Israel: గాజాపై విరుచుకుపడేందుకు ఇజ్రాయిల్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. శనివారం హమాస్ టెర్రరిస్టులు జరిపిన దాడిలో 900 మంది వరకు ఇజ్రాయిల్ ప్రజలు చనిపోయారు. ఇదిలా ఉంటే భారీ స్థాయిలో యుద్ధం చేసేందుకు ఇజ్రాయిల్ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే తాము యుద్ధంలో ఉన్నామని ఆ దేశ ప్రధాని బెంజిమెన్ నెతన్యహూ ప్రకటించాడు. యుద్ధం మీరు మొదలుపెట్టారు, తాము ముగిస్తామని హమాస్కి వార్నింగ్ ఇచ్చారు.
Bigg Boss: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు వివాదంగా మారాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కన్నడ బిగ్బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడం పొలిటికల్ దుమారాన్ని రేపుతోంది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే బిగ్బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేయడంతో దుమారం చెలరేగింది. ఎమ్మెల్యే కంటెస్టెంట్గా రియాలిటీ షోలోకి ప్రవేశించినట్లుగా ఊహాగానాలు వెల్లువెత్తాయి.
5 రాష్ట్రాల ఎన్నికలకు ఎల క్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చాలా కీలకం కాబోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
Israel-Hamas: ఇజ్రాయిల్పై హమాస్ ఉగ్రవాదుల దాడి భీకర యుద్ధానికి దారి తీసింది. శనివారం తెల్లవారుజామున హమాస్ మిలిటెంట్లు గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయిల్ పైకి రాకెట్లతో దాడి జరిపారు. ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ని ఏమార్చి సరిహద్దులు దాటి ఇజ్రాయిల్ పౌరులను చంపారు. పలువురిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు.
Gang War: ఢిల్లీలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. భాయ్ అని పిలువనందుకు ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేశాడు ఏ వ్యక్తి. వివరాల్లోకి వెళితే రఘు, జాకీర్, భూరా అనే ముగ్గురు వ్యక్తులు సోమవారం డబ్లూ అనే వ్యక్తిని కలవడానికి ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతానికి వెళ్లారు. ముగ్గురూ ఆ ప్రాంతంలో డబ్లు కోసం వెళ్లారు.
India Growth: ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధి రేటులకు ఢోకా లేదని, భారతదేశం ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంటుందని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 2023లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 6.3 శాతంగా ఉంటుందని తెలిపింది. గతంలోని అంచనాలను సవరించింది. ఏప్రిల్ నెలలో ఊహించినదాని కన్నా బలమైన వినియోగాన్ని భారత మార్కెట్ లో
Hurun India Rich List 2023: రిలియన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇండియా కుబేరుల్లో మొదటిస్థానంలో నిలిచారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి మొదటిస్థానంలో నిలిచారు. గతేడాది మొదటిస్థానంలో అదానీ ఉన్నారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు వచ్చిన తర్వాత గౌతమ్ అదానీ సంపద హెచ్చుతగ్గులకు ప్రభావితమైంది. దీంతోనే ఈ ఏడాది ఇండియా అత్యధిక ధనవంతుల జాబితాలో ముకేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది.
Israel-Hamas: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇరు పక్షాలు ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటున్నాయి. ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. యుద్ధాన్ని హమాస్ మొదలుపెట్టింది, మేము ముగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. హమాస్ ఉగ్రసంస్థను నెతన్యాహు ఐసిస్తో పోల్చారు. మేము యుద్ధాన్ని కోరుకేలేదు,
PM Modi:ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూతో భారత ప్రధాని నరేంద్రమోడీ ఫోన్కాల్ లో మాట్లాడారు. ఇజ్రాయిల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారతదేశం అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని ఖండిస్తోందని నరేంద్రమోడీ అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
Israel: ఇజ్రాయిల్, హమాస్ ఉగ్రవాదులకు మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. శనివారం ఉదయం ఇజ్రాయిల్ పైకి హమాస్ ఏకంగా 5000 రాకెట్లతో గాజా స్ట్రిప్ నుంచి దాడి నిర్వహించింది. ఉగ్రవాదులు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి వందల సంఖ్యలో ఇజ్రాయిల్ పౌరులను బందీలుగా చేసుకుని గాజాకు తీసుకెళ్లారు.