IND vs NZ: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. భారత్- న్యూజిలాండ్ మ్యాచ్కి అక్కడ ప్రత్యేక టిక్కెట్లు..
- ఇండోర్ లో జరిగే వన్డే మ్యాచ్ టికెట్లు పూర్తిగా ఆన్లైన్లో విక్రయం..
- భారత్- న్యూజిలాండ్ మ్యాచ్కి విద్యార్థుల కోసం ప్రత్యేక టికెట్లు..
- విద్యార్థులు, దివ్యాంగుల కోసమే స్పెషల్ ఆఫర్ ప్రకటించిన MPCA
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ: న్యూజిలాండ్ జట్టు జనవరి 11వ తేదీ నుంచి భారత్లో పర్యటించబోతుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, 5 టీ 20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత్- కివిస్ మధ్య జరగనున్న మూడు వన్డేల సిరీస్లో చివరి మ్యాచ్కు సంబంధించిన టికెట్ల విక్రయాలపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) కీలక ప్రకటన చేసింది. జనవరి 18వ తేదీన ఇండోర్లోని ప్రసిద్ధ హోల్కర్ స్టేడియంలో జరిగే మూడో వన్డే మ్యాచ్ టికెట్లు పూర్తిగా ఆన్లైన్లో మాత్రమే విక్రయిస్తామని స్పష్టం చేసింది. ఈ మ్యాచ్ 2026 సంవత్సరంలో భారత్ జట్టు ఆడే తొలి అంతర్జాతీయ క్రికెట్ సిరీస్కు ముగింపు కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. కాగా, ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్లు వడోదర, రాజ్కోట్లలో జరగనుండగా, ఇండోర్లో జరిగే మూడో వన్డే డే-నైట్ మ్యాచ్ అభిమానులను అలరించనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక టికెట్ సౌకర్యాలను MPCA అందుబాటులోకి తీసుకొచ్చింది.
Read Also: Smriti Mandhana: 45 రోజులుగా నిద్రలేని రాత్రులు.. ఎన్నో అనుభవించాం.. స్మృతి సంచలన కామెంట్స్..!
Also Read
- KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
- KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
- KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు.. టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
- Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
విద్యార్థులకు ప్రత్యేక రాయితీ టికెట్లు..
ఈస్ట్ స్టాండ్ లోయర్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో విద్యార్థుల కోసం పరిమిత సంఖ్యలో రాయితీ టికెట్లు అందుబాటులో ఉంటాయి.
ఈస్ట్ స్టాండ్ (లోయర్): రూ.750
ఈస్ట్ స్టాండ్ (సెకండ్ ఫ్లోర్): రూ.950
అయితే, ప్రతి విద్యార్థికి ఒక్క టికెట్ మాత్రమే అనుమతి ఉంటుంది. విద్యార్థులు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసి, చెల్లుబాటు అయ్యే స్టూడెంట్ గుర్తింపు కార్డు లేదా అకడమిక్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొనింది. MPCA ధృవీకరణ తర్వాత వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ లింక్ పంపబడుతుంది.. రిజిస్ట్రేషన్ డిసెంబర్ 31, 2025 ఉదయం 11 గంటల నుంచి జనవరి 1, 2026 సాయంత్రం 5 గంటల వరకు లేదా కోటా పూర్తయ్యే వరకు కొనసాగుతుంది అని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తెలియజేసింది.
Read Also: DGP Harish Kumar Gupta: గత ఏడాదితో పోలిస్తే… ఈ ఏడాది క్రైమ్ రేట్ బాగా తగ్గింది-డీజీపీ
దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు
ఇక, దివ్యాంగుల కోసం నార్త్-ఈస్ట్ గ్యాలరీలో రూ.300 ధరతో ప్రత్యేక టికెట్లను మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కేటాయించింది. ప్రభుత్వ జారీ చేసిన వైకల్య సర్టిఫికెట్ను అప్లోడ్ చేయడం తప్పనిసరిగా చేసింది. వీల్చైర్ అవసరమైతే, వాటిని స్వయంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది.
సాధారణ టికెట్ల ధరలు
ఈ మ్యాచ్కు సాధారణ టికెట్లు రూ.800 నుంచి రూ.7,000 వరకు ఉన్నాయి. అన్ని రకాల టికెట్లు ‘డిస్ట్రిక్ట్ బై జొమాటో’ అనే అధికారిక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మాత్రమే విక్రయిస్తారు.
టికెట్ ధరల వివరాలు:
సౌత్ పావిలియన్ (లోయర్): రూ.5,500
సౌత్ పావిలియన్ (ఫస్ట్ ఫ్లోర్): రూ.7,000
సౌత్ పావిలియన్ (సెకండ్ ఫ్లోర్): రూ.6,500
సౌత్ పావిలియన్ (థర్డ్ ఫ్లోర్): రూ.5,000
ఈస్ట్ స్టాండ్ (లోయర్ – చైర్స్): రూ.800
ఈస్ట్ స్టాండ్ (ఫస్ట్ ఫ్లోర్ ప్రీమియం): రూ.1,250
ఈస్ట్ స్టాండ్ (ఫస్ట్ ఫ్లోర్ రెగ్యులర్): రూ.1,100
ఈస్ట్ స్టాండ్ (సెకండ్ ఫ్లోర్): రూ.1,000
వెస్ట్ స్టాండ్ (లోయర్ – చైర్స్): రూ.900
వెస్ట్ స్టాండ్ (ఫస్ట్ ఫ్లోర్ ప్రీమియం): రూ.1,500
వెస్ట్ స్టాండ్ (ఫస్ట్ ఫ్లోర్ రెగ్యులర్): రూ.1,400
వెస్ట్ స్టాండ్ (సెకండ్ ఫ్లోర్): రూ.1,250
అయితే, ఇండోర్ వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. గాయాల నుంచి కోలుకుంటున్న శుభ్మన్ గిల్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఈ సిరీస్కు సంబంధించిన భారత జట్టును జనవరి తొలి వారంలో బీసీసీఐ ప్రకటించనుంది. వన్డే సిరీస్ అనంతరం భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. కాగా, ఇది ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్కు ముందు టీమిండియాకు చివరి సిరీస్ కావడం విశేషం.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!