరేపిస్తుందని ఓ వీడియోలో చెబుతూ కనిపించాడు.భారత్ పంజాబ్ ను ఆక్రమించడం కొనసాగిస్తే ప్రతిస్పందన ఉంటుందని భారత్, ప్రధాని మోడీనే దీనికి బాధ్యత వహించాలని పన్నూన్ హెచ్చరించాడు. సిక్ ఫర్ జస్టిస్ ఓటు-బ్యాలెట్ ను విశ్వసిస్తుందని, పంజాబ్ విముక్తికి సిద్ధంగా ఉందని పిచ్చి వాగుడు వాగాడు. బ్యాలెట్ కావాలో బుల్లెట్ కావాలో భారత్ మీరే తేల్చుకోండంటూ సవాల్ విసిరాడు.
Also Read
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత పన్నూ భారత్ పై పలుమార్లు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్లను బెదిరిస్తూ గతంలో వీడియోలు చేశారు. ఇటీవల ఇండియా నిర్వహిస్తున్న వరల్డ్ కప్ 2023 మ్యాచుల ముందు కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై అహ్మదాబాద్ లో కేసు నమోదైంది.
అమృత్సర్ లో జన్మించిన పన్నూ ప్రస్తుతం యూఎస్ లో ఆశ్రయం పొందుతున్నాడు. పంజాబ్ లో జరిగిన పలు ఉగ్రవాద ఘటనలకు ఇతనితో సంబంధం ఉంది. పాక్ ఐఎస్ఐతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇతనిపై ఎన్ఐఏ పలు కేసుల్ని పెట్టింది. ఇటీవల ఇతనికి, ఇతని కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తుల్ని ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. కేంద్రం ఇతడిని ఉగ్రవాదిగా గుర్తించింది. 2021లో ఎన్ఐఏ ఇతనిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
తాజావార్తలు
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!