India-Canada: యూఎస్ వేదికగా ఇండియా-కెనడా విదేశాంగ మంత్రుల రహస్య సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య దౌత్యవివాదాన్ని పెంచింది. ఇప్పటికే ఈ రెండు దేశాలు ఉప్పునిప్పుగా ఉన్నాయి. మరోవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన చర్యల ద్వారా ఇండియాను మరింతగా రెచ్చగొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా-కెనడా విదేశాంగ మంత్రుల మధ్య అమెరికా వేదికగా రహస్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్, కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ మధ్య రెండు రోజుల క్రితం వాషింగ్టన్ లో రహస్య సమావేశం నిర్వహించారు. అయితే రెండు దేశాలు ఇప్పటి వరకు ఈ సమావేశాన్ని ధృవీకరించలేదు. కెనడా దౌత్యవేత్తలు పలువురిని ఇండియా వదిలివెళ్లాల్సిందిగా ఆదేశించిన నేపథ్యంలో, వారి దౌత్యపరమైన రక్షణలు తొలగించే ప్రమాదం ఉన్న సమయంలో భారతదేశంతో దౌత్య పరిస్థితిని పరిష్కరించడానికి కెనడా ప్రయత్నిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
Also Read
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
- Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
- TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
Read Also:Eggs storing : ఎక్కువ రోజులు గుడ్లు ఫ్రెష్ గా ఉండాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..
ఇటీవల దౌత్య ఉద్రిక్తతలపై ఇండియాతో ప్రైవేటుగా మాట్లాడుకుంటామని కెనడా ప్రకటించిన తరుణంలో ఈ సమావేశానికి సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా భారతదేశంతో ఉద్రిక్తతలను పెంచుకోవడం తమ ఉద్దేశం కాదని వెల్లడించారు. ఇదిలా ఉంటే ట్రూడో మాటలకు చేతలకు సంబధం ఉండటం లేదు. ఇటీవల యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజుతో భారత దేశ అంశాన్ని చర్చించాడు. దీనిపై ఇండియా తీవ్రం ఆగ్రహంతో ఉంది.
ఈ ఏడాది జూన్ నెలలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కెనడాలోని సర్రే ప్రాంతంలో కాల్చి చంపారు. అయితే ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించడం ఒక్కసారిగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. అయితే కెనడా ఆరోపణల్ని భారత్ అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా నిలుస్తోందని భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!